ETV Bharat / city

AP DEBTS: కార్పొరేషన్ పేరిట రుణాలు .. వాడుకునేది మాత్రం..!

author img

By

Published : Aug 25, 2021, 7:19 AM IST

ప్రభుత్వం ఖర్చు చేసిన ప్రతీ రూపాయికి బడ్జెట్​లో కేటాయింపులు ఉండాలి.. ఆ వివరాలను శాసనసభ ముందుంచాలి.. వాటిని ఆమోదముద్ర వేయాలి. కానీ కార్పొరేషన్ల పేరిట తీసుకున్న రూ. లక్ష కోట్ల రుణాలు సభామోదం లేకుండా ఖర్చు చేయడం విస్మయం కలిగిస్తోంది.

ap-debts
ap-debts

సాధారణంగా.. ప్రభుత్వం రూపాయి ఖర్చు చేసినా.. బడ్జెట్‌లో కేటాయింపు ఉండాలి. సవరించిన బడ్జెట్‌ అంచనాల్లోనో.. కనీసం అనుబంధ పద్దులోనో... అందుకు సంబంధించిన వివరాలను శాసనసభ ముందు ఉంచి ఆమోదం పొందాలి. కానీ కార్పొరేషన్ల పేరిట తీసుకున్న దాదాపు లక్ష కోట్ల రూపాయల రుణాలను.. ప్రభుత్వం సభామోదం లేకుండా ఖర్చు చేయడం విస్మయం కలిగిస్తోంది. రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా.. కొన్నేళ్లుగా ఈ వ్యవహారం నిరాటంకంగా కొనసాగుతోంది. రాష్ట్రంలో.. దాదాపు వందకు పైగా కార్పొరేషన్లు ఉన్నాయి. ఇందులో.. 29 కార్పొరేషన్లు చాలా ఏళ్లుగా దాదాపు లక్ష కోట్ల రుణాలు తీసుకున్నాయి. వాటికి గ్యారంటీలు ఇస్తున్న ప్రభుత్వం.. ఆ నిధుల్లో సింహ భాగాన్ని తానే వాడుకుంటోంది. ఆ అప్పులు, వడ్డీలు చెల్లించేందుకు బడ్జెట్‌లో కార్పొరేషన్లకు నిధులూ కేటాయిస్తోంది. ఇంత జరుగుతున్నా ఆ వివరాలను శాసనసభ ముందుంచడం లేదు. ఈ నిధులను ఎక్కడ? ఎందుకు వినియోగించారో ‘మ్యాక్రో ఎకనామిక్స్‌ మెమోరాండం’లో స్పష్టంగా పేర్కొనడం లేదు. రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా కార్పొరేషన్ల ద్వారా బడ్జెటేతర రుణాలను తీసుకుని వాడుకోవడం పరిపాటైందని, ఆ వివరాలేవీ శాసనసభ ముందు ఉంచకపోవడం బడ్జెట్‌ సూత్రాలకు విరుద్ధమని ఆర్థిక రంగ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.

ఇదీ వ్యవహారం

రాష్ట్రంలో కంపెనీ చట్టం కింద కార్పొరేషన్లు ఏర్పాటయ్యాయి. ఇవి వివిధ సంస్థల నుంచి రుణాలు తీసుకుంటున్నాయి. ఇందుకు ప్రభుత్వమే గ్యారంటీ ఇస్తోంది. రుణం తీసుకున్న సొమ్ము కార్పొరేషన్ల బ్యాంకు ఖాతాల నుంచి పీడీ ఖాతాలకు చేరుతోంది. తర్వాత ఆ నిధులను ప్రభుత్వమే తన అవసరాలకు వినియోగించుకుంటోంది. రాష్ట్రంలో ఉన్న వందకు పైగా కార్పొరేషన్లలో సింహభాగం ఎలాంటి కార్యకలాపాలు నిర్వహించడం లేదు. అవి తీసుకువచ్చే రుణాలను ప్రభుత్వమే వాడుకుంటూ.. తిరిగి చెల్లించడానికి బడ్జెట్‌ నుంచి నిధులను కేటాయిస్తోంది. అసలు కార్పొరేషన్లకు ప్రభుత్వం ఏటా ఎందుకు బడ్జెట్‌ కేటాయింపులు చేస్తోంది? ఆ వివరాలేవీ మ్యాక్రో ఎకనామిక్స్‌ మెమోరాండంలో చూపించడం లేదు. సభ ముందూ ఉంచడం లేదు. కార్పొరేషన్ల కార్యకలాపాలపై కాగ్‌లోని మెంబర్‌ ఆడిట్‌ బోర్డు చేయాల్సిన తనిఖీలూ.. సరిగా జరుగుతున్న దాఖలాలు లేవని చెబుతున్నారు.

