ETV Bharat / city

'అమరావతికి మద్దతిస్తున్న వారిపై తప్పుడు కేసులు పెడుతున్నారు'

సీఎం జగన్ అమరావతిపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని రాజధాని రైతులు ఆరోపించారు. అమరావతి ఉద్యమానికి మద్దతు తెలుపుతున్న వారిపై తప్పుడు కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేస్తున్నారని విమర్శించారు.

author img

By

Published : Mar 16, 2021, 4:44 PM IST

Amaravati Farmers Respond to Chandrababu Notice
సీఎం జగన్‌పై రాజధాని రైతుల ఆగ్రహం

ముఖ్యమంత్రి జగన్ అమరావతిపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని రాజధాని అన్నదాతలు ఆరోపించారు. పరిపాలన రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ 455 రోజులుగా ఆందోళన చేస్తున్న తమను పట్టించుకోకుండా.. ఉద్యమానికి మద్దతు తెలుపుతున్నవారిపై తప్పుడు కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేస్తున్నారని విమర్శించారు.

రాజధానిని అభివృద్ధి చేయకుండా నిత్యం కేసులు, విచారణల పేరుతో సమయాన్ని వృథా చేస్తున్నారని ఆక్షేపించారు. రాజధానిలో ఎస్సీలకు కౌలు చెక్కులు విడుదల చేయకపోవడాన్ని రైతులు తప్పు పట్టారు. ఎస్సీలపై ఎస్సీ కేసులు, ఫిర్యాదుదారుడు ఎస్సీ కాకపోయినా.. ఎస్సీ, ఎస్టీ కేసులు ఎలా పెడతారని ప్రశ్నించారు.

ముఖ్యమంత్రి జగన్ అమరావతిపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని రాజధాని అన్నదాతలు ఆరోపించారు. పరిపాలన రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ 455 రోజులుగా ఆందోళన చేస్తున్న తమను పట్టించుకోకుండా.. ఉద్యమానికి మద్దతు తెలుపుతున్నవారిపై తప్పుడు కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేస్తున్నారని విమర్శించారు.

రాజధానిని అభివృద్ధి చేయకుండా నిత్యం కేసులు, విచారణల పేరుతో సమయాన్ని వృథా చేస్తున్నారని ఆక్షేపించారు. రాజధానిలో ఎస్సీలకు కౌలు చెక్కులు విడుదల చేయకపోవడాన్ని రైతులు తప్పు పట్టారు. ఎస్సీలపై ఎస్సీ కేసులు, ఫిర్యాదుదారుడు ఎస్సీ కాకపోయినా.. ఎస్సీ, ఎస్టీ కేసులు ఎలా పెడతారని ప్రశ్నించారు.

ఇదీ చదవండి:

అట్రాసిటీ కేసు పెట్టే పరిస్థితికి దిగజారిపోయారు: లోకేశ్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.