- ఈ-పాస్ తప్పనిసరి
నేటి నుంచి తెలంగాణలోని సూర్యాపేట జిల్లా సరిహద్దులో ఆంక్షలు విధిస్తున్నట్లు ఆ రాష్ట్ర పోలీసులు తెలిపారు. రాష్ట్రం నుంచి వచ్చేవారికి ఈ-పాసులు తప్పనిసరి చేస్తూ ఆదేశాలు ఇచ్చారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఏజీ తీరు ధిక్కారమే!
ఎంపీ రఘురామకృష్ణరాజు కేసులో వాదనల సందర్భంగా అదనపు అడ్వకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్రెడ్డి తీరుపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.లలిత తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- మరిన్ని పరిశోధనలు అవసరం!
దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన కృష్ణపట్నం ఆనందయ్య ఔషధంపై ఆయుర్వేద వైద్యకళాశాలల్లోనూ చర్చ ప్రారంభమైంది. ప్రత్యేకించి తిరుపతి శ్రీవేంకటేశ్వర ఆయుర్వేద బోధనాసుపత్రిలో ఆచార్యులు.. ఈ ఔషధంపై లోతుగా పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉందంటున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- విడుదల చేయండి: హైకోర్టు
కొవిడ్ వైరస్ వ్యాప్తి చెందుతున్న వేళ.. జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు ,కేసుల విచారణలో ఉన్న ఖైదీల విడుదలకు హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- మోదీ సమీక్ష
తౌక్టే తుపాను సృష్టించిన బీభత్సాన్ని మరవకముందే యాస్ తుపాను ముంచుకొస్తోంది. ఈ నేపథ్యంలో సన్నాహక చర్యలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. నేడు ఉన్నతస్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 66కు పెరిగిన మృతులు
తౌక్టే తుపాను కారణంగా బార్జి పీ-305, వరప్రద టగ్బోటులో చిక్కుకుని గల్లంతైన 20 మంది కోసం గాలింపు ముమ్మరం చేశారు అధికారులు. సహాయక చర్యల్లో భాగంగా గజ ఈతగాళ్లను రంగంలోకి దించినట్టు పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- కీలక సమావేశం
నేడు కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ ఆధ్వర్యంలో కీలక సమావేశం జరగనుంది. దీనికి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షత వహించనుండగా.. సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షల నిర్వహణపై చర్చించనున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఆ దేశాలకు హెచ్చరిక!
భారత్లో కొవిడ్ కల్లోలం అభివృద్ధి చెందుతున్న దేశాలకు హెచ్చరిక లాంటిదని అంతర్జాతీయ ద్రవ్యనిధి ఆర్థికవేత్తలు అభిప్రాయపడ్డారు. ఇంతవరకు కరోనా ప్రకోపాన్ని చూడని అల్ప, మధ్య ఆదాయ దేశాలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- షెడ్యూల్ ప్రకారమే
కరోనా కాలానికి ముగింపు ఉంటుందనే ఆశను బలంగా చాటేందుకు ఒలింపిక్స్ను నిర్వహించి తీరుతామని ఐఓసీ అధ్యక్షుడు థామస్ బాక్ స్పష్టం చేశారు. మెగాక్రీడల్లో పాల్గొనే అథ్లెట్లు 70 శాతం మంది టీకా వేసుకున్నారని తెలిపాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- మరింత మంది స్టార్స్!
త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న 'ద ఫ్యామిలీ మ్యాన్' సీజన్ రెండో భాగంపై ఇప్పటికే అంచనాలు భారీస్థాయిలో ఉన్నాయి. అయితే మూడో సీజన్లో మరింతమంది స్టార్స్ ఉండనున్నారనే వార్త ఇంకా ఆసక్తి కలిగిస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.