ETV Bharat / business

స్పల్పంగా తగ్గిన బంగారం ధర, ఏపీ తెలంగాణలో ఎంతంటే

author img

By

Published : Aug 23, 2022, 10:43 AM IST

Gold Rate Today దేశంలో బంగారం ధర స్వల్పంగా తగ్గింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో పది గ్రాముల పసిడి, కిలో వెండి ధరలు ఇలా ఉన్నాయి.

GOLD PRICE TODAY
GOLD PRICE TODAY

Gold Price Today: ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో బంగారం ధర స్వల్పంగా తగ్గింది. పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.100 తగ్గి ప్రస్తుతం రూ. 53,100 పలుకుతోంది. మరోవైపు కేజీ వెండి ధర రూ.500 తగ్గి ప్రస్తుతం రూ.56,500 వద్ద ఉంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ధరలు ఇలా ఉన్నాయి.

  • Gold price in Hyderabad: పది గ్రాముల బంగారం ధర రూ.53,100గా ఉంది. కిలో వెండి ధర రూ.56,500 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Vijayawada: 10 గ్రాముల పసిడి ధర రూ.53,100వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.56,500 గా ఉంది.
  • Gold price in Vizag: 10 గ్రాముల పుత్తడి ధర రూ.53,100గా ఉంది. కేజీ వెండి ధర రూ.56,500 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Proddatur: పది గ్రాముల పసిడి ధర రూ.53,100గా ఉంది. కేజీ వెండి ధర రూ.56,500 వేల వద్ద కొనసాగుతోంది.
  • స్పాట్​ గోల్డ్​ ధర ఎంతంటే?.. అంతర్జాతీయంగా ఔన్సు స్పాట్ గోల్డ్ ధర.. 1,737 డాలర్లు పలుకుతోంది. ఔన్సు వెండి ధర 18.95 డాలర్లుగా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో ఇంధన ధరలు.. పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటరు పెట్రోల్ ధర రూ.109.64, డీజిల్ ధర రూ.97.80గా ఉంది. దిల్లీలో లీటరు పెట్రోల్​ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉన్నాయి.

క్రిప్టోకరెన్సీల ధరలు.. బిట్​కాయిన్ విలువ రూ.12,295 తగ్గింది. ప్రస్తుతం ఒక బిట్​కాయిన్ రూ.17,00,870 పలుకుతోంది. ఇథీరియంతో పాటు పలు క్రిప్టోకరెన్సీల ధరలు ఇలా ఉన్నాయి.

క్రిప్టోకరెన్సీప్రస్తుత ధర
బిట్​కాయిన్రూ.17,00,870
ఇథీరియంరూ.1,28,938
టెథర్రూ.79.86
బినాన్స్​ కాయిన్రూ.23,879
యూఎస్​డీ కాయిన్రూ.79.87

స్టాక్​ మార్కెట్లు.. దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు మంగళవారం స్థిరంగా కొనసాగుతున్నాయి. సెన్సెక్స్‌ 17 పాయింట్ల స్పల్ప లాభంతో 58 వేల 790 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 20 పాయింట్లు లాభపడి 17 వేల 490 వద్ద కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.79.84 వద్ద ట్రేడవుతోంది.

సెన్సెక్స్‌ 30 సూచీలో ఎంఅండ్‌ఎం, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, పవర్‌గ్రిడ్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, ఎన్‌టీపీసీ, సన్‌ఫార్మా, అల్ట్రాటెక్‌ సిమెంట్స్‌, ఎల్‌అండ్‌టీ, మారుతీ షేర్లు లాభాల్లో ఉన్నాయి. ఇన్ఫోసిస్‌, టెక్‌ మహీంద్రా, విప్రో, హెచ్‌సీఎల్‌ టెక్‌, టీసీఎస్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, హెచ్‌యూఎల్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, నెస్లే ఇండియా షేర్లు అత్యధికంగా నష్టపోతున్న జాబితాలో ఉన్నాయి.

