ETV Bharat / bharat

కారు తీయమన్నందుకు వ్యాపారిపై 'పోక్సో' చట్టం ప్రయోగించిన ఎస్​ఐ - కేరళలో ఫేక్​ కంప్లైంట్​ నమోదు చేసిన ఎస్​ఐ

Fake POCSO Complaint: ఓ వ్యాపారిపై కోపంతో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాడు ఓ ఎస్​ఐ. తన కుమార్తెను అడ్డుపెట్టుకుని అతనిపై పోక్సో చట్టాన్ని ప్రయోగించాడు. దీనిపై బాధితుడు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయగా అసలు విషయం బయటపడింది. ఈ ఘటన కేరళ కన్నూర్​ జిల్లా​లో జరిగింది.

POCSO Complaint
ఫోక్సో చట్టం
author img

By

Published : Dec 26, 2021, 9:55 AM IST

Fake POCSO Complaint: తన దుకాణం ముందు నుంచి కారు తీయాలని కోరినందుకు ఓ వ్యాపారిపై ఏకంగా పోక్సో కేసు నమోదు చేశాడు ఎస్సై. తన మైనర్​ కుమార్తెను వ్యాపారి లైంగికంగా వేధించాడనే తప్పుడు ఫిర్యాదుతో కేసు పెట్టి అడ్డంగా బుక్కయ్యాడు. ఈ సంఘటన కేరళ, కన్నూర్​ జిల్లాలోని పయ్యనూర్​లో జరిగింది.

ఇదీ జరిగింది..

ఆగస్టు 19న పయ్యనూర్‌లోని ఓ బేకరీలో కేక్‌ కొనుగోలు చేసేందుకు ఎస్‌ఐ వచ్చారు. ఈ క్రమంలో తన కారును పక్కనే ఉన్న టైర్‌ సర్వీస్‌ దుకాణం ముందు నిలిపాడు. ఆ దుకాణం మేనేజర్ షమీమ్.. కారు ఇతర వాహనాలు వెళ్లేందుకు అడ్డుగా ఉందని, వేరే చోట నిలపాల్సిందిగా ఎస్​ఐని కోరారు. దీనిపై ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది.

ఈ ఘటన జరిగిన మరుసటి రోజున యూనిఫాంలో ఉన్న ఓ పోలీసు అధికారి షమీమ్​ దుకాణానికి వచ్చారు. కొవిడ్​ ప్రోటోకాల్‌ను పాటించనందుకు కేసు నమోదు చేస్తానని బెదిరించారు. దానితో పాటు కేక్ కొనుగోలు చేయడానికి వచ్చిన సమయంలో కారులో ఉన్న ఎస్‌ఐ కుమార్తెను నోటికి వచ్చినట్లు మాట్లాడారని షమీమ్‌పై కేసు నమోదు చేశారు.

ఎస్​ఐ తనపై తప్పుడు కేసు నమోదు చేశారని జిల్లా ఎస్పీకి, ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేశారు షమీమ్​. ఆ తర్వాత కూడా షమీమ్‌ సోదరుడు షిహాబ్‌కు ఫోన్‌ చేసిన ఎస్​ఐ మరోసారి బెదిరించారు.

ఈ విషయమై క్రైమ్​ బ్రాంచ్​ డిప్యూటీ ఎస్పీ దర్యాప్తు చేపట్టారు. ఆయన నివేదిక ఆధారంగా కన్నూర్​ రూరల్​ ఎస్పీ నవీనీత్​ శర్మ శాఖాపరమైన దర్యాప్తు చేపట్టాలని డీఐజీ కే.సేతురామన్​ ఆదేశించారు. స్పెషల్ బ్రాంచ్ విచారణలో షమీమ్​ను కావాలని కేసులో ఇరికించేందుకు ఎస్‌ఐ ప్రయత్నించినట్లు తేలింది. అనంతరం క్రమశిక్షణా చర్యల్లో భాగంగా ఎస్‌ఐని బదిలీ చేశారు.

ఇదీ చూడండి: వైద్య వ్యర్థాల నిర్వహణ పెను సవాలే..

Fake POCSO Complaint: తన దుకాణం ముందు నుంచి కారు తీయాలని కోరినందుకు ఓ వ్యాపారిపై ఏకంగా పోక్సో కేసు నమోదు చేశాడు ఎస్సై. తన మైనర్​ కుమార్తెను వ్యాపారి లైంగికంగా వేధించాడనే తప్పుడు ఫిర్యాదుతో కేసు పెట్టి అడ్డంగా బుక్కయ్యాడు. ఈ సంఘటన కేరళ, కన్నూర్​ జిల్లాలోని పయ్యనూర్​లో జరిగింది.

ఇదీ జరిగింది..

ఆగస్టు 19న పయ్యనూర్‌లోని ఓ బేకరీలో కేక్‌ కొనుగోలు చేసేందుకు ఎస్‌ఐ వచ్చారు. ఈ క్రమంలో తన కారును పక్కనే ఉన్న టైర్‌ సర్వీస్‌ దుకాణం ముందు నిలిపాడు. ఆ దుకాణం మేనేజర్ షమీమ్.. కారు ఇతర వాహనాలు వెళ్లేందుకు అడ్డుగా ఉందని, వేరే చోట నిలపాల్సిందిగా ఎస్​ఐని కోరారు. దీనిపై ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది.

ఈ ఘటన జరిగిన మరుసటి రోజున యూనిఫాంలో ఉన్న ఓ పోలీసు అధికారి షమీమ్​ దుకాణానికి వచ్చారు. కొవిడ్​ ప్రోటోకాల్‌ను పాటించనందుకు కేసు నమోదు చేస్తానని బెదిరించారు. దానితో పాటు కేక్ కొనుగోలు చేయడానికి వచ్చిన సమయంలో కారులో ఉన్న ఎస్‌ఐ కుమార్తెను నోటికి వచ్చినట్లు మాట్లాడారని షమీమ్‌పై కేసు నమోదు చేశారు.

ఎస్​ఐ తనపై తప్పుడు కేసు నమోదు చేశారని జిల్లా ఎస్పీకి, ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేశారు షమీమ్​. ఆ తర్వాత కూడా షమీమ్‌ సోదరుడు షిహాబ్‌కు ఫోన్‌ చేసిన ఎస్​ఐ మరోసారి బెదిరించారు.

ఈ విషయమై క్రైమ్​ బ్రాంచ్​ డిప్యూటీ ఎస్పీ దర్యాప్తు చేపట్టారు. ఆయన నివేదిక ఆధారంగా కన్నూర్​ రూరల్​ ఎస్పీ నవీనీత్​ శర్మ శాఖాపరమైన దర్యాప్తు చేపట్టాలని డీఐజీ కే.సేతురామన్​ ఆదేశించారు. స్పెషల్ బ్రాంచ్ విచారణలో షమీమ్​ను కావాలని కేసులో ఇరికించేందుకు ఎస్‌ఐ ప్రయత్నించినట్లు తేలింది. అనంతరం క్రమశిక్షణా చర్యల్లో భాగంగా ఎస్‌ఐని బదిలీ చేశారు.

ఇదీ చూడండి: వైద్య వ్యర్థాల నిర్వహణ పెను సవాలే..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.