ETV Bharat / business

రబీ పంటకు మద్దతు ధర పెంచిన కేంద్రం

రబీ పంట.. 2022-23 మార్కెటింగ్ సీజన్​కు సంబంధించిన కనీస మద్దతు ధరలకు కేంద్ర మంత్రి మండలి ఆమోదముద్ర వేసింది. ఇందులో గోధుమ ధర క్వింటాకు రూ.40 ధరను పెంచింది. కొత్త ధరల వివరాలు ఇలా ఉన్నాయి.

author img

By

Published : Sep 8, 2021, 3:12 PM IST

Updated : Sep 8, 2021, 10:12 PM IST

Govt hikes MSP
మద్దతు ధర పెంపు

2022-23 మార్కెటింగ్ సంవత్సరానికి సంబంధించి రబీ పంటకు కనీస మద్దతు ధరలను (ఎంఎస్​పీ) ఖరారు చేసింది కేంద్రం. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం సమావేశమైన కేంద్ర మంత్రి మండలి.. ఈమేరకు నిర్ణయం తీసుకుంది.

  • గోధుమ క్వింటాల్​కు కనీస మద్దతు ధర రూ.2015కు పెంచింది. ప్రస్తుతం ఇది రూ.1975గా ఉంది.
  • బార్లీ క్లింటా ప్రస్తుతం ఎంఎస్​పీ రూ.1600 ఉండగా.. 2022-23 మార్కెటింగ్ సంవత్సరానికి గానూ రూ.1635కి పెంచింది.
  • పొద్దుతిరుగుడు క్వింటా కనీస మద్దతు ధరను రూ.5,327 నుంచి రూ.5,441కు పెరిగింది.
  • ఎర్ర కంది (మసూర్​) కనీస మద్దతు ధర రూ.400 పెంచింది. దీనితో క్వింటా ధర రూ.5,100 నుంచి రూ.5,500కు పెరిగింది.
  • అవాలు కనీస మద్దతు ధరను కూడా 400 పెంచింది. దీనితో క్వింటా ఆవాలు ధర రూ.5050కి చేరింది. ఇందుకు ముందు ఇది రూ.4,650గా ఉండేది.
  • కాయ ధాన్యాల (కందులు, పెసళ్ల వంటివి).. కనీస మద్దతు ధరను కూడా రూ.5,100 నుంచి రూ.5,230కి పెంచింది.

కేబినెట్ తీసుకున్న మరిన్ని నిర్ణయాలు..

రబీ కనీస మద్దతు ధర పెంపు సహా మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది కేబినెట్​. జౌళి పరిశ్రమకు ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక (పీఎల్​ఐ) పథకాన్ని వర్తింపజేయాలని నిర్ణయించింది. ఈ పథకంలో భాగంగా రూ.10,683 ప్రోత్సాహకాలు అందించనున్నట్లు తెలిపింది.

ముఖ్యంగా చేనేత వస్త్రాలు, సాంకేతికంగా రూపొందించే వస్త్ర పరిశ్రమలకు ఈ పథకం ద్వారా లబ్ది చేకురనున్నట్లు కేంద్ర మంత్రి అనురాగ్​ ఠాకూర్​ వెల్లడించారు.

ఇదీ చదవండి: 'వజ్రాభరణాలనూ అద్దెకు తీసుకోవచ్చు'

2022-23 మార్కెటింగ్ సంవత్సరానికి సంబంధించి రబీ పంటకు కనీస మద్దతు ధరలను (ఎంఎస్​పీ) ఖరారు చేసింది కేంద్రం. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం సమావేశమైన కేంద్ర మంత్రి మండలి.. ఈమేరకు నిర్ణయం తీసుకుంది.

  • గోధుమ క్వింటాల్​కు కనీస మద్దతు ధర రూ.2015కు పెంచింది. ప్రస్తుతం ఇది రూ.1975గా ఉంది.
  • బార్లీ క్లింటా ప్రస్తుతం ఎంఎస్​పీ రూ.1600 ఉండగా.. 2022-23 మార్కెటింగ్ సంవత్సరానికి గానూ రూ.1635కి పెంచింది.
  • పొద్దుతిరుగుడు క్వింటా కనీస మద్దతు ధరను రూ.5,327 నుంచి రూ.5,441కు పెరిగింది.
  • ఎర్ర కంది (మసూర్​) కనీస మద్దతు ధర రూ.400 పెంచింది. దీనితో క్వింటా ధర రూ.5,100 నుంచి రూ.5,500కు పెరిగింది.
  • అవాలు కనీస మద్దతు ధరను కూడా 400 పెంచింది. దీనితో క్వింటా ఆవాలు ధర రూ.5050కి చేరింది. ఇందుకు ముందు ఇది రూ.4,650గా ఉండేది.
  • కాయ ధాన్యాల (కందులు, పెసళ్ల వంటివి).. కనీస మద్దతు ధరను కూడా రూ.5,100 నుంచి రూ.5,230కి పెంచింది.

కేబినెట్ తీసుకున్న మరిన్ని నిర్ణయాలు..

రబీ కనీస మద్దతు ధర పెంపు సహా మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది కేబినెట్​. జౌళి పరిశ్రమకు ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక (పీఎల్​ఐ) పథకాన్ని వర్తింపజేయాలని నిర్ణయించింది. ఈ పథకంలో భాగంగా రూ.10,683 ప్రోత్సాహకాలు అందించనున్నట్లు తెలిపింది.

ముఖ్యంగా చేనేత వస్త్రాలు, సాంకేతికంగా రూపొందించే వస్త్ర పరిశ్రమలకు ఈ పథకం ద్వారా లబ్ది చేకురనున్నట్లు కేంద్ర మంత్రి అనురాగ్​ ఠాకూర్​ వెల్లడించారు.

ఇదీ చదవండి: 'వజ్రాభరణాలనూ అద్దెకు తీసుకోవచ్చు'

Last Updated : Sep 8, 2021, 10:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.