ఇవీ చదవండి: డిపాజిట్ల కోసం బ్యాంకుల స్పెషల్​ స్కీమ్స్​, పండగలు వస్తున్నాయనే

మొబైల్‌ కొనాలనుకుంటున్నారా, త్వరలో ధరలు పెరిగే ఛాన్స్‌

Gold Price Today: ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో బంగారం ధర స్వల్పంగా తగ్గింది. పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.100 తగ్గి ప్రస్తుతం రూ. 53,100 పలుకుతోంది. మరోవైపు కేజీ వెండి ధర రూ.500 తగ్గి ప్రస్తుతం రూ.56,500 వద్ద ఉంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ధరలు ఇలా ఉన్నాయి.

  • Gold price in Hyderabad: పది గ్రాముల బంగారం ధర రూ.53,100గా ఉంది. కిలో వెండి ధర రూ.56,500 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Vijayawada: 10 గ్రాముల పసిడి ధర రూ.53,100వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.56,500 గా ఉంది.
  • Gold price in Vizag: 10 గ్రాముల పుత్తడి ధర రూ.53,100గా ఉంది. కేజీ వెండి ధర రూ.56,500 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Proddatur: పది గ్రాముల పసిడి ధర రూ.53,100గా ఉంది. కేజీ వెండి ధర రూ.56,500 వేల వద్ద కొనసాగుతోంది.
  • స్పాట్​ గోల్డ్​ ధర ఎంతంటే?.. అంతర్జాతీయంగా ఔన్సు స్పాట్ గోల్డ్ ధర.. 1,737 డాలర్లు పలుకుతోంది. ఔన్సు వెండి ధర 18.95 డాలర్లుగా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో ఇంధన ధరలు.. పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటరు పెట్రోల్ ధర రూ.109.64, డీజిల్ ధర రూ.97.80గా ఉంది. దిల్లీలో లీటరు పెట్రోల్​ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉన్నాయి.

క్రిప్టోకరెన్సీల ధరలు.. బిట్​కాయిన్ విలువ రూ.12,295 తగ్గింది. ప్రస్తుతం ఒక బిట్​కాయిన్ రూ.17,00,870 పలుకుతోంది. ఇథీరియంతో పాటు పలు క్రిప్టోకరెన్సీల ధరలు ఇలా ఉన్నాయి.

క్రిప్టోకరెన్సీప్రస్తుత ధర
బిట్​కాయిన్రూ.17,00,870
ఇథీరియంరూ.1,28,938
టెథర్రూ.79.86
బినాన్స్​ కాయిన్రూ.23,879
యూఎస్​డీ కాయిన్రూ.79.87

స్టాక్​ మార్కెట్లు.. దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు మంగళవారం స్థిరంగా కొనసాగుతున్నాయి. సెన్సెక్స్‌ 17 పాయింట్ల స్పల్ప లాభంతో 58 వేల 790 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 20 పాయింట్లు లాభపడి 17 వేల 490 వద్ద కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.79.84 వద్ద ట్రేడవుతోంది.

సెన్సెక్స్‌ 30 సూచీలో ఎంఅండ్‌ఎం, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, పవర్‌గ్రిడ్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, ఎన్‌టీపీసీ, సన్‌ఫార్మా, అల్ట్రాటెక్‌ సిమెంట్స్‌, ఎల్‌అండ్‌టీ, మారుతీ షేర్లు లాభాల్లో ఉన్నాయి. ఇన్ఫోసిస్‌, టెక్‌ మహీంద్రా, విప్రో, హెచ్‌సీఎల్‌ టెక్‌, టీసీఎస్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, హెచ్‌యూఎల్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, నెస్లే ఇండియా షేర్లు అత్యధికంగా నష్టపోతున్న జాబితాలో ఉన్నాయి.

ఇవీ చదవండి: డిపాజిట్ల కోసం బ్యాంకుల స్పెషల్​ స్కీమ్స్​, పండగలు వస్తున్నాయనే

మొబైల్‌ కొనాలనుకుంటున్నారా, త్వరలో ధరలు పెరిగే ఛాన్స్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.