ETV Bharat / business

UPI ద్వారా పేమెంట్ చేస్తే బోనస్! కేంద్రం కొత్త స్కీమ్.. వారికి మాత్రమే​!!

గూగుల్​పే, ఫోన్​పే ద్వారా మనీ ట్రాన్స్​ఫర్ చేస్తే ఒకప్పుడు భారీగా క్యాష్​బ్యాక్​లు వచ్చేవి గుర్తుందా? ఇప్పుడు రూపే డెబిట్ కార్డ్, బీమ్ యూపీఐ లావాదేవీలు ప్రోత్సహించేందుకు కేంద్రం అలాంటి విధానమే అనుసరించే అవకాశముంది. ఇందుకోసం రూ.2,600కోట్లతో కొత్త పథకం అమలుకు పచ్చజెండా ఊపింది కేంద్ర మంత్రివర్గం.

author img

By

Published : Jan 11, 2023, 5:57 PM IST

cabinet approves rupay debit card scheme
యూపీఐ వినియోగదారులకు గుడ్​ న్యూస్

యూపీఐ వినియోగదారులకు కేంద్రం గుడ్​ న్యూస్ తెలిపింది. రూపే డెబిట్​ కార్డు, లేదా తక్కువ విలువ కలిగిన బీమ్ యూపీఐ​ లావాదేవీలను పోత్సహించడానికి కొత్త స్కీమ్​ను ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం సమావేశమైన కేంద్ర మంత్రివర్గం రూ. 2,600 కోట్ల వ్యయంతో ఆ పథకానికి ఆమోదం తెలిపింది.

కేంద్ర ప్రభుత్వం ఈ పథకం కింద బ్యాంకులకు ఆర్థికసాయాన్ని అందిస్తుంది. తక్కువ మొత్తంలో డిజిటల్​ చెల్లింపులు చేసేవారిని ప్రోత్సహించడం దీని ముఖ్య ఉద్దేశం. "భారత్​ మరింత బలమైన డిజిటల్ చెల్లింపు వ్యవస్థగా వృద్ధి చెందడానికి ఈ పథకం సహాయపడుతుంది. వినియోగదారులు వ్యాపారులకు చేసే.. రూ. 200 కంటే తక్కువ విలువ కలిగిన చెల్లింపులను ఈ పథకం పోత్సహిస్తుంది. యూపీఐ లైట్​, యూపీఐ123పే ద్వారా డిజిటల్​ చెల్లింపులను ప్రమోట్​ చేస్తుంది. ఈ పథకంతో భారత్​ డిజిటల్ చెల్లింపుల విషయంలో మరో ముందడుగు వేయనుంది." అని కేంద్రప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

రైతుల కోసం మూడు కొత్త సహకార సంఘాలు..
సేంద్రియ ఉత్పత్తులు, విత్తనాలు, ఎగుమతులను పోత్సహించడానికి.. 3 కొత్త సహకార సంఘాలను ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. నేషనల్ ఎక్స్‌పోర్ట్ సొసైటీ, నేషనల్ కోఆపరేటివ్ సొసైటీ ఫర్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్, నేషనల్ లెవల్ మల్టీ-స్టేట్ సీడ్ కోఆపరేటివ్ సొసైటీల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ వెల్లడించారు.

యూపీఐ వినియోగదారులకు కేంద్రం గుడ్​ న్యూస్ తెలిపింది. రూపే డెబిట్​ కార్డు, లేదా తక్కువ విలువ కలిగిన బీమ్ యూపీఐ​ లావాదేవీలను పోత్సహించడానికి కొత్త స్కీమ్​ను ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం సమావేశమైన కేంద్ర మంత్రివర్గం రూ. 2,600 కోట్ల వ్యయంతో ఆ పథకానికి ఆమోదం తెలిపింది.

కేంద్ర ప్రభుత్వం ఈ పథకం కింద బ్యాంకులకు ఆర్థికసాయాన్ని అందిస్తుంది. తక్కువ మొత్తంలో డిజిటల్​ చెల్లింపులు చేసేవారిని ప్రోత్సహించడం దీని ముఖ్య ఉద్దేశం. "భారత్​ మరింత బలమైన డిజిటల్ చెల్లింపు వ్యవస్థగా వృద్ధి చెందడానికి ఈ పథకం సహాయపడుతుంది. వినియోగదారులు వ్యాపారులకు చేసే.. రూ. 200 కంటే తక్కువ విలువ కలిగిన చెల్లింపులను ఈ పథకం పోత్సహిస్తుంది. యూపీఐ లైట్​, యూపీఐ123పే ద్వారా డిజిటల్​ చెల్లింపులను ప్రమోట్​ చేస్తుంది. ఈ పథకంతో భారత్​ డిజిటల్ చెల్లింపుల విషయంలో మరో ముందడుగు వేయనుంది." అని కేంద్రప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

రైతుల కోసం మూడు కొత్త సహకార సంఘాలు..
సేంద్రియ ఉత్పత్తులు, విత్తనాలు, ఎగుమతులను పోత్సహించడానికి.. 3 కొత్త సహకార సంఘాలను ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. నేషనల్ ఎక్స్‌పోర్ట్ సొసైటీ, నేషనల్ కోఆపరేటివ్ సొసైటీ ఫర్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్, నేషనల్ లెవల్ మల్టీ-స్టేట్ సీడ్ కోఆపరేటివ్ సొసైటీల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ వెల్లడించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.