ETV Bharat / city

రాబడి అంచనాల్లో రూ.50 వేల కోట్లు హుష్‌

author img

By

Published : May 4, 2021, 10:25 AM IST

కరోనా ప్రభావం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో సుమారు రూ. 50 వేల కోట్ల మేర రాబడి తగ్గనుందని నిపుణులు అంచనా వేస్తున్నట్లు సమాచారం.

revenue
కరోనా ప్రభావం

రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కరోనా వ్యాప్తి ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. గత ఆర్థిక సంవత్సరం (2020-21)లో రెవెన్యూ రాబడి సుమారు రూ.50 వేల కోట్ల మేర తగ్గుతుందని అంచనా వేస్తున్నట్లు సమాచారం. కిందటి ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ రాబడి రూ.1,61,958 కోట్ల మేర సాధించవచ్చని ఆర్థికశాఖ అధికారులు లెక్కలు వేశారు. సంబంధిత తుది లెక్కలు ఇంకా కాగ్‌ పరిశీలనలో ఉన్నాయి. అంతిమ గణాంకాలు వెలువడాల్సి ఉంది. అయితే రాష్ట్ర ఆర్థికశాఖ అధికారుల సమాచారం మేరకు రెవెన్యూ రాబడి సుమారు రూ.1,12,000 కోట్లకే పరిమితమైంది. అంటే దాదాపు రూ.50 వేల కోట్ల మేర ఆదాయం తగ్గినట్లు అంచనా.

ఒకవైపు కరోనా వ్యాప్తి కారణంగా జరిగిన ఆర్థిక నష్టం (రూ.20వేల కోట్లు)... మరోవైపు ఖర్చు ఎక్కువుగా ఉండటంతో ఎన్నడూ లేనంతగా రెవెన్యూ లోటు ఏర్పడుతుందని చెబుతున్నారు. రాష్ట్రంలో జీఎస్టీ, స్టాంపులు రిజిస్ట్రేషన్ల ఆదాయం, అమ్మకపు పన్ను, కేంద్ర పన్నుల్లో వాటాలు, ఎక్సైజ్‌ డ్యూటీ, ఇతర పన్నుల ద్వారా వచ్చే ఆదాయాన్ని అంతా కలిపి రాష్ట్ర సొంత ఆదాయంగా లెక్కిస్తారు. ఇవికాకుండా పన్నేతర ఆదాయమూ, కేంద్రం నుంచి గ్రాంటుగా మంజూరయ్యే నిధులు కలిసి ఆ ఏడాదికి రాష్ట్ర రెవెన్యూగా ఉంటుంది.

సొంత పన్నుల ద్వారా రాష్ట్ర ఆదాయం రూ.80 వేల కోట్ల కన్నా తక్కువకే పరిమితమైంది. కేంద్ర గ్రాంట్లు సుమారు రూ.30 వేల కోట్ల వరకు వచ్చాయని ప్రాథమిక లెక్కలు పేర్కొంటున్నాయి. సాధారణంగా ఎప్పటికప్పుడు రెవెన్యూ రాబడి అంచనాలు పెంచుతూ బడ్జెట్‌ ప్రతిపాదనలు ఉంటాయి. అయితే 2022-21 ఆర్థిక సంవత్సరంలో అంతకుముందు ఏడాది కన్నా రెవెన్యూ రాబడి అంచనాలను ముందే తగ్గించుకున్నారు.

పూర్తిస్థాయి బడ్జెట్‌ ప్రవేశపెట్టే సమయానికే కొవిడ్‌ మహమ్మారి తన ప్రతాపం చూపడం ప్రారంభించింది. ఈ పరిస్థితుల్లో రాబడి తగ్గుతుందని ముందే భావించి అంచనాను పరిమితం చేశారు. 2019-20 ఏడాదిలో రెవెన్యూ రాబడి రూ.1,78,697 కోట్లుగా అంచనా వేశారు. ఆ ఏడాది కూడా సుమారు రూ.1,11,000 కోట్లే రాబడి సాధ్యమయింది. అంతకుముందు ఏడాది రూ.1,55,507 కోట్లు రాబడి అంచనా ఉంటే వాస్తవంగా సాధించింది సుమారు రూ.1,14,000 కోట్లే కావడం గమనార్హం.

