ETV Bharat / city

రాష్ట్రంలో లక్షా 45 వేల 425 మందికి కొవిడ్ టీకా

కొవిడ్ టీకా పంపిణీ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతోంది. శనివారం నాటికి లక్షా 45 వేల 425 మందికి వ్యాక్సిన్ వేసినట్టుగా వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

author img

By

Published : Jan 24, 2021, 11:23 AM IST

covid vaccination process across the state
రాష్ట్రంలో లక్షా 45 వేల 425 మందికి కొవిడ్ టీకా

రాష్ట్ర వ్యాప్తంగా కొవిడ్ వాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. శనివారం మొత్తం 12 వేల 807 మందికి కొవిషీల్డ్ టీకా​ను అందించినట్టు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ఈ వ్యాక్సిన్​ను 720 సెషన్ సైట్లలో వేసినట్టు చెప్పారు. మరో 11 సెషన్ సైట్లలో భారత్ బయోటెక్​కి చెందిన 355 కొవాక్సిన్ టీకాను అందించినట్లు పేర్కొన్నారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా లక్షా 45 వేల 425 మందికి వ్యాక్సిన్​ను వేసినట్లుగా వివరించారు.

జనవరి 23 నాటికి రాష్ట్రంలో అత్యధికంగా విశాఖపట్నంలో 2,167, తూర్పుగోదావరిలో 1,601 మందికి కొవిషీల్డ్ టీకాను వేశారు. గుంటూరులో 16, విశాఖపట్నంలో ఇద్దరు, విజయనగరంలో ముగ్గురికి వ్యాక్సిన్ అనంతరం కొంత ఇబ్బంది ఏర్పడినట్టు ప్రభుత్వం తెలియజేసింది.

రాష్ట్ర వ్యాప్తంగా కొవిడ్ వాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. శనివారం మొత్తం 12 వేల 807 మందికి కొవిషీల్డ్ టీకా​ను అందించినట్టు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ఈ వ్యాక్సిన్​ను 720 సెషన్ సైట్లలో వేసినట్టు చెప్పారు. మరో 11 సెషన్ సైట్లలో భారత్ బయోటెక్​కి చెందిన 355 కొవాక్సిన్ టీకాను అందించినట్లు పేర్కొన్నారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా లక్షా 45 వేల 425 మందికి వ్యాక్సిన్​ను వేసినట్లుగా వివరించారు.

జనవరి 23 నాటికి రాష్ట్రంలో అత్యధికంగా విశాఖపట్నంలో 2,167, తూర్పుగోదావరిలో 1,601 మందికి కొవిషీల్డ్ టీకాను వేశారు. గుంటూరులో 16, విశాఖపట్నంలో ఇద్దరు, విజయనగరంలో ముగ్గురికి వ్యాక్సిన్ అనంతరం కొంత ఇబ్బంది ఏర్పడినట్టు ప్రభుత్వం తెలియజేసింది.

ఇదీ చదవండి:

'రైతుల ఆదాయం పెంచేలా చర్యలు తీసుకుంటున్నాం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.