రాష్ట్ర ఎన్నికల సంఘం తీసుకొచ్చిన 'ఈ- వాచ్' యాప్పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ దాఖలైన మూడు వ్యాజ్యాలపై హైకోర్టులో విచారణ జరిగింది. పురపాలక ఎన్నికలు ఈ నెల 10తో ముగియనున్నాయని.. యాప్పై ఏపీ రాష్ట్ర టెక్నాలజీ సర్వీసెస్ లేవనెత్తిన అభ్యంతరాలకు ఎస్ఈసీ ఇంకా వివరాలు సమర్పించలేదని ప్రభుత్వ న్యాయవాది సుమన్ కోర్టుకు తెలిపారు. ఆ వివరాల్ని నమోదు చేసిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే గోస్వామి నేతృత్వంలోని ధర్మాసనం, వ్యాజ్యాలను పరిష్కరించింది. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు ఎస్ఈసీ నోటిఫికేషన్ ఇచ్చి.. యాప్ను తీసుకొచ్చినట్లయితే మళ్లీ కోర్టును ఆశ్రయించడానికి పిటిషనర్లకు వెసులుబాటు ఇచ్చింది.
ఇదీ చదవండి: ప్రలోభాల పర్వం.. డబ్బులు పంపిణీ చేస్తున్న వీడియో వైరల్