ETV Bharat / bharat

మూడు రోజుల పోలీస్​ కస్టడీకి కేంద్ర మంత్రి కుమారుడు

కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్​ మిశ్రాకు (Ashish Mishra Lakhimpur) న్యాయస్థానం మూడు రోజుల పోలీస్​ రిమాండ్​ను విధించింది. ఈనెల 3న జరిగిన లఖింపుర్​ ఖేరి ఘర్షణల్లో మిశ్రా ప్రధాన నిందితుడు.

author img

By

Published : Oct 11, 2021, 5:36 PM IST

Updated : Oct 11, 2021, 5:48 PM IST

ashish mishra news
మూడు రోజుల పాటు పోలీస్​ రిమాండ్​లో ఆశీష్​​ మిశ్రా

ఉత్తర్​ప్రదేశ్​ లఖింపుర్​ ఖేరి ఘటనలో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి అజయ్​ మిశ్రా తనయుడు ఆశిష్​ మిశ్రాకు (Ashish Mishra Lakhimpur) 3 రోజుల పోలీస్​ రిమాండ్​ విధిస్తూ లఖింపుర్​ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించి సోమవారం విచారణ చేపట్టిన చీఫ్​ జ్యుడిషియల్​ మెజిస్ట్రేట్ జస్టిస్​​ చింతారామ్​.. షరతుల మీద ఈ రిమాండ్​కు అనుమతించారు. లాయర్​ సమక్షంలోనే మిశ్రాను ప్రశ్నించాలని, నిందితుడిని ఎలాంటి వేధింపులకు గురిచేయవద్దని పోలీసులకు స్పష్టం చేశారు.

ఈనెల 9న 12 గంటల పాటు విచారించిన అనంతరం ఆశిష్​ మిశ్రాను పోలీసులు అరెస్ట్​ చేశారు.

ఇప్పటివరకు ఈ ఘటనకు సంబంధించి ఆశిష్​ మిశ్రా (Ashish Mishra Lakhimpur) సహా మరో ఇద్దరు అరెస్ట్​ అయ్యారని పోలీసులు వెల్లడించారు. నిందితుడు దర్యాప్తునకు సహకరించట్లేదని పేర్కొన్నారు. ఈ కారణంగా పోలీస్​ రిమాండ్​కు అనుమతించాలని కోరుతూ కోర్టుకు దరఖాస్తు చేసుకున్నామని తెలిపారు.

అయితే దీనిపై స్పందించిన ఆశిష్​ మిశ్రా (Ashish Mishra News) తరపు న్యాయవాది.. మిశ్రా ఏ తప్పూ చేయలేదని, ఘటనకు సంబంధించిన 100కుపైగా ఫొటోలను, వీడియోలను పోలీసులకు ఇప్పటికే అందించామని స్పష్టం చేశారు.

అక్టోబరు 3న లఖింపుర్​ ఖేరీలోని టికూనియా (Lakhimpur Kheri Incident) సరిహద్దు వద్ద జరిగిన ఘర్షణలో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో నలుగురు రైతులు ఉన్నారు. ఆశిష్​ మిశ్రా తన కారుతో రైతులను తొక్కించారని.. ఈ క్రమంలో ఇద్దరు రైతులు ప్రాణాలు కోల్పోయారని రైతులు ఆరోపిస్తున్నారు.

సెక్షన్ 302, 304ఏ, 147, 148, 149, 279, 120బీల కింద ఆశిష్​ మిశ్రాపై కేసు నమోదు చేశారు పోలీసులు.

ఇదీ చూడండి : మహారాష్ట్ర మాజీ హోంమంత్రి ఇంట్లో సీబీఐ సోదాలు​

ఉత్తర్​ప్రదేశ్​ లఖింపుర్​ ఖేరి ఘటనలో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి అజయ్​ మిశ్రా తనయుడు ఆశిష్​ మిశ్రాకు (Ashish Mishra Lakhimpur) 3 రోజుల పోలీస్​ రిమాండ్​ విధిస్తూ లఖింపుర్​ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించి సోమవారం విచారణ చేపట్టిన చీఫ్​ జ్యుడిషియల్​ మెజిస్ట్రేట్ జస్టిస్​​ చింతారామ్​.. షరతుల మీద ఈ రిమాండ్​కు అనుమతించారు. లాయర్​ సమక్షంలోనే మిశ్రాను ప్రశ్నించాలని, నిందితుడిని ఎలాంటి వేధింపులకు గురిచేయవద్దని పోలీసులకు స్పష్టం చేశారు.

ఈనెల 9న 12 గంటల పాటు విచారించిన అనంతరం ఆశిష్​ మిశ్రాను పోలీసులు అరెస్ట్​ చేశారు.

ఇప్పటివరకు ఈ ఘటనకు సంబంధించి ఆశిష్​ మిశ్రా (Ashish Mishra Lakhimpur) సహా మరో ఇద్దరు అరెస్ట్​ అయ్యారని పోలీసులు వెల్లడించారు. నిందితుడు దర్యాప్తునకు సహకరించట్లేదని పేర్కొన్నారు. ఈ కారణంగా పోలీస్​ రిమాండ్​కు అనుమతించాలని కోరుతూ కోర్టుకు దరఖాస్తు చేసుకున్నామని తెలిపారు.

అయితే దీనిపై స్పందించిన ఆశిష్​ మిశ్రా (Ashish Mishra News) తరపు న్యాయవాది.. మిశ్రా ఏ తప్పూ చేయలేదని, ఘటనకు సంబంధించిన 100కుపైగా ఫొటోలను, వీడియోలను పోలీసులకు ఇప్పటికే అందించామని స్పష్టం చేశారు.

అక్టోబరు 3న లఖింపుర్​ ఖేరీలోని టికూనియా (Lakhimpur Kheri Incident) సరిహద్దు వద్ద జరిగిన ఘర్షణలో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో నలుగురు రైతులు ఉన్నారు. ఆశిష్​ మిశ్రా తన కారుతో రైతులను తొక్కించారని.. ఈ క్రమంలో ఇద్దరు రైతులు ప్రాణాలు కోల్పోయారని రైతులు ఆరోపిస్తున్నారు.

సెక్షన్ 302, 304ఏ, 147, 148, 149, 279, 120బీల కింద ఆశిష్​ మిశ్రాపై కేసు నమోదు చేశారు పోలీసులు.

ఇదీ చూడండి : మహారాష్ట్ర మాజీ హోంమంత్రి ఇంట్లో సీబీఐ సోదాలు​

Last Updated : Oct 11, 2021, 5:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.