ప్రతి ఖర్చుకూ సభామోదం తప్పనిసరి

రాష్ట్రంలో ప్రభుత్వం చేసే ప్రతి ఖర్చు వివరాలనూ శాసనసభ ముందుంచాలి. సభలో చర్చించి ఆమోదించాలి. కార్పొరేషన్ల ద్వారా తీసుకువచ్చిన రుణాలకు సంబంధించిన ఖర్చునూ ఇలాగే సభ ముందుంచాలి’ అని ఆర్థిక వ్యవహారాల్లో అనుభవమున్న ఒక విశ్రాంత ఐఏఎస్‌ అభిప్రాయపడ్డారు. అసలు రాష్ట్రంలో కార్పొరేషన్లు ఏ కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయని ఆయన ప్రశ్నించారు.

ఇటీవల కాలంలో ఒకసారి రాష్ట్ర బడ్జెట్టుకు శాసనమండలి ఆమోదం పొందకపోవడంతో ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, పింఛన్ల చెల్లింపు కూడా కొంత కాలం ఆగిపోయింది. ఈ విషయాన్ని ప్రభుత్వంలోని ముఖ్యులే చెప్పారు. అలాంటిది కార్పొరేషన్ల పేరుతో తీసుకుంటున్న కోట్లాది రూపాయలను కేవలం ఉన్నతాధికారి స్థాయి ఆమోదంతోనే వినియోగించడం, ఆ వివరాలను సభ ముందుంచకపోవడం ఏ రకంగా సమర్థనీయమనే ప్రశ్న వస్తోంది.

5/2 పుస్తకంలో కేవలం గ్యారంటీల వివరాలే...

బడ్జెట్‌ పుస్తకాల్లో 5/2 పుస్తకంలో వివిధ కార్పొరేషన్ల రుణాలకు ప్రభుత్వం ఎంత గ్యారంటీ ఇచ్చింది? ఎంత రుణం తీసుకున్నారు? ఆ ఏడాది చివరి నాటికి ఇక తీర్చాల్సిన అప్పు ఎంత? కట్టాల్సిన వడ్డీ ఎంత వంటి వివరాలు శాసనసభ ముందు పెడుతున్నారు. అయితే కార్పొరేషన్ల ద్వారా వచ్చిన రుణాలను ప్రభుత్వ అవసరాలకు ఖర్చు చేసినా, వాటిని తిరిగి ప్రభుత్వమే చెల్లిస్తున్నా ఆ వివరాలేవీ ‘మ్యాక్రో ఎకనామిక్స్‌ ఫ్రేం వర్క్‌’ మెమొరాండంలో చూపించకపోవడం గమనార్హం.

రూ.1,19,230 కోట్ల గ్యారంటీలు

2020-21 ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ.1,19,230 కోట్ల మేర ప్రభుత్వం గ్యారంటీలు ఇచ్చినట్లు పేర్కొన్నారు. అందులో రూ.91,330 కోట్ల అప్పు (అసలు) తీర్చాల్సి ఉందని ఆ పుస్తకంలో పేర్కొన్నారు. రాష్ట్రాభివృద్ధి కార్పొరేషన్‌కు ఇచ్చిన గ్యారంటీలు అందులో చేర్చలేదన్న అంశమూ చర్చనీయాంశమయింది. రాష్ట్ర విభజన తర్వాత కార్పొరేషన్ల ద్వారా రుణాలు తెచ్చి వాడుకుంటున్నారని.. అంటే బడ్జెట్‌లో చూపని అప్పులు చేస్తున్నారని అప్పటి నుంచీ విమర్శలు ఉన్నాయి.

రాష్ట్ర విభజన తర్వాత ఏయే ఏడాది ప్రభుత్వాలు కార్పొరేషన్లకు ఎంతమేర గ్యారంటీలు ఇచ్చాయన్న అధికారిక గణాంకాల్లోనూ కొన్నింటికి సంబంధించి గ్యారంటీల వివరాలను చూపలేదనే విమర్శలూ వినిపిస్తున్నాయి.

