ETV Bharat / bharat

పెగాసస్​పై ఆగని రగడ- టీఎంసీ ఎంపీ తీరుపై దుమారం

author img

By

Published : Jul 22, 2021, 5:26 PM IST

పెగాసస్ వ్యవహారం రాజ్యసభలో పెను దుమారానికి కారణమైంది. ఆరోపణలన్నీ దురుద్దేశపూర్వకమని కేంద్రం ఎదురుదాడికి దిగగా... టీఎంసీ ఎంపీ ఒకరు మంత్రి చేతిలో నుంచి పేపర్లు లాక్కుని, చించేయడం వివాదాస్పదమైంది. ఈ గందరగోళం మధ్య రాజ్యసభ ఎలాంటి కార్యకలాపాలు నిర్వహించకుండానే శుక్రవారానికి వాయిదా పడింది. లోక్​సభలోనూ వాయిదాల పర్వం కొనసాగింది.

RS Deputy Chairman
రాజ్యసభ

పెగాసస్​ హ్యాకింగ్​ సహా వివిధ అంశాలపై విపక్షాల ఆందోళనలతో పార్లమెంట్​ ఉభయ సభలు అట్టుడికాయి. గందరగోళ పరిస్థితుల్లో వాయిదాల పర్వం కొనసాగింది. మూడోరోజూ ఎలాంటి కార్యకలాపాలు కొనసాగకుండానే రాజ్యసభ, లోక్​సభ శుక్రవారానికి వాయిదాపడ్డాయి.

రాజ్యసభలో..

ఒక రోజు విరామం తర్వాత పార్లమెంటు సమావేశం కాగా.. దైనిక్‌ భాస్కర్‌ పత్రిక కార్యాలయాలపై ఆదాయ పన్ను దాడులు, పెగాసస్‌ అంశంపై విపక్షాలు రాజ్యసభలో వెల్‌లోకి వచ్చి ఆందోళనకు దిగాయి. తమ సీట్లలోకి వెళ్లాలని ఛైర్మన్‌ వెంకయ్య నాయుడు విజ్ఞప్తి చేసినా విపక్ష సభ్యులు వెనక్కి తగ్గలేదు. దీంతో వెంకయ్య సభను 12 గంటల వరకు వాయిదా వేశారు. తిరిగి సమావేశమైన తర్వాత కూడా అదే పరిస్థితి కొనసాగడం వల్ల.. మళ్లీ 2 గంటల వరకు వాయిదా వేశారు. తిరిగి భేటీ అయిన తర్వాత హ్యాకింగ్‌ అంశంపై కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ కీలక ప్రకటన చేశారు.

'భారత ప్రజాస్వామ్యంపై బురదజల్లే కుట్ర'

రాజకీయ నేతలు, పాత్రికేయులు, సామాజిక కార్యకర్తలు సహా మరికొందరి ఫోన్లు హ్యాక్​ అయ్యాయన్న ఆరోపణల్ని ఖండించారు కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్​.

" పార్లమెంట్​ వర్షాకాల సమావేశాలకు ఒక్కరోజు ముందు ఉద్దేశపూర్వకంగానే పెగాసస్ వ్యవహారంపై వార్తలు ప్రచురితమయ్యాయి. గతంలోనూ వాట్సాప్​కు సంబంధించి ఇలాంటి ఆరోపణలే వచ్చాయి. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదు, భారత ప్రజాస్వామ్యాన్ని, దేశంలోని వ్యవస్థల్ని అప్రతిష్ఠపాలు చేసేందుకే కొందరు ఇలా చేస్తున్నారు."

- అశ్విని వైష్ణవ్​, కేంద్ర ఐటీ శాఖ మంత్రి.

మంత్రి చేతిలోంచి ప్రతులు లాక్కొని..

ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్​ వివరణ ఇస్తుండగా.. టీఎంసీ ఎంపీ శాంతను సేన్​ అడ్డుపడ్డారు. మంత్రి చేతిలోని ప్రతులను లాక్కొని.. చించివేసి గాల్లోకి విసిరారు. వెల్​లోకి ప్రవేశించి కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. మాట్లాడటం ఆపేసిన మంత్రి.. తన ప్రకటన ప్రతులను సభకు సమర్పిస్తున్నట్లు చెప్పారు. సభ్యులు అమర్యాదగా ప్రవర్తించటం మానుకోవాలని కోరారు డిప్యూటీ ఛైర్మన్​ హరివంశ్​. ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి పూర్తిగా విరుద్ధమని అన్నారు.

టీఎంసీ సహా విపక్షాల ఆందోళనలతో.. సభ కొనసాగే పరిస్ధితి లేకపోవడం వల్ల రాజ్యసభను శుక్రవారానికి వాయిదా వేశారు.

భాజపా, టీఎంసీ ఎంపీల మధ్య వాగ్వాదం..

