ETV Bharat / bharat

ఆర్మీ ట్రక్కులో మంటలు.. ఐదుగురు జవాన్లు మృతి.. పిడుగు పడిందని..

author img

By

Published : Apr 20, 2023, 5:18 PM IST

Updated : Apr 20, 2023, 6:32 PM IST

జమ్ము కశ్మీర్​లో జవాన్లు ప్రయాణిస్తున్న ట్రక్కులో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఐదుగురు సైనికులు అమరులయ్యారు.

several soldiers died in poonch jammu kashmir in vehicle
ఆర్మీ వాహనంలో మంటలు అనేక మంది జవాన్లు దుర్మరణం

జమ్ము కశ్మీర్​లోని పూంచ్​ జిల్లాలో జవాన్లు ప్రయాణిస్తున్న ట్రక్కులో మంటలు చెలరేగి.. ఐదుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదం భాటా ధురియన్ ప్రాంతానికి సమీపంలోని హైవేపై గురువారం జరిగింది. పిడుగుపాటు కారణంగానే ఈ పేలుడు సంభవించి ఉంటుందని అధికారులు ప్రాథమికంగా భావిస్తున్నారు. జిల్లాకు 90 కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న ఆర్మీ, పోలీస్​ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. పేలుడుకు గల పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే.. ఎటువంటి ఉగ్రకోణం ఇందులో లేదని అధికారులు స్పష్టం చేశారు. కాగా, ఈ ప్రమాదంపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించినట్లు సమాచారం.

పూంచ్ సరిహద్దు జిల్లా కావడం వల్ల ఉగ్రమూకల చొరబాటు ప్రయాత్నాలు జరుగుతుంటాయి. ఈ నెల ప్రారంభంలోనే నియంత్రణ రేఖ (ఎల్‌ఓసి) వెంబడి పూంచ్ సెక్టార్‌లో పెద్ద చొరబాటు యత్నాన్ని భారత సైన్యం భగ్నం చేసింది. చొరబాటుదారులను వెంబడించే క్రమంలో ఓ వ్యక్తి చనిపోయాడు. మిగతా వారు అటవీ ప్రాంతంలోకి పరుగులు తీశారు. ఈ నేపథ్యంలో భద్రతను కూడా పెంచింది భారత సైన్యం.

గత నెల మార్చిలో కూడా జమ్ము కశ్మీర్​ పోలీసులతో భారత ఆర్మీ జాయింట్ ఆపరేషన్‌ చేపట్టింది. తంగ్‌ధర్ సెక్టార్‌లోని నియంత్రణ రేఖ వెంబడి చొరబాటుకు ప్రయత్నించిన కొందరి ముష్కరుల ప్రయత్నాన్ని కూడా ఈ సెర్చ్​ ఆపరేషన్​లో తిప్పికొట్టి ఒక ఉగ్రవాదిని మట్టుబెట్టారు. వీరి నుంచి 200 రౌండ్లకుపైగా గుండ్లు కలిగిన ఏకే రైఫిల్స్​, మూడు మ్యాగజైన్లు, రెండు చైనా గ్రెనేడ్లు, మందులు, ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.

టపాసుల గోదాములో మంటలు.. నలుగురు సజీవదహనం
గుజరాత్​లోని అరవల్లి జిల్లాలో జరిగిన అగ్నిప్రమాదంలో నలుగురు సజీవ దహనమయ్యారు. మోదాసా పట్టణానికి సమీపంలో ఉన్న బాణసంచా గోదాములో గురువారం సాయంత్రం ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. దీంతో చుట్టుపక్కల ప్రాంతాలలో దట్టమైన పొగ వ్యాపించింది. ఈ ప్రమాదంలో నలుగురు కార్మీకులు అగ్నికి ఆహుతయ్యారు. సమాచారం అందుకున్న అగ్ని మాపక​ సిబ్బంది, పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్ట్​మార్టం పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించినట్లు అరవల్లి పోలీసు సూపరింటెండెంట్ సంజయ్ ఖరత్ తెలిపారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని సంబంధిత అధికారులు చెప్పారు.

జమ్ము కశ్మీర్​లోని పూంచ్​ జిల్లాలో జవాన్లు ప్రయాణిస్తున్న ట్రక్కులో మంటలు చెలరేగి.. ఐదుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదం భాటా ధురియన్ ప్రాంతానికి సమీపంలోని హైవేపై గురువారం జరిగింది. పిడుగుపాటు కారణంగానే ఈ పేలుడు సంభవించి ఉంటుందని అధికారులు ప్రాథమికంగా భావిస్తున్నారు. జిల్లాకు 90 కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న ఆర్మీ, పోలీస్​ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. పేలుడుకు గల పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే.. ఎటువంటి ఉగ్రకోణం ఇందులో లేదని అధికారులు స్పష్టం చేశారు. కాగా, ఈ ప్రమాదంపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించినట్లు సమాచారం.

పూంచ్ సరిహద్దు జిల్లా కావడం వల్ల ఉగ్రమూకల చొరబాటు ప్రయాత్నాలు జరుగుతుంటాయి. ఈ నెల ప్రారంభంలోనే నియంత్రణ రేఖ (ఎల్‌ఓసి) వెంబడి పూంచ్ సెక్టార్‌లో పెద్ద చొరబాటు యత్నాన్ని భారత సైన్యం భగ్నం చేసింది. చొరబాటుదారులను వెంబడించే క్రమంలో ఓ వ్యక్తి చనిపోయాడు. మిగతా వారు అటవీ ప్రాంతంలోకి పరుగులు తీశారు. ఈ నేపథ్యంలో భద్రతను కూడా పెంచింది భారత సైన్యం.

గత నెల మార్చిలో కూడా జమ్ము కశ్మీర్​ పోలీసులతో భారత ఆర్మీ జాయింట్ ఆపరేషన్‌ చేపట్టింది. తంగ్‌ధర్ సెక్టార్‌లోని నియంత్రణ రేఖ వెంబడి చొరబాటుకు ప్రయత్నించిన కొందరి ముష్కరుల ప్రయత్నాన్ని కూడా ఈ సెర్చ్​ ఆపరేషన్​లో తిప్పికొట్టి ఒక ఉగ్రవాదిని మట్టుబెట్టారు. వీరి నుంచి 200 రౌండ్లకుపైగా గుండ్లు కలిగిన ఏకే రైఫిల్స్​, మూడు మ్యాగజైన్లు, రెండు చైనా గ్రెనేడ్లు, మందులు, ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.

టపాసుల గోదాములో మంటలు.. నలుగురు సజీవదహనం
గుజరాత్​లోని అరవల్లి జిల్లాలో జరిగిన అగ్నిప్రమాదంలో నలుగురు సజీవ దహనమయ్యారు. మోదాసా పట్టణానికి సమీపంలో ఉన్న బాణసంచా గోదాములో గురువారం సాయంత్రం ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. దీంతో చుట్టుపక్కల ప్రాంతాలలో దట్టమైన పొగ వ్యాపించింది. ఈ ప్రమాదంలో నలుగురు కార్మీకులు అగ్నికి ఆహుతయ్యారు. సమాచారం అందుకున్న అగ్ని మాపక​ సిబ్బంది, పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్ట్​మార్టం పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించినట్లు అరవల్లి పోలీసు సూపరింటెండెంట్ సంజయ్ ఖరత్ తెలిపారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని సంబంధిత అధికారులు చెప్పారు.

Last Updated : Apr 20, 2023, 6:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.