ETV Bharat / bharat

పార్లమెంట్​లో భద్రతా వైఫల్యంపై విచారణ కమిటీ - CRPF డీజీ నేతృత్వంలో దర్యాప్తు

author img

By PTI

Published : Dec 14, 2023, 6:44 AM IST

Updated : Dec 14, 2023, 7:32 AM IST

Parliament Security Breach Enquiry Committee : పార్లమెంట్​లో బుధవారం జరిగిన భద్రతా వైఫల్యంపై లోక్​సభ సచివాలయం వినతి మేరకు కేంద్ర హోంశాఖ ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. సీఆర్​పీఎఫ్​ డీజీ కమిటీకి నేతృత్వం వహిస్తారు.

Parliament Security Breach Enquiry Committee
Parliament Security Breach Enquiry Committee

Parliament Security Breach Enquiry Committee : పార్లమెంట్‌పై ఉగ్రదాడి జరిగి 22ఏళ్లు అయిన రోజే లోక్‌సభలో భద్రతా వైఫల్యం చోటు చేసుకోవడంపై ముమ్మర దర్యాప్తు సాగుతోంది. స్పీకర్‌ కోరిక మేరకు హోంశాఖ దర్యాప్తు కమిటీని నియమించింది. ఈ ఘటనపై దిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ ఉపా(UAPA) చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. సందర్శకుల గ్యాలరీ నుంచి ఇద్దరు లోక్‌సభలోకి దూకిన ఘటనలో ఇప్పటివరకు ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరొకరి కోసం గాలిస్తున్నారు. నిందితులు పక్కా ప్రణాళిక ప్రకారమే దుస్సాహసానికి పాల్పడ్డారని తెలుస్తోంది.

పక్కా ప్రణాళిక ప్రకారమే..
లోక్‌సభలో భద్రతా వైఫల్యం ఘటనలో సాగర్‌ శర్మ, మనోరంజన్ , నీలమ్‌, అమోల్‌ శిందే, విశాల్‌, లలిత్ అనే ఆరుగురు నిందితులు పక్కా ప్రణాళిక ప్రకారం దుస్సహసానికి పాల్పడ్డారని పోలీసులు వెల్లడించారు. ఈ ఆరుగురు నిందితులకు నాలుగేళ్లుగా ఒకరితో ఒకరికి పరిచయం ఉందన్నారు. పార్లమెంటులో చొరబాటుకు కొన్నిరోజుల క్రితమే ఆరుగురు ప్రణాళిక రచించారని పోలీసులు చెప్పారు. అందుకోసం సామాజిక మాధ్యమాల్లో నిరంతరం సంప్రదింపులు జరిపినట్లు వివరించారు. ఇప్పటివరకు ఐదుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆరో నిందితుడు లలిత్ కోసం గాలిస్తున్నారు. నిందితుల ఇళ్లకు వెళ్లిన ఆయా రాష్ట్రాల పోలీసులు వారి గురించి ఆరా తీశారు. దొరికిన ఐదుగురిని దిల్లీ పోలీసులు వివిధ కోణాల్లో ప్రశ్నిస్తున్నారు. మణిపుర్ సంక్షోభం, రైతుల నిరసనలు, నిరుద్యోగిత వంటి అంశాలతో నిరాశకు గురై ఈ ఘటనకు పాల్పడినట్టు ఒక నిందితుడు చెప్పినట్లు తెలుస్తోంది.

పార్లమెంట్ వద్ద తాజా సంచలన ఘటనలపై దర్యాప్తు కోసం లోక్​సభ సచివాలయం వినతి మేరకు కేంద్ర హోంశాఖ ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. దర్యాప్తుతోపాటు భవిష్యత్తులో చేపట్టాల్సిన మెరుగైన భద్రతా చర్యలను సిఫార్సు చేయాలని లోక్​సభ సచివాలయం తెలిపింది. కమిటీకి సీఆర్​పీఎఫ్ డీజీ అనీశ్ దయాల్ నేతృత్వం వహిస్తారు. కమిటీలో ఇతర భద్రతా సంస్థల అధికారులు, నిపుణులు సభ్యులుగా ఉంటారని హోంశాఖ అధికార ప్రతినిధి వెల్లడించారు. వీలైనంత త్వరగా కమిటీ నివేదికను సమర్పిస్తుందని తెలిపారు.

గెలిచినా.. ఓడినా ప్రయత్నించటమే ముఖ్యం..
పార్లమెంట్ ఘటన జరగకముందు నిందితుడు సాగర్​ శర్మ చివరిగా తన ఇన్​స్టాగ్రామ్​లో 'గెలిచినా, ఓడినా ప్రయత్నించడమే ముఖ్య'మని పోస్టు పెట్టాడు. 'గెలుస్తామా లేదా అనేది కాదు. ఆ ప్రయాణం ఎంత అందంగా ఉంటుందో చూడండి. మళ్లీ కలుస్తానని ఆశిస్తున్నా' అని సాగర్ పోస్టు చేశాడు. మరోవైపు ఈ ఘటనపై రైతు సంఘం నేత రాకేశ్ టికాయిత్ స్పందించారు. ఈ ఘటనతో భారతీయ కిసాన్ యూనియన్​కు, సంయుక్త కిసాన్ మోర్చాకు ఎటువంటి సంబంధం లేదని తెలిపారు. ఈ విషయాన్ని కొన్ని సంస్థలు తమకు ఆపాదించడాన్ని తప్పుబట్టారు.

