ETV Bharat / business

'కరోనా కిట్ల తయారీకి యుద్ధ ప్రాతిపదికన కృషి చేయాలి'

కరోనా వ్యాప్తి చెందుతున్న తరుణంలో అవసరమైన మందులు, ఔషధ సామగ్రి ఉత్పత్తితో పాటు సరఫరాకు యుద్ధ ప్రాతిపదికన కృషి చేయాలని పిలుపునిచ్చారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. దేశంలో ఔషధాల తయారీకి సుమారు రూ.14వేల కోట్లు విలువైన రెండు పథకాలకు కేంద్రం ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు. ఔషధ పరిశ్రమ వర్గాలతో వీడియో కాన్ఫరెన్స్​ నిర్వహించి పలు అంశాలపై చర్చించారు.

author img

By

Published : Mar 21, 2020, 9:08 PM IST

Updated : Mar 21, 2020, 11:05 PM IST

PM asks pharma industry to ensure supply of essential items
నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.
'కరోనా కిట్ల తయారీకి యుద్ధ ప్రాతిపదికన కృషి చేయాలి'

కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అవసరమైన మందులు, ఔషధ సామగ్రిని దేశంలోనే ఉత్పత్తి చేసేందుకు కృషి చేయాలని ఫార్మా సంస్థలకు సూచించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఇందుకోసం రూ.14వేల కోట్ల విలువైన రెండు పథకాలకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు.

కొవిడ్​-19 వైరస్​ వ్యాప్తిపై ఔషధ కంపెనీల ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్​ నిర్వహించారు ప్రధాని మోదీ. ఈ సందర్భంగా పలు కీలక విషయాలపై చర్చించారు. కరోనా కోసం యుద్ధ ప్రాతిపదికన ఆర్​ఎన్​ఏ పరీక్ష కిట్ల తయారీకి కృషి చేయాలని పరిశ్రమ ప్రతినిధులను కోరారు.

" అవసరమైన మందులు, సామగ్రి సరఫరా చేయటమే కాకుండా సరికొత్త ఆవిష్కరణలతో ముందుకు రావాలి. దేశంలో ఫార్మాకి అవసరమైన ఔషధాల నిర్వహణ, తయారీ, సరఫరాకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. క్లిష్టమైన ఔషధాలు, వైద్య పరికరాలు దేశంలోనే తయారు చేసేందుకు ప్రభుత్వం రూ.10వేల కోట్లు, రూ.4వేల కోట్ల విలువైన రెండు పథకాలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అవసరమైన ఔషధాల సరఫరాను పెంచుతూనే నల్లబజారును నిరోధించడం అత్యవసరం. అందుకు తగిన విధంగా కృషి చేయాలి. కోవిడ్‌-19 సవాలును ఎదుర్కోవడంలో ఫార్మా ఉత్పత్తి, పంపిణీదారులు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఔషధ చిల్లర వ్యాపారులు, విక్రేతలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలి. "

- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.

ప్రస్తుత అత్యవసర తరుణంలో ఔషధ పరిశ్రమ నిరంతరం పనిచేయడం ముఖ్యమని అభిప్రాయపడ్డారు మోదీ. ఈ రంగంలో శ్రామిక శక్తి కొరత లేకుండా చూడాలని వెల్లడించారు. ఫార్మసీల్లో సామాజిక దూరాన్ని పాటించేందుకు హోం-డెలివరీ మోడల్‌ను అనుమతించేందుకు మార్గాలు అన్వేషించాలని, వైరస్ వ్యాప్తిని నివారించడానికి డిజిటల్ చెల్లింపు విధానాల వాడకాన్ని ప్రోత్సహించాలని సూచించారు.

కట్టుబడి ఉన్నాం..

అవసరమైన మందులు, పరికరాల సరఫరాను నిర్వహించడానికి తాము కట్టుబడి ఉన్నామని, టీకాల అభివృద్ధికి కూడా కృషి చేస్తున్నామని ఫార్మా ప్రతినిధులు మోదీకి వివరించారు. ఫార్మా రంగానికి ప్రభుత్వ విధాన ప్రకటనలు భారీ ప్రోత్సాహకాన్ని ఇస్తున్నాయని తెలిపారు.

'కరోనా కిట్ల తయారీకి యుద్ధ ప్రాతిపదికన కృషి చేయాలి'

కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అవసరమైన మందులు, ఔషధ సామగ్రిని దేశంలోనే ఉత్పత్తి చేసేందుకు కృషి చేయాలని ఫార్మా సంస్థలకు సూచించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఇందుకోసం రూ.14వేల కోట్ల విలువైన రెండు పథకాలకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు.

కొవిడ్​-19 వైరస్​ వ్యాప్తిపై ఔషధ కంపెనీల ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్​ నిర్వహించారు ప్రధాని మోదీ. ఈ సందర్భంగా పలు కీలక విషయాలపై చర్చించారు. కరోనా కోసం యుద్ధ ప్రాతిపదికన ఆర్​ఎన్​ఏ పరీక్ష కిట్ల తయారీకి కృషి చేయాలని పరిశ్రమ ప్రతినిధులను కోరారు.

" అవసరమైన మందులు, సామగ్రి సరఫరా చేయటమే కాకుండా సరికొత్త ఆవిష్కరణలతో ముందుకు రావాలి. దేశంలో ఫార్మాకి అవసరమైన ఔషధాల నిర్వహణ, తయారీ, సరఫరాకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. క్లిష్టమైన ఔషధాలు, వైద్య పరికరాలు దేశంలోనే తయారు చేసేందుకు ప్రభుత్వం రూ.10వేల కోట్లు, రూ.4వేల కోట్ల విలువైన రెండు పథకాలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అవసరమైన ఔషధాల సరఫరాను పెంచుతూనే నల్లబజారును నిరోధించడం అత్యవసరం. అందుకు తగిన విధంగా కృషి చేయాలి. కోవిడ్‌-19 సవాలును ఎదుర్కోవడంలో ఫార్మా ఉత్పత్తి, పంపిణీదారులు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఔషధ చిల్లర వ్యాపారులు, విక్రేతలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలి. "

- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.

ప్రస్తుత అత్యవసర తరుణంలో ఔషధ పరిశ్రమ నిరంతరం పనిచేయడం ముఖ్యమని అభిప్రాయపడ్డారు మోదీ. ఈ రంగంలో శ్రామిక శక్తి కొరత లేకుండా చూడాలని వెల్లడించారు. ఫార్మసీల్లో సామాజిక దూరాన్ని పాటించేందుకు హోం-డెలివరీ మోడల్‌ను అనుమతించేందుకు మార్గాలు అన్వేషించాలని, వైరస్ వ్యాప్తిని నివారించడానికి డిజిటల్ చెల్లింపు విధానాల వాడకాన్ని ప్రోత్సహించాలని సూచించారు.

కట్టుబడి ఉన్నాం..

అవసరమైన మందులు, పరికరాల సరఫరాను నిర్వహించడానికి తాము కట్టుబడి ఉన్నామని, టీకాల అభివృద్ధికి కూడా కృషి చేస్తున్నామని ఫార్మా ప్రతినిధులు మోదీకి వివరించారు. ఫార్మా రంగానికి ప్రభుత్వ విధాన ప్రకటనలు భారీ ప్రోత్సాహకాన్ని ఇస్తున్నాయని తెలిపారు.

Last Updated : Mar 21, 2020, 11:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.