ETV Bharat / briefs

'ఓట్ల లెక్కింపులో నిబంధనలు కచ్చితంగా పాటించాలి'

ఓట్ల లెక్కింపు ప్రక్రియలో ఎన్నికల కమిషన్ నిబంధనలను కచ్చితంగా పాటించాలని..ఏవైనా ఉల్లంఘనలు జరిగితే చర్యలు తప్పవని అనంతపురం జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ వీరపాండియన్, సంయుక్త కలెక్టర్ ఢిల్లీరావు హెచ్చరించారు. అనంతపురం జె.ఎన్.టి.యు ఇంజనీరింగ్ కళాశాల ఆడిటోరియంలో కౌంటింగ్​ సూపర్ వైజర్లు, అసిస్టెంట్లకు ఓట్ల లెక్కింపు ప్రక్రియపై అవగాహన సదస్సు నిర్వహించారు.

author img

By

Published : May 10, 2019, 6:32 AM IST

Updated : May 10, 2019, 11:58 AM IST

సంయుక్త కలెక్టర్ ఢిల్లీరావు
సంయుక్త కలెక్టర్ ఢిల్లీరావు

కౌంటింగ్​లో పాటించవలసిన నిబంధనలు, ఏవైనా సమస్యలు తలెత్తితే ఎలా వ్యవహరించాలన్న విషయాలపై అధికారులు చర్చించారు. ఓట్ల లెక్కింపు అనంతపురం పార్లమెంట్​ స్థానానికి జె.ఎన్.టి.యులో, హిందూపురం స్థానానికి ఎస్కే యూనివర్శిటీలో కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు సంయుక్త కలెక్టర్ ఢిల్లీరావు తెలిపారు. ఒక్కో కౌంటింగ్ హాల్​లో 14 టేబుళ్లు ఏర్పాటు చేస్తామన్న ఆయన.. ప్రతి కౌంటింగ్ టేబుల్ వద్ద ఒక సూపర్ వైజర్తో పాటు పరిశీలకులు ఉంటారని తెలిపారు. కౌంటింగ్​కు ఈ నెల 22వ తేదీన ర్యాండమైజేషన్ చేసి సిబ్బంది నియామకం చేపడతామన్నారు.

ఇవీ చూడండి : ఎన్నికల సిబ్బందికి శిక్షణ... దిల్లీ నుంచి నిపుణుల రాక!

సంయుక్త కలెక్టర్ ఢిల్లీరావు

కౌంటింగ్​లో పాటించవలసిన నిబంధనలు, ఏవైనా సమస్యలు తలెత్తితే ఎలా వ్యవహరించాలన్న విషయాలపై అధికారులు చర్చించారు. ఓట్ల లెక్కింపు అనంతపురం పార్లమెంట్​ స్థానానికి జె.ఎన్.టి.యులో, హిందూపురం స్థానానికి ఎస్కే యూనివర్శిటీలో కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు సంయుక్త కలెక్టర్ ఢిల్లీరావు తెలిపారు. ఒక్కో కౌంటింగ్ హాల్​లో 14 టేబుళ్లు ఏర్పాటు చేస్తామన్న ఆయన.. ప్రతి కౌంటింగ్ టేబుల్ వద్ద ఒక సూపర్ వైజర్తో పాటు పరిశీలకులు ఉంటారని తెలిపారు. కౌంటింగ్​కు ఈ నెల 22వ తేదీన ర్యాండమైజేషన్ చేసి సిబ్బంది నియామకం చేపడతామన్నారు.

ఇవీ చూడండి : ఎన్నికల సిబ్బందికి శిక్షణ... దిల్లీ నుంచి నిపుణుల రాక!

Intro:Ap_cdp_46_09_bhavannarayanaswamy_garudostavam_AD_Av_c7
కడప జిల్లా రాజంపేట మండలం బోయినపల్లెలో వెలసిన భద్రావతి భావనారాయణ స్వామి ఆలయంలో స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం భావనారాయణ స్వామి మోహిని అలంకారంలో పురవీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయంలో స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు జరిగాయి. రాత్రికి గరుడ వాహనంపై భద్రావతి భావనారాయణ స్వామి భక్తులకు కనువిందు చేశారు. స్వామివారిని కనులారా దర్శించుకుని భక్తులు తరించారు. స్వామికి కాయ కర్పూరం సమర్పించ పూజలు చేశారు. ఈ ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం సాయంత్రం స్వామివారి కల్యాణోత్సవం వైభవంగా జరగనుంది.


Body:గరుడ వాహనంపై భద్రావతి భావనారాయుణుడు


Conclusion:కడప జిల్లా రాజంపేట
Last Updated : May 10, 2019, 11:58 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.