ETV Bharat / business

స్టార్​బక్స్ సీఈఓగా లక్ష్మణ్ నరసింహన్​

author img

By

Published : Sep 2, 2022, 11:02 AM IST

Starbucks CEO Laxman: ప్రముఖ కాఫీ గొలుసుకట్టు వ్యాపార సంస్థ స్టార్​బక్స్​కు సీఈఓగా భారత సంతతికి చెందిన లక్ష్మణ్ నరసింహన్​ నియమితులయ్యారు. అక్టోబరు1న ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు.

laxman narasimhan
లక్ష్మణ్ నరసింహన్​

Starbucks CEO Laxman : ప్రముఖ కాఫీ గొలుసుకట్టు వ్యాపార సంస్థ స్టార్​బక్స్​కు సీఈఓగా భారత సంతతికి చెందిన లక్ష్మణ్ నరసింహన్​ నియమితులయ్యారు. నరసింహన్.. కంపెనీకి సీఈఓగానే కాకుండా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్​లో సభ్యుడిగానూ ఉంటారని స్టార్​బక్స్ గురువారం ప్రకటించింది. అక్టోబరు 1న ఆయన బాధ్యతలు స్వీకరిస్తారని తెలిపింది.

55 ఏళ్ల నరసింహన్ బ్రిటన్​కు చెందిన రెకిట్ బెంకిజర్ అనే బహుళజాతి కంపెనీకి సీఈఓగా పనిచేశారు. సెప్టెంబరు 30న రెకిట్ బెంకిజర్ కంపెనీ సీఈఓ బాధ్యతల నుంచి లక్ష్మణ్ నరసింహన్ వైదొలిగినట్లు సంస్థ తెలిపింది. 'అమెరికాకు తిరిగి రావడానికి నాకు అవకాశం లభించింది. లండన్​ను విడిచిపెట్టి రావడం కష్టతరమైనప్పటికీ.. కుటుంబం కోసం కఠిన నిర్ణయం తీసుకుంటున్నా' అని లక్ష్మణ్ నరసింహన్ తెలిపారు.

అమెరికాకు చెందిన దిగ్గజ కంపెనీ స్టార్​బక్స్​కు లక్ష్మణ్ నరసింహన్​ సీఈఓగా నియమితులవ్వడం వల్ల భారత సంతతికి చెందిన మరో వ్యక్తి ఉన్నత శిఖరాన్ని అధిరోహించనట్లైంది. ఇప్పటివరకు మైక్రోసాఫ్ట్ సీఈఓగా సత్య నాదెళ్ల, అడోబ్​ సీఈఓగా శంతను నారాయణ్, గూగుల్ సీఈఓగా సుందర్​ పిచాయ్​, ట్విట్టర్ సీఈఓ పరాగ్ అగర్వాల్ తదితరులు భారత సంతతికి చెందిన వ్యక్తులు సీఈఓలుగా ఉన్నారు.

ఇవీ చదవండి: ట్విట్టర్​లో 80 శాతం నకిలీ ఖాతాలే.. మస్క్​ కీలక వ్యాఖ్యలు

ఆ ఫోన్​ కాల్స్​, మెసేజెస్​ నమ్మితే అంతే సంగతులు.. కష్టార్జితం అంతా స్వాహా!

Starbucks CEO Laxman : ప్రముఖ కాఫీ గొలుసుకట్టు వ్యాపార సంస్థ స్టార్​బక్స్​కు సీఈఓగా భారత సంతతికి చెందిన లక్ష్మణ్ నరసింహన్​ నియమితులయ్యారు. నరసింహన్.. కంపెనీకి సీఈఓగానే కాకుండా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్​లో సభ్యుడిగానూ ఉంటారని స్టార్​బక్స్ గురువారం ప్రకటించింది. అక్టోబరు 1న ఆయన బాధ్యతలు స్వీకరిస్తారని తెలిపింది.

55 ఏళ్ల నరసింహన్ బ్రిటన్​కు చెందిన రెకిట్ బెంకిజర్ అనే బహుళజాతి కంపెనీకి సీఈఓగా పనిచేశారు. సెప్టెంబరు 30న రెకిట్ బెంకిజర్ కంపెనీ సీఈఓ బాధ్యతల నుంచి లక్ష్మణ్ నరసింహన్ వైదొలిగినట్లు సంస్థ తెలిపింది. 'అమెరికాకు తిరిగి రావడానికి నాకు అవకాశం లభించింది. లండన్​ను విడిచిపెట్టి రావడం కష్టతరమైనప్పటికీ.. కుటుంబం కోసం కఠిన నిర్ణయం తీసుకుంటున్నా' అని లక్ష్మణ్ నరసింహన్ తెలిపారు.

అమెరికాకు చెందిన దిగ్గజ కంపెనీ స్టార్​బక్స్​కు లక్ష్మణ్ నరసింహన్​ సీఈఓగా నియమితులవ్వడం వల్ల భారత సంతతికి చెందిన మరో వ్యక్తి ఉన్నత శిఖరాన్ని అధిరోహించనట్లైంది. ఇప్పటివరకు మైక్రోసాఫ్ట్ సీఈఓగా సత్య నాదెళ్ల, అడోబ్​ సీఈఓగా శంతను నారాయణ్, గూగుల్ సీఈఓగా సుందర్​ పిచాయ్​, ట్విట్టర్ సీఈఓ పరాగ్ అగర్వాల్ తదితరులు భారత సంతతికి చెందిన వ్యక్తులు సీఈఓలుగా ఉన్నారు.

ఇవీ చదవండి: ట్విట్టర్​లో 80 శాతం నకిలీ ఖాతాలే.. మస్క్​ కీలక వ్యాఖ్యలు

ఆ ఫోన్​ కాల్స్​, మెసేజెస్​ నమ్మితే అంతే సంగతులు.. కష్టార్జితం అంతా స్వాహా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.