ETV Bharat / bharat

బిల్కిస్ బానో కేసులో సుప్రీం కీలక నిర్ణయం.. కేంద్రం, గుజరాత్ సర్కార్​లకు నోటీసులు

author img

By

Published : Mar 27, 2023, 5:32 PM IST

Updated : Mar 27, 2023, 6:13 PM IST

సామూహిక అత్యాచార బాధితురాలు బిల్కిస్​ బానో దోషుల విడుదల కేసులో.. కేంద్రం, గుజరాత్ ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది సుప్రీంకోర్టు. రెమిషన్​ మంజూరు చేయడానికి సంబంధించిన పత్రాలను ఏప్రిల్​ 18లోగా సిద్ధం చేసుకోవాలని గుజరాత్ ప్రభుత్వాన్ని ఆదేశించింది.

Bilkis Bano gujarat
Bilkis Bano gujarat

గుజరాత్ అల్లర్ల వేళ సామూహిక అత్యాచారానికి గురైన బిల్కిస్ బానో కేసులో దోషులను విడుదల చేయడంపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. దోషుల విడుదలను సవాల్ చేస్తూ బాధితురాలు దాఖలు చేసిన పిటిషన్​ను విచారించిన ధర్మాసనం.. కేంద్రం, గుజరాత్ ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. రెమిషన్​ మంజూరు చేయడానికి సంబంధించిన పత్రాలను ఏప్రిల్​ 18లోగా సిద్ధం చేసుకోవాలని గుజరాత్ ప్రభుత్వాన్ని ఆదేశించింది.

అత్యాచారం కేసులో దోషులైన 11 మందిని విడుదల చేయడాన్ని వ్యతిరేకిస్తూ పిటిషన్ దాఖలు చేశారు బిల్కిస్​ బానో. జస్టిస్​ కేఎం జోసేఫ్​, జస్టిస్ బీవీ నాగరత్నతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. తదుపరి విచారణను ఏప్రిల్​ 18కి వాయిదా వేసింది. ఈ కేసు భావోద్వేగాలతో కాకుండా, చట్ట ప్రకారం విచారిస్తామని సుప్రీంకోర్టు పేర్కొంది. దేశమంతా అజాదీ కా అమృత్ మహోత్సవాలు చేసుకుంటున్న సమయంలో దోషులను విడిచిపెట్టారని.. వారిని పూలమాలలతో సత్కరించి స్వీట్లు పంపిణీ చేశారని వ్యాఖ్యానించింది. అంతకుముందు జస్టిస్​ అజయ్ రస్తోగి, జస్టిస్​ బేలా ఎం త్రివేదితో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. అయితే జనవరి 4న త్రివేది కారణం చెప్పకుండా కేసు విచారణ నుంచి తప్పుకున్నారు. బాధితురాలితో పాటు అనేక మంది ప్రజాప్రయోజన వ్యాజ్యాలను దాఖలు చేశారు.

ఇదీ జరిగింది
2002లో జరిగిన గోద్రా అల్లర్ల సమయంలో 5 నెలల గర్భిణిగా ఉన్న బిల్కిస్ బానోపై అత్యాచారం చేశారు దుండగులు. అనంతరం ఆమె కుటుంబంలోని ఏడుగురిని హత్య చేశారు. ఈ కేసుపై విచారించిన సీబీఐ ప్రత్యేక కోర్టు.. 2008 జనవరి 21న 11 మందికి జీవిత ఖైదు విధించింది. 15 ఏళ్ల జైలు శిక్ష తర్వాత తమను విడుదల చేయాలంటూ దోషుల్లో ఒకరు సుప్రీంను ఆశ్రయించారు. దీనిని పరిశీలించాలని గుజరాత్ ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. దీనిపై కమిటీని ఏర్పాటు చేసిన గుజరాత్ ప్రభుత్వం దోషులకు రెమిషన్ మంజూరు చేయాలని సిఫార్సు చేసింది. వాటిని కోర్టుకు సమర్పించగా.. 1992 నాటి రెమిషన్ విధానాన్ని అమలు చేసేందుకు గుజరాత్ సర్కారుకు అనుమతినిచ్చింది. ఫలితంగా గతేడాది ఆగష్టు 15న గోధ్రా సబ్​ జైలు నుంచి 11 మంది దోషులు విడుదల అయ్యారు. ఈ కేసులోని 11మంది దోషులు 14 ఏళ్లకు పైగా జైల్లో గడిపారని.. సత్ప్రవర్తన కారణంగానే వారికి శిక్ష తగ్గించినట్లు గుజరాత్ ప్రభుత్వం సుప్రీంకు ఇచ్చిన అఫిడవిట్​లో పేర్కొంది.

