ETV Bharat / business

JAMSETJI TATA: దాతృత్వంలో జెంషెట్​ జీ టాటాదే అగ్రస్థానం!

author img

By

Published : Jun 23, 2021, 6:00 PM IST

దాతృత్వ కార్యక్రమాల్లో టాటా గ్రూప్​ తర్వాతే ఎవరైనా అనే విషయంలో సందేహం లేదు. టాటా గ్రూప్ ప్రారంభం నుంచే ఈ ఆనవాయితీ కొనసాగుతోందని ఓ నివేదిక తాజాగా స్పష్టం చేసింది. గడిచిన శతాబ్ద కాలంలో దివంగత పారిశ్రామిక దిగ్గజం, టాటా గ్రూప్​ వ్యవస్థాపకుడు 'జెంషెట్​ జీ టాటా' 102 బిలియన్​ డాలర్లను దాతృత్వ సేవలకు వినియోగించినట్లు తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా ఇదే అత్యధిక విరాళమని నివేదిక పేర్కొంది.

Worlds biggest philanthropist is Jamsetji Tata
జెంషెట్​ జీ టాటా ప్రపంచ దాతృత్వ దిగ్గజం

టాటా గ్రూప్​ వ్యవస్థాపకుడు 'జెంషెట్​ జీ టాటా'.. ప్రపంచంలోనే అతిపెద్ద దాతృత్వవేత్త అని ఓ నివేదిక పేర్కొంది. గడిచిన శతాబ్దానికి సంబంధించిన విరాళాలపై.. హరూన్​, ఎడెల్​గేవ్​ ఫౌండేషన్​లు సంయుక్తంగా రూపొందించిన నివేదికలో ఈ విషయం తెలిసింది.

గడిచిన శతాబ్ద కాలంలో దివంగత జెం​షెట్​ జీ టాటా దాతృత్వం విలువ 102 బిలియన్ డాలర్లుగా పేర్కొంది నివేదిక. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 50 మందికి ఈ జాబితాలో చోటు దక్కగా.. జెంషెట్​జీ టాటా అగ్రస్థానంలో ఉండటం విశేషం.

తర్వాతి స్థానాల్లో ఉన్నది వీరే..

  • మైక్రోసాఫ్ట్​ సహ వ్యవస్థాపకుడు బిల్​గేట్స్, ఆయన నుంచి విడాకులు తీసుకోనున్న సతీమణి​ మెలిందా కలిపి 74.6 బిలియన్​ డాలర్లు విరాళంగా ఇచ్చినట్లు నివేదిక పేర్కొంది. దీనితో వీరు ప్రపంచంలోనే అత్యధిక విరాళాలు ఇచ్చిన జాబితాలో రెండో స్థానంలో ఉన్నారు. ప్రముఖ ఇన్వెస్టర్​ వారెన్​ బఫెట్​ 37.4 బిలియన్ డాలర్ల వితరణతో మూడో స్థానంలో నిలిచారు.
  • జార్జ్​ సోరస్​ 34.8 బిలియన్​ డాలర్లు, జాన్ డీ రాక్​ఫెల్లర్ 26,8 బిలియన్​ డాలర్లు విరాళంగా ఇచ్చి వరుసగా 4,5 స్థానాల్లో ఉన్నారు.
  • ఈ జాబీతాలో చోటు దక్కించుకున్న మరో భారతీయుడు విప్రో అధినేత అజీమ్​ ప్రేమ్​జీ మాత్రమే కావడం గమనార్హం. ప్రేమ్​జీ 22 బిలియన్​ డాలర్లు వితరణ చేసినట్లు నివేదిక పేర్కొంది.
  • అల్ఫ్రెడ్ నోబెల్​ వంటి ప్రముఖులు కూడా టాప్​ 50లో లేకపోవడం గమనార్హం.
  • ఈ జాబితాలో ఉన్న వారిలో 38 మంది అమెరికాకు చెందిన వారేనని నివేదిక పేర్కొంది. యూకేకు చెందిన వారు 5 మంది, ముగ్గురు చైనీయులు ఇందులో ఉన్నట్లు తెలిపింది.
  • మొత్తం టాప్​ 50 మంది కలిసి గత శతాబ్దంలో 832 బిలియన్ డాలర్లు వితరణ చేసినట్లు నివేదిక వివరించింది. తమ ఫౌండేషన్ల ద్వారా, విరాళాల రూపంలో ఈ మొత్తం ఇచ్చినట్లు వెల్లడించింది.
  • ఈ టాప్​-50 జాబితాలో 37 మంది ఇప్పటికే మరణించగా.. 13 మంది మాత్రమే జీవించి ఉన్నారు.