సభను మరుసటి రోజుకు వాయిదా వేసినట్లు ప్రకటించిన తర్వాత.. భాజపా, టీఎంసీ ఎంపీల మధ్య వాగ్వాదం జరిగింది. టీఎంసీ ఎంపీ శాంతను సేన్​ ఐటీ మంత్రి చేతిలోని ప్రతులను లాక్కుని చింపేయటాన్ని తప్పుపట్టారు భాజపా సభ్యులు. ఈ క్రమంలో ఘర్షణ వాతావరణం తలెత్తింది. మార్షల్స్​ కలుగజేసుకుని పరిస్థితులను అదుపు చేశారు.

ఆ ఎంపీపై సస్పెన్షన్​ వేటు!

మంత్రి చేతిలో నుంచి టీఎంసీ ఎంపీ పేపర్లు లాక్కుని, చింపివేయడాన్ని అధికార పక్షం తీవ్రంగా పరిగణిస్తోంది. అమర్యాదగా వ్యవహరించిన వారిపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇవ్వాలని నిర్ణయించింది. శాంతను సేన్​ను సస్పెండ్ చేయాల్సిందిగా రాజ్యసభ ఛైర్మన్​ను కోరాలని అధికార పక్షం తీర్మానించింది.

లోక్​సభలో..

లోక్​సభ ప్రారంభం కాగానే స్పీకర్​ ఓంబిర్లా ప్రశ్నోత్తరాలను చేపట్టారు. ఈ క్రమంలోనే కృష్ణా జలాలు, ఇతర అంశాలపై వైకాపా సహా విపక్షాలు ఆందోళన చేపట్టాయి. ఇతర పార్టీల ఎంపీలు సైతం ఆందోళనలకు దిగడం వల్ల స్పీకర్​.. సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. అనంతరం సమావేశమైనప్పటికీ.. సభ సజావుగా సాగలేదు. దీంతో మరోమారు మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడింది.

తిరిగి ప్రారంభమైన తర్వాత ప్రశ్నోత్తరాలను కొనసాగించే యత్నం చేయగా, విపక్షాలు మరోసారి ఆందోళనకు దిగాయి. ఈ దశలో సభ నిర్వహణకు సహకరించాలని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌ జోషి అభ్యర్థించినా విపక్షాలు వెనక్కి తగ్గలేదు. దీంతో.. సాయంత్రం 4 గంటల వరకు వాయిదా వేశారు స్పీకర్​ ఓం బిర్లా. సభా మళ్లీ సమావేశమైనప్పటికీ పెగాసస్​ సహా వేర్వేరు అంశాలపై విపక్షాలు ఆందోళనలు కొనసాగించాయి. ఈ క్రమంలో ఎలాంటి కార్యకలాపాలు సాగే పరిస్థితులు లేకపోవటం వల్ల సభను శుక్రవారానికి వాయిదా వేశారు.

ఇదీ చూడండి: 'రైతులపైనా నిఘా- ఇది అనైతిక ప్రభుత్వం!'

పెగాసస్​ హ్యాకింగ్​ సహా వివిధ అంశాలపై విపక్షాల ఆందోళనలతో పార్లమెంట్​ ఉభయ సభలు అట్టుడికాయి. గందరగోళ పరిస్థితుల్లో వాయిదాల పర్వం కొనసాగింది. మూడోరోజూ ఎలాంటి కార్యకలాపాలు కొనసాగకుండానే రాజ్యసభ, లోక్​సభ శుక్రవారానికి వాయిదాపడ్డాయి.

రాజ్యసభలో..

ఒక రోజు విరామం తర్వాత పార్లమెంటు సమావేశం కాగా.. దైనిక్‌ భాస్కర్‌ పత్రిక కార్యాలయాలపై ఆదాయ పన్ను దాడులు, పెగాసస్‌ అంశంపై విపక్షాలు రాజ్యసభలో వెల్‌లోకి వచ్చి ఆందోళనకు దిగాయి. తమ సీట్లలోకి వెళ్లాలని ఛైర్మన్‌ వెంకయ్య నాయుడు విజ్ఞప్తి చేసినా విపక్ష సభ్యులు వెనక్కి తగ్గలేదు. దీంతో వెంకయ్య సభను 12 గంటల వరకు వాయిదా వేశారు. తిరిగి సమావేశమైన తర్వాత కూడా అదే పరిస్థితి కొనసాగడం వల్ల.. మళ్లీ 2 గంటల వరకు వాయిదా వేశారు. తిరిగి భేటీ అయిన తర్వాత హ్యాకింగ్‌ అంశంపై కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ కీలక ప్రకటన చేశారు.

'భారత ప్రజాస్వామ్యంపై బురదజల్లే కుట్ర'

రాజకీయ నేతలు, పాత్రికేయులు, సామాజిక కార్యకర్తలు సహా మరికొందరి ఫోన్లు హ్యాక్​ అయ్యాయన్న ఆరోపణల్ని ఖండించారు కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్​.

