ETV Bharat / bharat

'మిస్టర్ క్లీన్' సీఎం మేజిక్.. త్రిపురలో బీజేపీ విక్టరీ

author img

By

Published : Mar 2, 2023, 5:04 PM IST

Updated : Mar 2, 2023, 8:40 PM IST

త్రిపురలో కాషాయ జెండా వరుసగా రెండోసారి ఎగిరింది. శాసనసభ ఎన్నికల్లో అధికార భాజపా కూటమి 33 సీట్లు గెలుచుకుంది. కాంగ్రెస్​-వామపక్ష కూటమి 14 స్థానాలతో సరిపెట్టుకుంది. తిప్రా మోతా పార్టీ 13 చోట్ల విజయం సాధించింది. మరోసారి ముఖ్యమంత్రి పీఠం మాణిక్ సాహానే వరించనున్నట్లు తెలుస్తోంది.

tripura election result 2023
త్రిపుర ఎన్నికలు 2023

త్రిపురలో బీజేపీ వరుసగా రెండో సారి విజయకేతనం ఎగురవేసింది. భాజపా- ఐపీఎఫ్​టీ కూటమి 33 సీట్లను గెలుచుకుంది. పొత్తుతో బరిలోకి దిగిన కాంగ్రెస్-వామపక్ష కూటమి ఈ ఎన్నికల్లో కూడా ఎదురుదెబ్బతింది. ఈ కూటమి 14 సీట్లను గెలుచుకుంది. అనుహ్యంగా ఎన్నికల బరిలోకి దిగిన తిప్రా మోతా పార్టీ 13 స్థానాలు దక్కించుకుని రాష్ట్రంలో సత్తా చాటింది. త్రిపురలో బీజేపీ విజయంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మాణిక్ సాహా కృషి చాలా ఉందని పార్టీ రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

2023 త్రిపుర శాసనసభ ఎన్నికల్లో పార్టీలవారీగా సాధించిన సీట్లు..

  • భాజపా కూటమి- 33
  • కాంగ్రెస్-వామపక్ష కూటమి- 14
  • తిప్రా మోతా పార్టీ- 13

'మిస్టర్ క్లీన్'​గా పేరున్న మాణిక్ సాహా టౌన్ బర్దోవాలి నుంచి 1,257 ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి అశిశ్ కుమార్ సాహాపై విజయం సాధించారు. ఈ క్రమంలో రెండో సారి కూడా త్రిపుర ముఖ్యమంత్రి పీఠం మాణిక్ సాహానే వరిస్తుందని తెలుస్తోంది. మాణిక్ సాహా 2022లోనే త్రిపుర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి పార్టీ అసమ్మతి నేతలను కలుపుకుంటూ ముందుకు సాగారు. అలాగే క్లీన్ ఇమేజ్​ను సంపాదించుకున్నారు. సాహా.. స్వతహాగా వైద్యుడు. స్థానికంగా ఆయనకు మంచి పేరు ఉండడం పార్టీ విజయంలో సహాయపడిందని విశ్లేషకులు అంటున్నారు.

2018లో మూడు దశాబ్దాల వామపక్షాల పాలనకు చరమగీతం పాడి అధికారంలోకి వచ్చిన బీజేపీ.. సీఎం పీఠాన్ని బిప్లవ్ కుమార్​ దేవ్​కు అప్పగించింది. ఆయన వివాదస్పద వ్యాఖ్యలు, శాంతి భద్రతలు నెలకొల్పడంలో విఫలమయ్యారు. దీంతో ఆయనను తప్పించి బీజేపీ అధిష్ఠానం మాణిక్ సాహాను 2022లో సీఎం పీఠంపై కూర్చోబెట్టింది. అలాగే బిప్లవ్ దేవ్​ను తొలగించిన తర్వాత పార్టీని మాణిక్ సాహా పార్టీలో ఉన్న అసమ్మతి చక్కదిద్దారు.

బీజేపీ విజయానికి కారణాలు..

  • ఎన్నికలకు ఏడాది ముందు ముఖ్యమంత్రి మార్పు
  • డబుల్ ఇంజిన్ సర్కార్ అంటూ సాగిన ప్రధాని నరేంద్ర మోదీ ప్రచారం
  • మోదీ చరిష్మా, త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సాహా క్లీన్ ఇమేజ్​
  • త్రిముఖ పోటీ నెలకొనడం
  • కాంగ్రెస్​-వామపక్షాల పొత్తును ప్రజలు జీర్ణించుకోలేకపోవడం
  • ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోవడం

2018 త్రిపుర శాసనసభ ఎన్నికల్లో బీజేపీ కూటమి, వామపక్షాల మధ్య నువ్వా- నేనా పోటీ నడిచింది. అయితే అనుహ్యంగా ఈ సారి ఎన్నికల్లో తిప్రా మోథా పార్టీ రంగంలోకి దిగింది. దీంతో రాష్ట్రంలో త్రిముఖ పోరు నెలకొంది. ట్రైబల్ బెల్ట్​లో మంచి పట్టున్న తిప్రా మోతా పార్టీ ప్రభావం చూపింది. తిప్రా మోతా పార్టీకి అధ్యక్షుడు ప్రద్యోత్‌దేవ్‌ వర్మ. ఆయన ప్రత్యేక రాష్ట్రం 'తిప్రాల్యాండ్​' కోసం డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ సారి జరిగిన శాసనసభ ఎన్నికల్లో హంగ్​ వస్తే తిప్రా మోతా పార్టీ కింగ్ మేకర్​గా అవతరించేది. కానీ.. భాజపా-ఐపీఎఫ్​టీ కూటమి స్పష్టమైన మెజారిటీ సాధించింది. మరోవైపు తిప్రా మోతా ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ తిప్రాల్యాండ్ మిగతా డిమాండ్లన్నింటినీ నెరవేర్చేందుకు సిద్ధంగా ఉన్నామని బీజేపీ తెలిపింది.

