ETV Bharat / bharat

153 దేశాల వార్తాపత్రికల సేకరణ.. వరించిన గిన్నిస్​ వరల్డ్​ రికార్డు

author img

By

Published : Jun 10, 2022, 6:13 PM IST

సాధారణంగా ఒక్కొక్కరికి ఒక్కో అభిరుచి ఉంటుంది. తమకిష్టమైన పనులు చేస్తూ.. ఆనందాన్ని పొందుతుంటారు. అలాంటి కోవకు చెందిన వారే ఒడిశాకు చెందిన శేఖర్​ దాస్​. సరదాగా మొదలైన ఆయన పత్రికల సేకరణ.. గిన్నిస్​ బుక్​ ఆఫ్​ రికార్డ్స్​లో స్థానం సంపాదించే వరకు చేరింది. ఆయన కథ మీరూ చూడండి?

odisha man collects news paper
odisha man collects news paper
153 దేశాల్లో వార్తాపత్రికల సేకరణ.. వరించిన గిన్నిస్​ వరల్డ్​ రికార్డు

ఒక్కొకరికి ఒక్కో వ్యాపకం ఉంటుంది. కొందరు పాత నాణేలు సేకరిస్తే.. మరికొందరు నోట్లు.. పురాతన కాలం నాటి వస్తువులు కూడబెడతారు. ఇలానే ఒడిశాకు చెందిన ఓ వ్యక్తి దేశంలోని వార్తాపత్రికలనే కాకుండా ప్రపంచ నలుమూలల నుంచి ఇతర పేపర్లను సేకరిస్తున్నారు. అదే ఆయనకు గిన్నిస్​ బుక్​ ఆఫ్​ వరల్డ్​ రికార్డ్స్​లో చోటుదక్కేలా చేసింది. 'పేపర్​మ్యాన్​ ఆఫ్​ ఇండియా'గానూ ఖ్యాతి గడించారు సాషా శేఖర్​ దాస్​. సేకరించిన వాటితో కలిపి ఓ పేపర్​ మ్యూజియం కూడా ఏర్పాటు చేశారు దాస్​.

odisha man collects news paper
సేకరించిన పత్రికలు
odisha man collects news paper
గిన్నిస్​ బుక్​ ఆఫ్​ రికార్డు సర్టిఫికెట్​

శేఖర్ దాస్​​​.. మొదట జర్నలిస్టుగా పనిచేసేవారు. దీంతో ఆ సమయంలోనే వివిధ పత్రికలు సేకరించేవారు. అలా అది అలవాటుగా మారిపోయింది. దాస్​ 2000 సంవత్సరంలో ఈ సేకరణకు శ్రీకారం చుట్టారు. తొలుత దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన పత్రికలను సేకరించేవారు. ఆ తర్వాత 153 దేశాల్లోని 94 భాషలకు సంబంధించిన 5,100 పత్రికలను సేకరించారు.

"మా నాన్న పేరుపై జైపుర్ గ్రామం​లో ఓ మ్యూజియం ఏర్పాటు చేశాను. నేను సేకరించిన పత్రికలను అక్కడ ప్రదర్శనకు పెట్టాను. జర్నలిస్టులు, విద్యార్థులు వచ్చి ఈ పత్రికలను చూసి వెళ్తున్నారు"

-శేఖర్ దాస్​, పేపర్​మ్యాన్​ ఆఫ్​ ఇండియా

మొత్తంగా 10 వేలకుపైగా వార్తాపత్రికలను సేకరించిన శేఖర్​ దాస్​ను.. తాజాగా గిన్నిస్​ వరల్డ్​ రికార్డ్​ వరించింది. అంతకుముందు ఇటలీకి చెందిన సెర్గియో బోదనీపై ఉన్న రికార్డును తన పేరిట లిఖించుకున్నారు. శేఖర్​ దాస్​ ఇప్పటివరకు మూడు సార్లు లిమ్కా బుక్​ ఆఫ్ రికార్డ్స్​లో, ఒకసారి ఇండియా బుక్​, ఓఎమ్​జీ బుక్​, క్రెడెన్స్​ బుక్​లో స్థానం సంపాదించుకున్నారు.

