ముఖ్యమంత్రి జగన్ నివాసంలో ఆయన్ను గుజరాత్ కో ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ (అమూల్) ప్రతినిధులు కలిశారు. అమూల్ ఎండీ ఆర్ఎస్.సోధి, కైరా మిల్క్ యూనియన్ (అమూల్ డెయిరీ) ఎండీ అమిత్ వ్యాస్, సబర్ కాంత మిల్క్ యూనియన్ (సబర్ డెయిరీ) ఎండీ డాక్టర్ బీఎం పటేల్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్రారంభించనున్న అమూల్ ప్రాజెక్టుకు సంబంధించి పలు అంశాలపై వారు సీఎంతో చర్చించారు. ఏపీ-అమూల్ ప్రాజెక్టును ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బుధవారం ప్రారంభించనున్నారు. సచివాలయంలోని మొదటి బ్లాక్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభిస్తారు.
ఇదీ చదవండీ...