త్రిపురలో బీజేపీ వరుసగా రెండో సారి విజయకేతనం ఎగురవేసింది. భాజపా- ఐపీఎఫ్​టీ కూటమి 33 సీట్లను గెలుచుకుంది. పొత్తుతో బరిలోకి దిగిన కాంగ్రెస్-వామపక్ష కూటమి ఈ ఎన్నికల్లో కూడా ఎదురుదెబ్బతింది. ఈ కూటమి 14 సీట్లను గెలుచుకుంది. అనుహ్యంగా ఎన్నికల బరిలోకి దిగిన తిప్రా మోతా పార్టీ 13 స్థానాలు దక్కించుకుని రాష్ట్రంలో సత్తా చాటింది. త్రిపురలో బీజేపీ విజయంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మాణిక్ సాహా కృషి చాలా ఉందని పార్టీ రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

2023 త్రిపుర శాసనసభ ఎన్నికల్లో పార్టీలవారీగా సాధించిన సీట్లు..

  • భాజపా కూటమి- 33
  • కాంగ్రెస్-వామపక్ష కూటమి- 14
  • తిప్రా మోతా పార్టీ- 13

'మిస్టర్ క్లీన్'​గా పేరున్న మాణిక్ సాహా టౌన్ బర్దోవాలి నుంచి 1,257 ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి అశిశ్ కుమార్ సాహాపై విజయం సాధించారు. ఈ క్రమంలో రెండో సారి కూడా త్రిపుర ముఖ్యమంత్రి పీఠం మాణిక్ సాహానే వరిస్తుందని తెలుస్తోంది. మాణిక్ సాహా 2022లోనే త్రిపుర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి పార్టీ అసమ్మతి నేతలను కలుపుకుంటూ ముందుకు సాగారు. అలాగే క్లీన్ ఇమేజ్​ను సంపాదించుకున్నారు. సాహా.. స్వతహాగా వైద్యుడు. స్థానికంగా ఆయనకు మంచి పేరు ఉండడం పార్టీ విజయంలో సహాయపడిందని విశ్లేషకులు అంటున్నారు.

2018లో మూడు దశాబ్దాల వామపక్షాల పాలనకు చరమగీతం పాడి అధికారంలోకి వచ్చిన బీజేపీ.. సీఎం పీఠాన్ని బిప్లవ్ కుమార్​ దేవ్​కు అప్పగించింది. ఆయన వివాదస్పద వ్యాఖ్యలు, శాంతి భద్రతలు నెలకొల్పడంలో విఫలమయ్యారు. దీంతో ఆయనను తప్పించి బీజేపీ అధిష్ఠానం మాణిక్ సాహాను 2022లో సీఎం పీఠంపై కూర్చోబెట్టింది. అలాగే బిప్లవ్ దేవ్​ను తొలగించిన తర్వాత పార్టీని మాణిక్ సాహా పార్టీలో ఉన్న అసమ్మతి చక్కదిద్దారు.

బీజేపీ విజయానికి కారణాలు..

  • ఎన్నికలకు ఏడాది ముందు ముఖ్యమంత్రి మార్పు
  • డబుల్ ఇంజిన్ సర్కార్ అంటూ సాగిన ప్రధాని నరేంద్ర మోదీ ప్రచారం
  • మోదీ చరిష్మా, త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సాహా క్లీన్ ఇమేజ్​
  • త్రిముఖ పోటీ నెలకొనడం
  • కాంగ్రెస్​-వామపక్షాల పొత్తును ప్రజలు జీర్ణించుకోలేకపోవడం
  • ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోవడం

2018 త్రిపుర శాసనసభ ఎన్నికల్లో బీజేపీ కూటమి, వామపక్షాల మధ్య నువ్వా- నేనా పోటీ నడిచింది. అయితే అనుహ్యంగా ఈ సారి ఎన్నికల్లో తిప్రా మోథా పార్టీ రంగంలోకి దిగింది. దీంతో రాష్ట్రంలో త్రిముఖ పోరు నెలకొంది. ట్రైబల్ బెల్ట్​లో మంచి పట్టున్న తిప్రా మోతా పార్టీ ప్రభావం చూపింది. తిప్రా మోతా పార్టీకి అధ్యక్షుడు ప్రద్యోత్‌దేవ్‌ వర్మ. ఆయన ప్రత్యేక రాష్ట్రం 'తిప్రాల్యాండ్​' కోసం డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ సారి జరిగిన శాసనసభ ఎన్నికల్లో హంగ్​ వస్తే తిప్రా మోతా పార్టీ కింగ్ మేకర్​గా అవతరించేది. కానీ.. భాజపా-ఐపీఎఫ్​టీ కూటమి స్పష్టమైన మెజారిటీ సాధించింది. మరోవైపు తిప్రా మోతా ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ తిప్రాల్యాండ్ మిగతా డిమాండ్లన్నింటినీ నెరవేర్చేందుకు సిద్ధంగా ఉన్నామని బీజేపీ తెలిపింది.

Last Updated : Mar 2, 2023, 8:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.