ETV Bharat / city

మీ నిర్ణయంతో వైకాపా కార్యకర్త గుండె ఆగింది: చంద్రబాబు

author img

By

Published : Jan 6, 2020, 11:45 PM IST

రాష్ట్ర ప్రయోజనాల కోసం విజ్ఞతతో రాజధానికి రైతులు భూములిచ్చారని... వైకాపా ప్రభుత్వం విజ్ఞత లేకుండా రైతు కుటుంబాలను రోడ్డుమీదకు తెచ్చిందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆగ్రహించారు. జగన్ సర్కారు రాజకీయ కక్షతో అమాయక రైతులను వేధిస్తోందని విమర్శించారు. ఇటీవల గుండెపోటుతో మృతి చెందిన రైతు కుటుంబాన్ని చంద్రబాబు పరామర్శించారు.

chandrababu about amaravathi farmer died
chandrababu about amaravathi farmer died

'మేం వైకాపా కోసం పని చేశాం'

రాజధాని ప్రాంతం దొండపాడులో మృతిచెందిన కొమ్మినేని మల్లికార్జునరావు కుటుంబాన్ని తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పరామర్శించారు. ఆయనతో పాటు.. ఎంపీ గల్లా జయదేవ్, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, మాజీ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ మల్లికార్జునరావు కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలిపారు. రాజధానిని అమరావతిని తరలిస్తారనే మనస్తాపంతో చనిపోయిన మల్లికార్జునరావు.. వైకాపా కార్యకర్తగా పనిచేశారని.... ఓటేసి గెలిపించిన వారినే మోసం చేయడం దుర్మార్గమని చంద్రబాబు విమర్శించారు.

మీ నిర్ణయంతో వైకాపా కార్యకర్త గుండె ఆగింది:చంద్రబాబు

రాజకీయం వేరు... అభివృద్ధి వేరు అనేది తెలుగుదేశం పార్టీ విధానమని చంద్రబాబు చెప్పారు. న్యాయం కోసం పోరాడుతున్న రాజధాని రైతులకు సంఘీభావంగా రాష్ట్రమంతా ఏకమైందన్నారు. స్వాతంత్ర్య పోరాటం కోసం తమ ఆభరణాలు, ఆస్తులు ఇచ్చినట్లే రాజధాని రైతుల కోసం ప్రజలు విరాళాలు ఇస్తున్నారని చంద్రబాబు అన్నారు. రాష్ట్రాన్ని పోలీస్ రాజ్యంగా మార్చారని ధ్వజమెత్తారు. రాజధాని రైతుల కుటుంబాలకు అండగా ఉంటామని... అమరావతిని కాపాడుకునే వారి పోరాటానికి తెలుగుదేశం పార్టీ వెన్నంటి నిలుస్తుందని చంద్రబాబు భరోసా ఇచ్చారు.

రైతు మల్లికార్జునరావు కుమారుడు నాగేశ్వరరావుతో చంద్రబాబు మాట్లాడారు. తన తండ్రి మల్లికార్జునరావు.... బోస్టన్ కమిటీ నివేదిక టీవీలో చూస్తుండగానే మనస్తాపానికి గురై గుండెపోటుతో చనిపోయారని నాగేశ్వరరావు తెలిపారు. పిడుగురాళ్లలో తాము 2004లోనే భూములు కొన్నామంటూ డాక్యుమెంట్లు చూపించారు.

ఇదీ చదవండి:

వెలగపూడిలో ఆగిన మరో రైతు గుండె

'మేం వైకాపా కోసం పని చేశాం'

రాజధాని ప్రాంతం దొండపాడులో మృతిచెందిన కొమ్మినేని మల్లికార్జునరావు కుటుంబాన్ని తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పరామర్శించారు. ఆయనతో పాటు.. ఎంపీ గల్లా జయదేవ్, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, మాజీ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ మల్లికార్జునరావు కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలిపారు. రాజధానిని అమరావతిని తరలిస్తారనే మనస్తాపంతో చనిపోయిన మల్లికార్జునరావు.. వైకాపా కార్యకర్తగా పనిచేశారని.... ఓటేసి గెలిపించిన వారినే మోసం చేయడం దుర్మార్గమని చంద్రబాబు విమర్శించారు.

మీ నిర్ణయంతో వైకాపా కార్యకర్త గుండె ఆగింది:చంద్రబాబు

రాజకీయం వేరు... అభివృద్ధి వేరు అనేది తెలుగుదేశం పార్టీ విధానమని చంద్రబాబు చెప్పారు. న్యాయం కోసం పోరాడుతున్న రాజధాని రైతులకు సంఘీభావంగా రాష్ట్రమంతా ఏకమైందన్నారు. స్వాతంత్ర్య పోరాటం కోసం తమ ఆభరణాలు, ఆస్తులు ఇచ్చినట్లే రాజధాని రైతుల కోసం ప్రజలు విరాళాలు ఇస్తున్నారని చంద్రబాబు అన్నారు. రాష్ట్రాన్ని పోలీస్ రాజ్యంగా మార్చారని ధ్వజమెత్తారు. రాజధాని రైతుల కుటుంబాలకు అండగా ఉంటామని... అమరావతిని కాపాడుకునే వారి పోరాటానికి తెలుగుదేశం పార్టీ వెన్నంటి నిలుస్తుందని చంద్రబాబు భరోసా ఇచ్చారు.

