ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 7 PM

.

author img

By

Published : Jul 14, 2021, 7:21 PM IST

ప్రధాన వార్తలు @ 7 PM
7PM TOP NEWS
  • 'రాద్ధాంతం ఎందుకు?'
    తెలుగు భాషాభివృద్ధిని విస్తృతం చేసేందుకే కేబినెట్​లో చర్చించి తెలుగు - సంస్కృత అకాడమీ ఏర్పాటు నిర్ణయం తీసుకున్నామన్నామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ అన్నారు. ఈ అంశంపై ప్రతిపక్షాలు ఎందుకు రాద్ధాంతం చేస్తున్నాయో అర్థం కావటం లేదని చెప్పారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • 'విక్రయం జరగనివ్వం'
    పోలవరం ప్రాజెక్టు(polavaram project) నిర్మాణంతో ముంపునకు గురవుతున్న నిర్వాసితుల (Expatriates)ఇబ్బందులను పట్టించుకోవాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు(BJP leader somu veerraju) అన్నారు. రాష్ట్రం ఇస్తున్న నిధులను కేంద్రం సర్దుబాటు చేస్తోందన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ విశాఖ ఉక్కు పరిశ్రమ(vizag steel plant) విక్రయం జరగనివ్వమని స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • మాన్సాస్ ట్రస్ట్ కార్యాలయంలో ఆడిటింగ్​
    విజయనగరంలోని మాన్సాస్ ట్రస్ట్(mansas trust) కార్యాలయంలో ఆడిటింగ్(auditing) కొనసాగుతోంది. అధికారులు నాలుగు బృందాలుగా ఏర్పడి దస్త్రాలను(files) పరిశీలిస్తున్నారు. నెల రోజులుగా ఈ ప్రక్రియ జరుగుతోంది. పరిశీలన అంశాలను కమిషనర్ కు అందజేయనున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • అభిమాని హడావుడి
    సీఎం జగన్​ను కలిసేందుకు పాదయాత్రగా వచ్చిన ఓ యువకుడ్ని తాడేపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముఖ్యమంత్రి జగన్​పై ఉన్న అభిమానంతో తెలంగాణలోని సంగారెడ్డికి చెందిన యువకుడు పాదయాత్రగా వచ్చి.. ముఖ్యమంత్రి అపాయింట్​మెంట్ కావాలంటూ తనిఖీ కేంద్రం వద్ద హడావుడి చేశాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • ఫీజు రీఫండ్​పై కీలక ఆదేశాలు
    సీబీఎస్​ఈ పరీక్షలు రద్దయిన నేపథ్యంలో.. విద్యార్థుల ఫీజు రీఫండ్​పై ఓ నిర్ణయం తీసుకోవాలని సీబీఎస్​ఈ బోర్డును ఆదేశించింది దిల్లీ హైకోర్టు(Delhi High Court). 8 వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని తీర్పునిచ్చింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • ఐదేళ్ల ప్రాయంలోనే పీఠాధిపతి
    బాహుబలి సినిమాలో అప్పుడే పుట్టిన మహేంద్ర బాహుబలిని మహారాజుగా ప్రకటించింది శివగామి. అదే కోవలో కర్ణాటకలో ఓ ఐదేళ్ల బాలుడు పీఠాధిపతిగా నియమితుడై.. అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు. ఓ ఐదేళ్ల బాలుడు.. పీఠాధిపతి అవ్వటం చరిత్రలో ఇదే మొదటిసారని పండితులు చెబుతున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • 'మత్తు కేకుల' దందా
    మానసిక వైద్యుడి మత్తు దందా గుట్టురట్టు చేసింది మాదకద్రవ్యాల నిరోధక శాఖ(ఎన్​సీబీ). కేకుల్లో అక్రమంగా మాదకద్రవ్యాలను రవాణా చేస్తున్న వైద్యుడిని అధికారులు అరెస్ట్ చేశారు. అతని దగ్గర నుంచి 10కేజీల మత్తుకేకులను స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • కొడుకు కోసం బైక్​పై లక్షల కి.మీ..
    తన కొడుకు కోసం తండ్రి చేసిన సాహసం కాలాన్ని కదిలించింది. 24 ఏళ్ల పాటు అనుభవించిన పుత్రశోకాన్ని తుడిచేసింది. దేశవ్యాప్తంగా ఆ తండ్రి చేసిన ప్రయాణానికి సార్థకత కలిగింది. వెండితెరపైనా కన్నీళ్లు పెట్టించిన ఆ తండ్రి కథ సుఖాంతమైంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • స్టార్ ప్లేయర్స్ లేకుండా మెగాటోర్నీ!
    మరికొద్ది రోజుల్లో టోక్యో ఒలింపిక్స్ సమరం ప్రారంభంకానుంది. తమ అభిమాన క్రీడాకారుల ఆటను చూసేందుకు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. కానీ కొందరు స్టార్ ప్లేయర్స్ లేకుండానే ఈసారి విశ్వక్రీడలు జరగనున్నాయి. సైనా నెహ్వాల్​తో పాటు ఫెదరర్, నాదల్, నెయ్​మర్​ వంటి అథ్లెట్లు మెగాటోర్నీలో పాల్గొనట్లేదు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'రాద్ధాంతం ఎందుకు?'