ఇదీ చదవండి: చేయి లేకపోయినా ప్రభుత్వ ఉద్యోగం పక్కా.. భర్త బాధితురాలికి సీఎం భరోసా!

153 దేశాల్లో వార్తాపత్రికల సేకరణ.. వరించిన గిన్నిస్​ వరల్డ్​ రికార్డు

ఒక్కొకరికి ఒక్కో వ్యాపకం ఉంటుంది. కొందరు పాత నాణేలు సేకరిస్తే.. మరికొందరు నోట్లు.. పురాతన కాలం నాటి వస్తువులు కూడబెడతారు. ఇలానే ఒడిశాకు చెందిన ఓ వ్యక్తి దేశంలోని వార్తాపత్రికలనే కాకుండా ప్రపంచ నలుమూలల నుంచి ఇతర పేపర్లను సేకరిస్తున్నారు. అదే ఆయనకు గిన్నిస్​ బుక్​ ఆఫ్​ వరల్డ్​ రికార్డ్స్​లో చోటుదక్కేలా చేసింది. 'పేపర్​మ్యాన్​ ఆఫ్​ ఇండియా'గానూ ఖ్యాతి గడించారు సాషా శేఖర్​ దాస్​. సేకరించిన వాటితో కలిపి ఓ పేపర్​ మ్యూజియం కూడా ఏర్పాటు చేశారు దాస్​.

odisha man collects news paper
సేకరించిన పత్రికలు
odisha man collects news paper
గిన్నిస్​ బుక్​ ఆఫ్​ రికార్డు సర్టిఫికెట్​

శేఖర్ దాస్​​​.. మొదట జర్నలిస్టుగా పనిచేసేవారు. దీంతో ఆ సమయంలోనే వివిధ పత్రికలు సేకరించేవారు. అలా అది అలవాటుగా మారిపోయింది. దాస్​ 2000 సంవత్సరంలో ఈ సేకరణకు శ్రీకారం చుట్టారు. తొలుత దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన పత్రికలను సేకరించేవారు. ఆ తర్వాత 153 దేశాల్లోని 94 భాషలకు సంబంధించిన 5,100 పత్రికలను సేకరించారు.

"మా నాన్న పేరుపై జైపుర్ గ్రామం​లో ఓ మ్యూజియం ఏర్పాటు చేశాను. నేను సేకరించిన పత్రికలను అక్కడ ప్రదర్శనకు పెట్టాను. జర్నలిస్టులు, విద్యార్థులు వచ్చి ఈ పత్రికలను చూసి వెళ్తున్నారు"

-శేఖర్ దాస్​, పేపర్​మ్యాన్​ ఆఫ్​ ఇండియా

మొత్తంగా 10 వేలకుపైగా వార్తాపత్రికలను సేకరించిన శేఖర్​ దాస్​ను.. తాజాగా గిన్నిస్​ వరల్డ్​ రికార్డ్​ వరించింది. అంతకుముందు ఇటలీకి చెందిన సెర్గియో బోదనీపై ఉన్న రికార్డును తన పేరిట లిఖించుకున్నారు. శేఖర్​ దాస్​ ఇప్పటివరకు మూడు సార్లు లిమ్కా బుక్​ ఆఫ్ రికార్డ్స్​లో, ఒకసారి ఇండియా బుక్​, ఓఎమ్​జీ బుక్​, క్రెడెన్స్​ బుక్​లో స్థానం సంపాదించుకున్నారు.

ఇదీ చదవండి: చేయి లేకపోయినా ప్రభుత్వ ఉద్యోగం పక్కా.. భర్త బాధితురాలికి సీఎం భరోసా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.