" పార్లమెంట్​ వర్షాకాల సమావేశాలకు ఒక్కరోజు ముందు ఉద్దేశపూర్వకంగానే పెగాసస్ వ్యవహారంపై వార్తలు ప్రచురితమయ్యాయి. గతంలోనూ వాట్సాప్​కు సంబంధించి ఇలాంటి ఆరోపణలే వచ్చాయి. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదు, భారత ప్రజాస్వామ్యాన్ని, దేశంలోని వ్యవస్థల్ని అప్రతిష్ఠపాలు చేసేందుకే కొందరు ఇలా చేస్తున్నారు."

- అశ్విని వైష్ణవ్​, కేంద్ర ఐటీ శాఖ మంత్రి.

మంత్రి చేతిలోంచి ప్రతులు లాక్కొని..

ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్​ వివరణ ఇస్తుండగా.. టీఎంసీ ఎంపీ శాంతను సేన్​ అడ్డుపడ్డారు. మంత్రి చేతిలోని ప్రతులను లాక్కొని.. చించివేసి గాల్లోకి విసిరారు. వెల్​లోకి ప్రవేశించి కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. మాట్లాడటం ఆపేసిన మంత్రి.. తన ప్రకటన ప్రతులను సభకు సమర్పిస్తున్నట్లు చెప్పారు. సభ్యులు అమర్యాదగా ప్రవర్తించటం మానుకోవాలని కోరారు డిప్యూటీ ఛైర్మన్​ హరివంశ్​. ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి పూర్తిగా విరుద్ధమని అన్నారు.

టీఎంసీ సహా విపక్షాల ఆందోళనలతో.. సభ కొనసాగే పరిస్ధితి లేకపోవడం వల్ల రాజ్యసభను శుక్రవారానికి వాయిదా వేశారు.

భాజపా, టీఎంసీ ఎంపీల మధ్య వాగ్వాదం..

సభను మరుసటి రోజుకు వాయిదా వేసినట్లు ప్రకటించిన తర్వాత.. భాజపా, టీఎంసీ ఎంపీల మధ్య వాగ్వాదం జరిగింది. టీఎంసీ ఎంపీ శాంతను సేన్​ ఐటీ మంత్రి చేతిలోని ప్రతులను లాక్కుని చింపేయటాన్ని తప్పుపట్టారు భాజపా సభ్యులు. ఈ క్రమంలో ఘర్షణ వాతావరణం తలెత్తింది. మార్షల్స్​ కలుగజేసుకుని పరిస్థితులను అదుపు చేశారు.

ఆ ఎంపీపై సస్పెన్షన్​ వేటు!

మంత్రి చేతిలో నుంచి టీఎంసీ ఎంపీ పేపర్లు లాక్కుని, చింపివేయడాన్ని అధికార పక్షం తీవ్రంగా పరిగణిస్తోంది. అమర్యాదగా వ్యవహరించిన వారిపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇవ్వాలని నిర్ణయించింది. శాంతను సేన్​ను సస్పెండ్ చేయాల్సిందిగా రాజ్యసభ ఛైర్మన్​ను కోరాలని అధికార పక్షం తీర్మానించింది.

లోక్​సభలో..

లోక్​సభ ప్రారంభం కాగానే స్పీకర్​ ఓంబిర్లా ప్రశ్నోత్తరాలను చేపట్టారు. ఈ క్రమంలోనే కృష్ణా జలాలు, ఇతర అంశాలపై వైకాపా సహా విపక్షాలు ఆందోళన చేపట్టాయి. ఇతర పార్టీల ఎంపీలు సైతం ఆందోళనలకు దిగడం వల్ల స్పీకర్​.. సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. అనంతరం సమావేశమైనప్పటికీ.. సభ సజావుగా సాగలేదు. దీంతో మరోమారు మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడింది.

తిరిగి ప్రారంభమైన తర్వాత ప్రశ్నోత్తరాలను కొనసాగించే యత్నం చేయగా, విపక్షాలు మరోసారి ఆందోళనకు దిగాయి. ఈ దశలో సభ నిర్వహణకు సహకరించాలని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌ జోషి అభ్యర్థించినా విపక్షాలు వెనక్కి తగ్గలేదు. దీంతో.. సాయంత్రం 4 గంటల వరకు వాయిదా వేశారు స్పీకర్​ ఓం బిర్లా. సభా మళ్లీ సమావేశమైనప్పటికీ పెగాసస్​ సహా వేర్వేరు అంశాలపై విపక్షాలు ఆందోళనలు కొనసాగించాయి. ఈ క్రమంలో ఎలాంటి కార్యకలాపాలు సాగే పరిస్థితులు లేకపోవటం వల్ల సభను శుక్రవారానికి వాయిదా వేశారు.

ఇదీ చూడండి: 'రైతులపైనా నిఘా- ఇది అనైతిక ప్రభుత్వం!'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.