పార్లమెంట్​లో సెక్యూరిటీ ఎలా ఉంటుంది?- అంత ఈజీగా లోపలికి వెళ్లొచ్చా!

నాలుగేళ్లుగా పరిచయం- పక్కా ప్లాన్​తో రెక్కీ చేసి మరీ దాడి- లోక్​సభ ఘటనలో షాకింగ్ నిజాలు

Parliament Security Breach Enquiry Committee : పార్లమెంట్‌పై ఉగ్రదాడి జరిగి 22ఏళ్లు అయిన రోజే లోక్‌సభలో భద్రతా వైఫల్యం చోటు చేసుకోవడంపై ముమ్మర దర్యాప్తు సాగుతోంది. స్పీకర్‌ కోరిక మేరకు హోంశాఖ దర్యాప్తు కమిటీని నియమించింది. ఈ ఘటనపై దిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ ఉపా(UAPA) చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. సందర్శకుల గ్యాలరీ నుంచి ఇద్దరు లోక్‌సభలోకి దూకిన ఘటనలో ఇప్పటివరకు ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరొకరి కోసం గాలిస్తున్నారు. నిందితులు పక్కా ప్రణాళిక ప్రకారమే దుస్సాహసానికి పాల్పడ్డారని తెలుస్తోంది.

పక్కా ప్రణాళిక ప్రకారమే..
లోక్‌సభలో భద్రతా వైఫల్యం ఘటనలో సాగర్‌ శర్మ, మనోరంజన్ , నీలమ్‌, అమోల్‌ శిందే, విశాల్‌, లలిత్ అనే ఆరుగురు నిందితులు పక్కా ప్రణాళిక ప్రకారం దుస్సహసానికి పాల్పడ్డారని పోలీసులు వెల్లడించారు. ఈ ఆరుగురు నిందితులకు నాలుగేళ్లుగా ఒకరితో ఒకరికి పరిచయం ఉందన్నారు. పార్లమెంటులో చొరబాటుకు కొన్నిరోజుల క్రితమే ఆరుగురు ప్రణాళిక రచించారని పోలీసులు చెప్పారు. అందుకోసం సామాజిక మాధ్యమాల్లో నిరంతరం సంప్రదింపులు జరిపినట్లు వివరించారు. ఇప్పటివరకు ఐదుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆరో నిందితుడు లలిత్ కోసం గాలిస్తున్నారు. నిందితుల ఇళ్లకు వెళ్లిన ఆయా రాష్ట్రాల పోలీసులు వారి గురించి ఆరా తీశారు. దొరికిన ఐదుగురిని దిల్లీ పోలీసులు వివిధ కోణాల్లో ప్రశ్నిస్తున్నారు. మణిపుర్ సంక్షోభం, రైతుల నిరసనలు, నిరుద్యోగిత వంటి అంశాలతో నిరాశకు గురై ఈ ఘటనకు పాల్పడినట్టు ఒక నిందితుడు చెప్పినట్లు తెలుస్తోంది.

పార్లమెంట్ వద్ద తాజా సంచలన ఘటనలపై దర్యాప్తు కోసం లోక్​సభ సచివాలయం వినతి మేరకు కేంద్ర హోంశాఖ ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. దర్యాప్తుతోపాటు భవిష్యత్తులో చేపట్టాల్సిన మెరుగైన భద్రతా చర్యలను సిఫార్సు చేయాలని లోక్​సభ సచివాలయం తెలిపింది. కమిటీకి సీఆర్​పీఎఫ్ డీజీ అనీశ్ దయాల్ నేతృత్వం వహిస్తారు. కమిటీలో ఇతర భద్రతా సంస్థల అధికారులు, నిపుణులు సభ్యులుగా ఉంటారని హోంశాఖ అధికార ప్రతినిధి వెల్లడించారు. వీలైనంత త్వరగా కమిటీ నివేదికను సమర్పిస్తుందని తెలిపారు.

గెలిచినా.. ఓడినా ప్రయత్నించటమే ముఖ్యం..
పార్లమెంట్ ఘటన జరగకముందు నిందితుడు సాగర్​ శర్మ చివరిగా తన ఇన్​స్టాగ్రామ్​లో 'గెలిచినా, ఓడినా ప్రయత్నించడమే ముఖ్య'మని పోస్టు పెట్టాడు. 'గెలుస్తామా లేదా అనేది కాదు. ఆ ప్రయాణం ఎంత అందంగా ఉంటుందో చూడండి. మళ్లీ కలుస్తానని ఆశిస్తున్నా' అని సాగర్ పోస్టు చేశాడు. మరోవైపు ఈ ఘటనపై రైతు సంఘం నేత రాకేశ్ టికాయిత్ స్పందించారు. ఈ ఘటనతో భారతీయ కిసాన్ యూనియన్​కు, సంయుక్త కిసాన్ మోర్చాకు ఎటువంటి సంబంధం లేదని తెలిపారు. ఈ విషయాన్ని కొన్ని సంస్థలు తమకు ఆపాదించడాన్ని తప్పుబట్టారు.

పార్లమెంట్​లో సెక్యూరిటీ ఎలా ఉంటుంది?- అంత ఈజీగా లోపలికి వెళ్లొచ్చా!

నాలుగేళ్లుగా పరిచయం- పక్కా ప్లాన్​తో రెక్కీ చేసి మరీ దాడి- లోక్​సభ ఘటనలో షాకింగ్ నిజాలు

Last Updated : Dec 14, 2023, 7:32 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.