ఇవీ చదవండి:

టాటా గ్రూప్​ వ్యవస్థాపకుడు 'జెంషెట్​ జీ టాటా'.. ప్రపంచంలోనే అతిపెద్ద దాతృత్వవేత్త అని ఓ నివేదిక పేర్కొంది. గడిచిన శతాబ్దానికి సంబంధించిన విరాళాలపై.. హరూన్​, ఎడెల్​గేవ్​ ఫౌండేషన్​లు సంయుక్తంగా రూపొందించిన నివేదికలో ఈ విషయం తెలిసింది.

గడిచిన శతాబ్ద కాలంలో దివంగత జెం​షెట్​ జీ టాటా దాతృత్వం విలువ 102 బిలియన్ డాలర్లుగా పేర్కొంది నివేదిక. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 50 మందికి ఈ జాబితాలో చోటు దక్కగా.. జెంషెట్​జీ టాటా అగ్రస్థానంలో ఉండటం విశేషం.

తర్వాతి స్థానాల్లో ఉన్నది వీరే..

  • మైక్రోసాఫ్ట్​ సహ వ్యవస్థాపకుడు బిల్​గేట్స్, ఆయన నుంచి విడాకులు తీసుకోనున్న సతీమణి​ మెలిందా కలిపి 74.6 బిలియన్​ డాలర్లు విరాళంగా ఇచ్చినట్లు నివేదిక పేర్కొంది. దీనితో వీరు ప్రపంచంలోనే అత్యధిక విరాళాలు ఇచ్చిన జాబితాలో రెండో స్థానంలో ఉన్నారు. ప్రముఖ ఇన్వెస్టర్​ వారెన్​ బఫెట్​ 37.4 బిలియన్ డాలర్ల వితరణతో మూడో స్థానంలో నిలిచారు.
  • జార్జ్​ సోరస్​ 34.8 బిలియన్​ డాలర్లు, జాన్ డీ రాక్​ఫెల్లర్ 26,8 బిలియన్​ డాలర్లు విరాళంగా ఇచ్చి వరుసగా 4,5 స్థానాల్లో ఉన్నారు.
  • ఈ జాబీతాలో చోటు దక్కించుకున్న మరో భారతీయుడు విప్రో అధినేత అజీమ్​ ప్రేమ్​జీ మాత్రమే కావడం గమనార్హం. ప్రేమ్​జీ 22 బిలియన్​ డాలర్లు వితరణ చేసినట్లు నివేదిక పేర్కొంది.
  • అల్ఫ్రెడ్ నోబెల్​ వంటి ప్రముఖులు కూడా టాప్​ 50లో లేకపోవడం గమనార్హం.
  • ఈ జాబితాలో ఉన్న వారిలో 38 మంది అమెరికాకు చెందిన వారేనని నివేదిక పేర్కొంది. యూకేకు చెందిన వారు 5 మంది, ముగ్గురు చైనీయులు ఇందులో ఉన్నట్లు తెలిపింది.
  • మొత్తం టాప్​ 50 మంది కలిసి గత శతాబ్దంలో 832 బిలియన్ డాలర్లు వితరణ చేసినట్లు నివేదిక వివరించింది. తమ ఫౌండేషన్ల ద్వారా, విరాళాల రూపంలో ఈ మొత్తం ఇచ్చినట్లు వెల్లడించింది.
  • ఈ టాప్​-50 జాబితాలో 37 మంది ఇప్పటికే మరణించగా.. 13 మంది మాత్రమే జీవించి ఉన్నారు.

ఇవీ చదవండి:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.