ఇదీ చదవండి: Peddireddy: 'ప్రభుత్వ ఆదాయానికి ఆ వనరులు కీలకం.. సద్వినియోగం చేసుకోండి'

సాధారణంగా.. ప్రభుత్వం రూపాయి ఖర్చు చేసినా.. బడ్జెట్‌లో కేటాయింపు ఉండాలి. సవరించిన బడ్జెట్‌ అంచనాల్లోనో.. కనీసం అనుబంధ పద్దులోనో... అందుకు సంబంధించిన వివరాలను శాసనసభ ముందు ఉంచి ఆమోదం పొందాలి. కానీ కార్పొరేషన్ల పేరిట తీసుకున్న దాదాపు లక్ష కోట్ల రూపాయల రుణాలను.. ప్రభుత్వం సభామోదం లేకుండా ఖర్చు చేయడం విస్మయం కలిగిస్తోంది. రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా.. కొన్నేళ్లుగా ఈ వ్యవహారం నిరాటంకంగా కొనసాగుతోంది. రాష్ట్రంలో.. దాదాపు వందకు పైగా కార్పొరేషన్లు ఉన్నాయి. ఇందులో.. 29 కార్పొరేషన్లు చాలా ఏళ్లుగా దాదాపు లక్ష కోట్ల రుణాలు తీసుకున్నాయి. వాటికి గ్యారంటీలు ఇస్తున్న ప్రభుత్వం.. ఆ నిధుల్లో సింహ భాగాన్ని తానే వాడుకుంటోంది. ఆ అప్పులు, వడ్డీలు చెల్లించేందుకు బడ్జెట్‌లో కార్పొరేషన్లకు నిధులూ కేటాయిస్తోంది. ఇంత జరుగుతున్నా ఆ వివరాలను శాసనసభ ముందుంచడం లేదు. ఈ నిధులను ఎక్కడ? ఎందుకు వినియోగించారో ‘మ్యాక్రో ఎకనామిక్స్‌ మెమోరాండం’లో స్పష్టంగా పేర్కొనడం లేదు. రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా కార్పొరేషన్ల ద్వారా బడ్జెటేతర రుణాలను తీసుకుని వాడుకోవడం పరిపాటైందని, ఆ వివరాలేవీ శాసనసభ ముందు ఉంచకపోవడం బడ్జెట్‌ సూత్రాలకు విరుద్ధమని ఆర్థిక రంగ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.

ఇదీ వ్యవహారం

రాష్ట్రంలో కంపెనీ చట్టం కింద కార్పొరేషన్లు ఏర్పాటయ్యాయి. ఇవి వివిధ సంస్థల నుంచి రుణాలు తీసుకుంటున్నాయి. ఇందుకు ప్రభుత్వమే గ్యారంటీ ఇస్తోంది. రుణం తీసుకున్న సొమ్ము కార్పొరేషన్ల బ్యాంకు ఖాతాల నుంచి పీడీ ఖాతాలకు చేరుతోంది. తర్వాత ఆ నిధులను ప్రభుత్వమే తన అవసరాలకు వినియోగించుకుంటోంది. రాష్ట్రంలో ఉన్న వందకు పైగా కార్పొరేషన్లలో సింహభాగం ఎలాంటి కార్యకలాపాలు నిర్వహించడం లేదు. అవి తీసుకువచ్చే రుణాలను ప్రభుత్వమే వాడుకుంటూ.. తిరిగి చెల్లించడానికి బడ్జెట్‌ నుంచి నిధులను కేటాయిస్తోంది. అసలు కార్పొరేషన్లకు ప్రభుత్వం ఏటా ఎందుకు బడ్జెట్‌ కేటాయింపులు చేస్తోంది? ఆ వివరాలేవీ మ్యాక్రో ఎకనామిక్స్‌ మెమోరాండంలో చూపించడం లేదు. సభ ముందూ ఉంచడం లేదు. కార్పొరేషన్ల కార్యకలాపాలపై కాగ్‌లోని మెంబర్‌ ఆడిట్‌ బోర్డు చేయాల్సిన తనిఖీలూ.. సరిగా జరుగుతున్న దాఖలాలు లేవని చెబుతున్నారు.

