ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్లే జగన్ కు, సినిమా నటులకు రాష్ట్రంపై అవగాహన లేదని విమర్శించిన సీఎం..మోదీ మాటలు కోటలు దాటతాయి.. చేతలు గడప కూడా దాటవని ఎద్దేవా చేశారు.
కిడ్నీ రోగులకు ఉచితంగా డయాలసిస్ చేయిస్తూ...3,500 రూపాయలు పింఛను ఇస్తున్నామని తెలిపారు చంద్రబాబు. సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మించి కిడ్నీ రోగులను ఆదుకుంటామని పేర్కొన్నారు. చంద్రన్న బీమాను 5 లక్షల నుంచి10 లక్షల రూపాయలు చేస్తామని హామీ ఇచ్చిన బాబు..తిత్లీ తుపాను వస్తే కేంద్రం సాయం చేయలేదని విమర్శించారు. రాష్ట్రాభివృద్ధికి కట్టుబడి ఉన్న తెదేపానే మళ్లీగెలిపించాలని కోరారు.
ఇవీ చూడండి