    తెలుగు భాషాభివృద్ధిని విస్తృతం చేసేందుకే కేబినెట్​లో చర్చించి తెలుగు - సంస్కృత అకాడమీ ఏర్పాటు నిర్ణయం తీసుకున్నామన్నామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ అన్నారు. ఈ అంశంపై ప్రతిపక్షాలు ఎందుకు రాద్ధాంతం చేస్తున్నాయో అర్థం కావటం లేదని చెప్పారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • 'విక్రయం జరగనివ్వం'
    పోలవరం ప్రాజెక్టు(polavaram project) నిర్మాణంతో ముంపునకు గురవుతున్న నిర్వాసితుల (Expatriates)ఇబ్బందులను పట్టించుకోవాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు(BJP leader somu veerraju) అన్నారు. రాష్ట్రం ఇస్తున్న నిధులను కేంద్రం సర్దుబాటు చేస్తోందన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ విశాఖ ఉక్కు పరిశ్రమ(vizag steel plant) విక్రయం జరగనివ్వమని స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • మాన్సాస్ ట్రస్ట్ కార్యాలయంలో ఆడిటింగ్​
    విజయనగరంలోని మాన్సాస్ ట్రస్ట్(mansas trust) కార్యాలయంలో ఆడిటింగ్(auditing) కొనసాగుతోంది. అధికారులు నాలుగు బృందాలుగా ఏర్పడి దస్త్రాలను(files) పరిశీలిస్తున్నారు. నెల రోజులుగా ఈ ప్రక్రియ జరుగుతోంది. పరిశీలన అంశాలను కమిషనర్ కు అందజేయనున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • అభిమాని హడావుడి
    సీఎం జగన్​ను కలిసేందుకు పాదయాత్రగా వచ్చిన ఓ యువకుడ్ని తాడేపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముఖ్యమంత్రి జగన్​పై ఉన్న అభిమానంతో తెలంగాణలోని సంగారెడ్డికి చెందిన యువకుడు పాదయాత్రగా వచ్చి.. ముఖ్యమంత్రి అపాయింట్​మెంట్ కావాలంటూ తనిఖీ కేంద్రం వద్ద హడావుడి చేశాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • ఫీజు రీఫండ్​పై కీలక ఆదేశాలు
    సీబీఎస్​ఈ పరీక్షలు రద్దయిన నేపథ్యంలో.. విద్యార్థుల ఫీజు రీఫండ్​పై ఓ నిర్ణయం తీసుకోవాలని సీబీఎస్​ఈ బోర్డును ఆదేశించింది దిల్లీ హైకోర్టు(Delhi High Court). 8 వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని తీర్పునిచ్చింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • ఐదేళ్ల ప్రాయంలోనే పీఠాధిపతి
    బాహుబలి సినిమాలో అప్పుడే పుట్టిన మహేంద్ర బాహుబలిని మహారాజుగా ప్రకటించింది శివగామి. అదే కోవలో కర్ణాటకలో ఓ ఐదేళ్ల బాలుడు పీఠాధిపతిగా నియమితుడై.. అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు. ఓ ఐదేళ్ల బాలుడు.. పీఠాధిపతి అవ్వటం చరిత్రలో ఇదే మొదటిసారని పండితులు చెబుతున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • 'మత్తు కేకుల' దందా
    మానసిక వైద్యుడి మత్తు దందా గుట్టురట్టు చేసింది మాదకద్రవ్యాల నిరోధక శాఖ(ఎన్​సీబీ). కేకుల్లో అక్రమంగా మాదకద్రవ్యాలను రవాణా చేస్తున్న వైద్యుడిని అధికారులు అరెస్ట్ చేశారు. అతని దగ్గర నుంచి 10కేజీల మత్తుకేకులను స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • కొడుకు కోసం బైక్​పై లక్షల కి.మీ..
    తన కొడుకు కోసం తండ్రి చేసిన సాహసం కాలాన్ని కదిలించింది. 24 ఏళ్ల పాటు అనుభవించిన పుత్రశోకాన్ని తుడిచేసింది. దేశవ్యాప్తంగా ఆ తండ్రి చేసిన ప్రయాణానికి సార్థకత కలిగింది. వెండితెరపైనా కన్నీళ్లు పెట్టించిన ఆ తండ్రి కథ సుఖాంతమైంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • స్టార్ ప్లేయర్స్ లేకుండా మెగాటోర్నీ!
    మరికొద్ది రోజుల్లో టోక్యో ఒలింపిక్స్ సమరం ప్రారంభంకానుంది. తమ అభిమాన క్రీడాకారుల ఆటను చూసేందుకు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. కానీ కొందరు స్టార్ ప్లేయర్స్ లేకుండానే ఈసారి విశ్వక్రీడలు జరగనున్నాయి. సైనా నెహ్వాల్​తో పాటు ఫెదరర్, నాదల్, నెయ్​మర్​ వంటి అథ్లెట్లు మెగాటోర్నీలో పాల్గొనట్లేదు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.