ప్రతి ఖర్చుకూ సభామోదం తప్పనిసరి

రాష్ట్రంలో ప్రభుత్వం చేసే ప్రతి ఖర్చు వివరాలనూ శాసనసభ ముందుంచాలి. సభలో చర్చించి ఆమోదించాలి. కార్పొరేషన్ల ద్వారా తీసుకువచ్చిన రుణాలకు సంబంధించిన ఖర్చునూ ఇలాగే సభ ముందుంచాలి’ అని ఆర్థిక వ్యవహారాల్లో అనుభవమున్న ఒక విశ్రాంత ఐఏఎస్‌ అభిప్రాయపడ్డారు. అసలు రాష్ట్రంలో కార్పొరేషన్లు ఏ కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయని ఆయన ప్రశ్నించారు.

ఇటీవల కాలంలో ఒకసారి రాష్ట్ర బడ్జెట్టుకు శాసనమండలి ఆమోదం పొందకపోవడంతో ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, పింఛన్ల చెల్లింపు కూడా కొంత కాలం ఆగిపోయింది. ఈ విషయాన్ని ప్రభుత్వంలోని ముఖ్యులే చెప్పారు. అలాంటిది కార్పొరేషన్ల పేరుతో తీసుకుంటున్న కోట్లాది రూపాయలను కేవలం ఉన్నతాధికారి స్థాయి ఆమోదంతోనే వినియోగించడం, ఆ వివరాలను సభ ముందుంచకపోవడం ఏ రకంగా సమర్థనీయమనే ప్రశ్న వస్తోంది.

5/2 పుస్తకంలో కేవలం గ్యారంటీల వివరాలే...

బడ్జెట్‌ పుస్తకాల్లో 5/2 పుస్తకంలో వివిధ కార్పొరేషన్ల రుణాలకు ప్రభుత్వం ఎంత గ్యారంటీ ఇచ్చింది? ఎంత రుణం తీసుకున్నారు? ఆ ఏడాది చివరి నాటికి ఇక తీర్చాల్సిన అప్పు ఎంత? కట్టాల్సిన వడ్డీ ఎంత వంటి వివరాలు శాసనసభ ముందు పెడుతున్నారు. అయితే కార్పొరేషన్ల ద్వారా వచ్చిన రుణాలను ప్రభుత్వ అవసరాలకు ఖర్చు చేసినా, వాటిని తిరిగి ప్రభుత్వమే చెల్లిస్తున్నా ఆ వివరాలేవీ ‘మ్యాక్రో ఎకనామిక్స్‌ ఫ్రేం వర్క్‌’ మెమొరాండంలో చూపించకపోవడం గమనార్హం.

రూ.1,19,230 కోట్ల గ్యారంటీలు

2020-21 ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ.1,19,230 కోట్ల మేర ప్రభుత్వం గ్యారంటీలు ఇచ్చినట్లు పేర్కొన్నారు. అందులో రూ.91,330 కోట్ల అప్పు (అసలు) తీర్చాల్సి ఉందని ఆ పుస్తకంలో పేర్కొన్నారు. రాష్ట్రాభివృద్ధి కార్పొరేషన్‌కు ఇచ్చిన గ్యారంటీలు అందులో చేర్చలేదన్న అంశమూ చర్చనీయాంశమయింది. రాష్ట్ర విభజన తర్వాత కార్పొరేషన్ల ద్వారా రుణాలు తెచ్చి వాడుకుంటున్నారని.. అంటే బడ్జెట్‌లో చూపని అప్పులు చేస్తున్నారని అప్పటి నుంచీ విమర్శలు ఉన్నాయి.

రాష్ట్ర విభజన తర్వాత ఏయే ఏడాది ప్రభుత్వాలు కార్పొరేషన్లకు ఎంతమేర గ్యారంటీలు ఇచ్చాయన్న అధికారిక గణాంకాల్లోనూ కొన్నింటికి సంబంధించి గ్యారంటీల వివరాలను చూపలేదనే విమర్శలూ వినిపిస్తున్నాయి.

ఇదీ చదవండి: Peddireddy: 'ప్రభుత్వ ఆదాయానికి ఆ వనరులు కీలకం.. సద్వినియోగం చేసుకోండి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.