గుజరాత్ అల్లర్ల వేళ సామూహిక అత్యాచారానికి గురైన బిల్కిస్ బానో కేసులో దోషులను విడుదల చేయడంపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. దోషుల విడుదలను సవాల్ చేస్తూ బాధితురాలు దాఖలు చేసిన పిటిషన్​ను విచారించిన ధర్మాసనం.. కేంద్రం, గుజరాత్ ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. రెమిషన్​ మంజూరు చేయడానికి సంబంధించిన పత్రాలను ఏప్రిల్​ 18లోగా సిద్ధం చేసుకోవాలని గుజరాత్ ప్రభుత్వాన్ని ఆదేశించింది.

అత్యాచారం కేసులో దోషులైన 11 మందిని విడుదల చేయడాన్ని వ్యతిరేకిస్తూ పిటిషన్ దాఖలు చేశారు బిల్కిస్​ బానో. జస్టిస్​ కేఎం జోసేఫ్​, జస్టిస్ బీవీ నాగరత్నతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. తదుపరి విచారణను ఏప్రిల్​ 18కి వాయిదా వేసింది. ఈ కేసు భావోద్వేగాలతో కాకుండా, చట్ట ప్రకారం విచారిస్తామని సుప్రీంకోర్టు పేర్కొంది. దేశమంతా అజాదీ కా అమృత్ మహోత్సవాలు చేసుకుంటున్న సమయంలో దోషులను విడిచిపెట్టారని.. వారిని పూలమాలలతో సత్కరించి స్వీట్లు పంపిణీ చేశారని వ్యాఖ్యానించింది. అంతకుముందు జస్టిస్​ అజయ్ రస్తోగి, జస్టిస్​ బేలా ఎం త్రివేదితో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. అయితే జనవరి 4న త్రివేది కారణం చెప్పకుండా కేసు విచారణ నుంచి తప్పుకున్నారు. బాధితురాలితో పాటు అనేక మంది ప్రజాప్రయోజన వ్యాజ్యాలను దాఖలు చేశారు.

ఇదీ జరిగింది
2002లో జరిగిన గోద్రా అల్లర్ల సమయంలో 5 నెలల గర్భిణిగా ఉన్న బిల్కిస్ బానోపై అత్యాచారం చేశారు దుండగులు. అనంతరం ఆమె కుటుంబంలోని ఏడుగురిని హత్య చేశారు. ఈ కేసుపై విచారించిన సీబీఐ ప్రత్యేక కోర్టు.. 2008 జనవరి 21న 11 మందికి జీవిత ఖైదు విధించింది. 15 ఏళ్ల జైలు శిక్ష తర్వాత తమను విడుదల చేయాలంటూ దోషుల్లో ఒకరు సుప్రీంను ఆశ్రయించారు. దీనిని పరిశీలించాలని గుజరాత్ ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. దీనిపై కమిటీని ఏర్పాటు చేసిన గుజరాత్ ప్రభుత్వం దోషులకు రెమిషన్ మంజూరు చేయాలని సిఫార్సు చేసింది. వాటిని కోర్టుకు సమర్పించగా.. 1992 నాటి రెమిషన్ విధానాన్ని అమలు చేసేందుకు గుజరాత్ సర్కారుకు అనుమతినిచ్చింది. ఫలితంగా గతేడాది ఆగష్టు 15న గోధ్రా సబ్​ జైలు నుంచి 11 మంది దోషులు విడుదల అయ్యారు. ఈ కేసులోని 11మంది దోషులు 14 ఏళ్లకు పైగా జైల్లో గడిపారని.. సత్ప్రవర్తన కారణంగానే వారికి శిక్ష తగ్గించినట్లు గుజరాత్ ప్రభుత్వం సుప్రీంకు ఇచ్చిన అఫిడవిట్​లో పేర్కొంది.

ఇవీ చదవండి : యడియూరప్ప ఇంటిపై రాళ్ల దాడి.. టైర్లకు నిప్పంటించి విసిరిన బంజారాలు

'నిందితుల నోట్లో రాళ్లు కుక్కి.. పళ్లు పీకి చిత్రహింసలకు గురిచేస్తున్న ఏఎస్పీ'

Last Updated : Mar 27, 2023, 6:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.