ETV Bharat / bharat

రిసెప్షన్ రోజే నవ దంపతులు మృతి.. ఒకే గదిలో కత్తి గాయాలతో..

వారికి పెళ్లై రెండు రోజులే అయ్యింది. రిసెప్షన్​కు తయారయ్యేందుకు గదిలోకి వెళ్లారు నవ దంపతులు. తీరా చూస్తే కత్తిపోట్ల గాయాలతో రక్తపు మడుగులో విగతజీవులుగా పడి ఉన్నారు. ఈ ఘటన ఛత్తీస్​గఢ్​లో జరిగింది. మరోవైపు.. ఫ్రెండ్​ను హత్యచేసి తలను వేరు చేశాడు ఓ వ్యక్తి. ఈ ఘోరం అసోంలో వెలుగుచూసింది. ​

author img

By

Published : Feb 22, 2023, 12:23 PM IST

newly married couple death
మరణించిన నవదంపతులు

ఛత్తీస్​గఢ్​ రాయ్​పుర్​లో విషాదం నెలకొంది. మ్యారేజ్ రిసెప్షన్ సందర్భంగా డ్రెస్​ మార్చుకునేందుకు గదిలోకి వెళ్లిన ఓ నవ దంపతులు.. అనుమానాస్పద రీతిలో మరణించారు. దీంతో ఒక్కసారిగా ఆ కుటుంబంలో విషాధచాయలు అలుముకున్నాయి. మృతులను అస్లాం(24), కహక్షా బానో​(22)గా పోలీసులు గుర్తించారు. తిక్రాపారా పోలీస్ స్టేషన్​ పరిధిలోని బ్రిజ్​నగర్​లో శుక్రవారం సాయంత్రం జరిగిందీ ఘటన.

ఫిబ్రవరి 19న అస్లాం, కహక్షాకు వివాహం జరిగింది. మంగళవారం రాత్రి వీరిద్దరి రిసెప్షన్​కు ఏర్పాటు చేశారు కుటుంబసభ్యులు. ఈ క్రమంలో రిసెప్షన్‌కు రెడీ అయ్యేందుకు నవ దంపతులిద్దరూ మంగళవారం సాయంత్రం ఒకే గదిలోకి వెళ్లారు. ఎంతసేపటికి వారు బయటకు రాలేదు. ఒక్కసారిగా గదిలో నుంచి వధువు కహక్షా బానో అరుపులు వినిపించాయి. వెంటనే కుటుంబ సభ్యులు డోర్​ కొట్టినా ఎవరూ తీయలేదు. కిటికీ నుంచి చూడగా రక్తపు మడుగులో అపస్మారకస్థితిలో దంపతులిద్దరూ ఉన్నారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు కుటుంబ సభ్యులు.

పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని తలుపులు పగలగొట్టి మృతదేహాలను బయటకు తీశారు. అప్పటికే దంపతులు మరణించారు. వారి మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం పరీక్ష నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఫోరెన్సిక్ బృందాలను రంగంలోకి దించి తనిఖీలు నిర్వహించారు. భార్యాభర్తల మధ్య వాగ్వాదం జరిగి.. భార్యను కత్తితో దాడి చేసి ఆమె భర్త కూడా ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు.

"ఒకే గదిలో నవదంపతుల మృతదేహాలు లభ్యమయ్యాయి. ఇద్దరి శరీరం మీద కత్తి గాయాలు ఉన్నాయి. మృతదేహాలను శవపరీక్షలకు పంపాం. శవపరీక్షల నివేదిక వచ్చిన అనంతరం దంపతుల మరణానికి గల కారణాలు తెలిసే అవకాశం ఉంది. మృతుల శరీరంపై ఒకే రకమైన గాయాలు ఉన్నాయి. వారి గదిలో ఒక కత్తిని స్వాధీనం చేసుకున్నాం. మృతుల వేలిముద్రలను సేకరించాం. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నాం. వధూవరులిద్దరూ పెళ్లికి ముందే ప్రేమించుకున్నారు. కుటుంబ సభ్యుల అంగీకారంతో వారి ప్రేమను అంగీకరించారు.

--పోలీసులు

ఫ్రెండ్ మర్డర్​.. తలను
స్నేహితుడిని ఘోరంగా హతమార్చాడు ఓ వ్యక్తి. తల నరికి మొండెంను వేరు చేశాడు. అనంతరం యువకుడి తలను సంచిలో తీసుకెళ్లాడు. ఈ భయానక ఘటన అసోంలోని జోర్హాట్​లో జరిగింది. నిందితుడు లోహిత్ గోగోయ్​(28)ను పోలీసులు అరెస్ట్ చేశారు. మృతుడిని లహదైగావ్​కు చెందిన అరుణ్ కుమార్(20)గా పోలీసులు గుర్తించారు. ఈ హత్యకు గల కారణాలు ఇంకా తెలియలేదని పోలీసులు వెల్లడించారు.