రైతు మల్లికార్జునరావు కుమారుడు నాగేశ్వరరావుతో చంద్రబాబు మాట్లాడారు. తన తండ్రి మల్లికార్జునరావు.... బోస్టన్ కమిటీ నివేదిక టీవీలో చూస్తుండగానే మనస్తాపానికి గురై గుండెపోటుతో చనిపోయారని నాగేశ్వరరావు తెలిపారు. పిడుగురాళ్లలో తాము 2004లోనే భూములు కొన్నామంటూ డాక్యుమెంట్లు చూపించారు.

ఇదీ చదవండి:

వెలగపూడిలో ఆగిన మరో రైతు గుండె

AP_GNT_08_06_CHANDRABABU_IN_DONDAPADU_PKG_3067949 REPORTER: P.SURYA RAO CAMERA: ALI Anchor: రాష్ట్ర ప్రయోజనాల కోసం విజ్ఞతతో రాజధానికి రైతులు భూములిచ్చారని..... వైకాపా ప్రభుత్వం విజ్ఞత లేకుండా రైతుల కుటుంబాలను రోడ్డుమీదకు తెచ్చిందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆరోపించారు. జగన్ సర్కారు.... రాజకీయ కక్షతో అమాయక రైతులను వేధిస్తుందని చంద్రబాబు దుయ్యబట్టారు. రాజధాని అమరావతి ప్రాంతం దొండపాడులో పర్యటించిన చంద్రబాబు.... ఇటీవల గుండెపోటుతో మృతి చెందిన రైతు మల్లికార్జున రావు కుటుంబాన్ని పరామర్శించారు....LOOK.... V.O.1: రాజధాని ప్రాంతం దొండపాడులో మృతిచెందిన కొమ్మినేని మల్లికార్జునరావు కుటుంబాన్ని చంద్రబాబు నాయుడు పరామర్శించారు. చంద్రబాబుతోపాటు ఎంపీ గల్లా జయదేవ్, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, మాజీ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ మల్లికార్జునరావు కుటుంబ సభ్యులకు తమ ప్రగాడ సానుభూతిని తెలిపారు. రాజధానిని అమరావతిని తరలిస్తారనే మనస్తాపంతో చనిపోయిన మల్లికార్జునరావు వైకాపా కార్యకర్తగా పనిచేశారని.... ఓటేసి గెలిపించిన వారినే మోసం చేయడం దుర్మార్గమని చంద్రబాబు విమర్శించారు. వైకాపా పత్రికలో మల్లికార్జునరావు పేరు తప్పుగా రాశారని....ఆ రైతు కుటుంబంపై నీచమైన విమర్శలు చేశారని చంద్రబాబు ధ్వజమెత్తారు. రాజకీయం వేరు... అభివృద్ధి వేరనేది తెలుగుదేశం పార్టీ విధానమని చెప్పారు. రాజధాని అమరావతి తరలింపు అంశంపై రాష్ట్రమంతా ఆందోళన నెలకొందని చెప్పారు. న్యాయం కోసం పోరాడుతున్న రాజధాని రైతులకు సంఘీభావంగా రాష్ట్రమంతా ఏకమైందన్నారు. స్వాతంత్ర్య పోరాటం కోసం తమ ఆభరణాలు, ఆస్తులు ఇచ్చినట్లే రాజధాని రైతుల కోసం ప్రజలు విరాళాలు ఇస్తున్నారని చెప్పారు. రాష్ట్రాన్ని పోలీస్ రాజ్యంగా మార్చారని ధ్వజమెత్తారు. రాజధాని రైతుల కుటుంబాలకు అండగా ఉంటామని... అమరావతిని కాపాడుకునే వారి పోరాటానికి తెలుగుదేశం పార్టీ వెన్నంటి నిలుస్తుందని చంద్రబాబు భరోసా ఇచ్చారు. ....BYTE.... BYTE: చంద్రబాబు, తెదేపా అధినేత V.O.2: ఈ సందర్భంగా రైతు మల్లికార్జునరావు కుమారుడు నాగేశ్వరరావుతో చంద్రబాబు మాట్లాడించారు. తన తండ్రి మల్లికార్జునరావు.... బోస్టన్ కమిటీ నివేదిక టీవీలో చూస్తుండగానే మనస్తాపానికి గురై గుండెపోటుతో చనిపోయారని నాగేశ్వరరావు స్పష్టం చేశారు. పిడుగురాళ్లలో తాము 2004లోనే భూములు కొన్నామంటూ డాక్యుమెంట్లు చూపించారు. ...BYTE..... BYTE: నాగేశ్వరరావు, మృతుడు మల్లికార్జునరావు కుమారుడు E.V.O.: రాజధాని అమరావతి ఎక్కడికీ పోదని.. ఇక్కడే ఉంటుందని చంద్రబాబు ఈ సందర్భంగా రాజధాని రైతులు, మహిళలకు హామీ ఇచ్చారు.....END.....
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.