ఇదీ చదవండి: రేషన్‌ పంపిణీకి బయోమెట్రిక్ భయం

రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కరోనా వ్యాప్తి ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. గత ఆర్థిక సంవత్సరం (2020-21)లో రెవెన్యూ రాబడి సుమారు రూ.50 వేల కోట్ల మేర తగ్గుతుందని అంచనా వేస్తున్నట్లు సమాచారం. కిందటి ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ రాబడి రూ.1,61,958 కోట్ల మేర సాధించవచ్చని ఆర్థికశాఖ అధికారులు లెక్కలు వేశారు. సంబంధిత తుది లెక్కలు ఇంకా కాగ్‌ పరిశీలనలో ఉన్నాయి. అంతిమ గణాంకాలు వెలువడాల్సి ఉంది. అయితే రాష్ట్ర ఆర్థికశాఖ అధికారుల సమాచారం మేరకు రెవెన్యూ రాబడి సుమారు రూ.1,12,000 కోట్లకే పరిమితమైంది. అంటే దాదాపు రూ.50 వేల కోట్ల మేర ఆదాయం తగ్గినట్లు అంచనా.

ఒకవైపు కరోనా వ్యాప్తి కారణంగా జరిగిన ఆర్థిక నష్టం (రూ.20వేల కోట్లు)... మరోవైపు ఖర్చు ఎక్కువుగా ఉండటంతో ఎన్నడూ లేనంతగా రెవెన్యూ లోటు ఏర్పడుతుందని చెబుతున్నారు. రాష్ట్రంలో జీఎస్టీ, స్టాంపులు రిజిస్ట్రేషన్ల ఆదాయం, అమ్మకపు పన్ను, కేంద్ర పన్నుల్లో వాటాలు, ఎక్సైజ్‌ డ్యూటీ, ఇతర పన్నుల ద్వారా వచ్చే ఆదాయాన్ని అంతా కలిపి రాష్ట్ర సొంత ఆదాయంగా లెక్కిస్తారు. ఇవికాకుండా పన్నేతర ఆదాయమూ, కేంద్రం నుంచి గ్రాంటుగా మంజూరయ్యే నిధులు కలిసి ఆ ఏడాదికి రాష్ట్ర రెవెన్యూగా ఉంటుంది.

సొంత పన్నుల ద్వారా రాష్ట్ర ఆదాయం రూ.80 వేల కోట్ల కన్నా తక్కువకే పరిమితమైంది. కేంద్ర గ్రాంట్లు సుమారు రూ.30 వేల కోట్ల వరకు వచ్చాయని ప్రాథమిక లెక్కలు పేర్కొంటున్నాయి. సాధారణంగా ఎప్పటికప్పుడు రెవెన్యూ రాబడి అంచనాలు పెంచుతూ బడ్జెట్‌ ప్రతిపాదనలు ఉంటాయి. అయితే 2022-21 ఆర్థిక సంవత్సరంలో అంతకుముందు ఏడాది కన్నా రెవెన్యూ రాబడి అంచనాలను ముందే తగ్గించుకున్నారు.

పూర్తిస్థాయి బడ్జెట్‌ ప్రవేశపెట్టే సమయానికే కొవిడ్‌ మహమ్మారి తన ప్రతాపం చూపడం ప్రారంభించింది. ఈ పరిస్థితుల్లో రాబడి తగ్గుతుందని ముందే భావించి అంచనాను పరిమితం చేశారు. 2019-20 ఏడాదిలో రెవెన్యూ రాబడి రూ.1,78,697 కోట్లుగా అంచనా వేశారు. ఆ ఏడాది కూడా సుమారు రూ.1,11,000 కోట్లే రాబడి సాధ్యమయింది. అంతకుముందు ఏడాది రూ.1,55,507 కోట్లు రాబడి అంచనా ఉంటే వాస్తవంగా సాధించింది సుమారు రూ.1,14,000 కోట్లే కావడం గమనార్హం.

ఇదీ చదవండి: రేషన్‌ పంపిణీకి బయోమెట్రిక్ భయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.