నిందితుడు లోహిత్​ గోగోయ్(28)​ మద్యానికి బానిసయ్యాడని పోలీసులు తెలిపారు. మృతుడు అరుణ్​.. నిందితుడు లోహిత్‌ గొగోయ్‌ స్నేహితులని ప్రాథమిక దర్యాప్తులో తేలిందని చెప్పారు. బాధితుడి తల్లి తన కుమారుడి హత్య జరిగిన కాసేపటి ముందే లోహిత్​, అరుణ్ కుమార్​ జూదం ఆడడం చూశానని తెలిపింది. అప్పుడు ఇద్దరూ మద్యం మత్తులో ఉన్నారని పేర్కొంది. అరుణ్ మృతదేహాన్ని లోహిత్ తోట వెనుక ఉన్న పొలంలో నిందితుడు పడేశాడు.

ఛత్తీస్​గఢ్​ రాయ్​పుర్​లో విషాదం నెలకొంది. మ్యారేజ్ రిసెప్షన్ సందర్భంగా డ్రెస్​ మార్చుకునేందుకు గదిలోకి వెళ్లిన ఓ నవ దంపతులు.. అనుమానాస్పద రీతిలో మరణించారు. దీంతో ఒక్కసారిగా ఆ కుటుంబంలో విషాధచాయలు అలుముకున్నాయి. మృతులను అస్లాం(24), కహక్షా బానో​(22)గా పోలీసులు గుర్తించారు. తిక్రాపారా పోలీస్ స్టేషన్​ పరిధిలోని బ్రిజ్​నగర్​లో శుక్రవారం సాయంత్రం జరిగిందీ ఘటన.

ఫిబ్రవరి 19న అస్లాం, కహక్షాకు వివాహం జరిగింది. మంగళవారం రాత్రి వీరిద్దరి రిసెప్షన్​కు ఏర్పాటు చేశారు కుటుంబసభ్యులు. ఈ క్రమంలో రిసెప్షన్‌కు రెడీ అయ్యేందుకు నవ దంపతులిద్దరూ మంగళవారం సాయంత్రం ఒకే గదిలోకి వెళ్లారు. ఎంతసేపటికి వారు బయటకు రాలేదు. ఒక్కసారిగా గదిలో నుంచి వధువు కహక్షా బానో అరుపులు వినిపించాయి. వెంటనే కుటుంబ సభ్యులు డోర్​ కొట్టినా ఎవరూ తీయలేదు. కిటికీ నుంచి చూడగా రక్తపు మడుగులో అపస్మారకస్థితిలో దంపతులిద్దరూ ఉన్నారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు కుటుంబ సభ్యులు.

పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని తలుపులు పగలగొట్టి మృతదేహాలను బయటకు తీశారు. అప్పటికే దంపతులు మరణించారు. వారి మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం పరీక్ష నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఫోరెన్సిక్ బృందాలను రంగంలోకి దించి తనిఖీలు నిర్వహించారు. భార్యాభర్తల మధ్య వాగ్వాదం జరిగి.. భార్యను కత్తితో దాడి చేసి ఆమె భర్త కూడా ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు.

"ఒకే గదిలో నవదంపతుల మృతదేహాలు లభ్యమయ్యాయి. ఇద్దరి శరీరం మీద కత్తి గాయాలు ఉన్నాయి. మృతదేహాలను శవపరీక్షలకు పంపాం. శవపరీక్షల నివేదిక వచ్చిన అనంతరం దంపతుల మరణానికి గల కారణాలు తెలిసే అవకాశం ఉంది. మృతుల శరీరంపై ఒకే రకమైన గాయాలు ఉన్నాయి. వారి గదిలో ఒక కత్తిని స్వాధీనం చేసుకున్నాం. మృతుల వేలిముద్రలను సేకరించాం. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నాం. వధూవరులిద్దరూ పెళ్లికి ముందే ప్రేమించుకున్నారు. కుటుంబ సభ్యుల అంగీకారంతో వారి ప్రేమను అంగీకరించారు.

--పోలీసులు

ఫ్రెండ్ మర్డర్​.. తలను
స్నేహితుడిని ఘోరంగా హతమార్చాడు ఓ వ్యక్తి. తల నరికి మొండెంను వేరు చేశాడు. అనంతరం యువకుడి తలను సంచిలో తీసుకెళ్లాడు. ఈ భయానక ఘటన అసోంలోని జోర్హాట్​లో జరిగింది. నిందితుడు లోహిత్ గోగోయ్​(28)ను పోలీసులు అరెస్ట్ చేశారు. మృతుడిని లహదైగావ్​కు చెందిన అరుణ్ కుమార్(20)గా పోలీసులు గుర్తించారు. ఈ హత్యకు గల కారణాలు ఇంకా తెలియలేదని పోలీసులు వెల్లడించారు.

నిందితుడు లోహిత్​ గోగోయ్(28)​ మద్యానికి బానిసయ్యాడని పోలీసులు తెలిపారు. మృతుడు అరుణ్​.. నిందితుడు లోహిత్‌ గొగోయ్‌ స్నేహితులని ప్రాథమిక దర్యాప్తులో తేలిందని చెప్పారు. బాధితుడి తల్లి తన కుమారుడి హత్య జరిగిన కాసేపటి ముందే లోహిత్​, అరుణ్ కుమార్​ జూదం ఆడడం చూశానని తెలిపింది. అప్పుడు ఇద్దరూ మద్యం మత్తులో ఉన్నారని పేర్కొంది. అరుణ్ మృతదేహాన్ని లోహిత్ తోట వెనుక ఉన్న పొలంలో నిందితుడు పడేశాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.