ETV Bharat / bharat

Covid updates: దేశంలో మరో 42,982 మందికి కరోనా

దేశంలో కొత్తగా 42,982 మందికి కరోనా సోకింది. వైరస్​తో మరో 533 మంది ప్రాణాలు కోల్పోయారు.

author img

By

Published : Aug 5, 2021, 10:02 AM IST

Updated : Aug 5, 2021, 10:49 AM IST

Covid cases, corona deaths
కరోనా కేసులు, కరోనాలు మరణాలు

దేశంలో కరోనా కేసులు(Coronavirus India) బుధవారంతో పోలిస్తే స్వల్పంగా పెరిగాయి. కొత్తగా 42,982 మందికి వైరస్ సోకినట్లు తేలింది. మరో 533 మంది మరణించారు. తాజాగా 41,726 మంది కొవిడ్​ నుంచి కోలుకున్నారు.

మొత్తం కేసులు: 3,18,12,114

మొత్తం మరణాలు: 4,26,290

కోలుకున్నవారు: 3,09,74,748

యాక్టివ్​ కేసులు: 4,11,076

టీకాల పంపిణీ

దేశంలో టీకా పంపిణీ కార్యక్రమం నిర్విరామంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు మొత్తం 48,93,42,295 టీకా డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. బుధవారం కొత్తగా 37,55,115 డోసులు అందించినట్లు పేర్కొంది.

కొవిడ్ పరీక్షలు

బుధవారం ఒక్కరోజే 16,64,030 కొవిడ్​ టెస్ట్​లు చేసినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. ఫలితంగా మొత్తం పరీక్షల సంఖ్య 47,48,93,363కు చేరింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

రాష్ట్రాల్లో కేసులు ఇలా..

  • కేరళలో కొత్తగా 22,414 కేసులు నమోదయ్యాయి. మరో 19,478 మంది కోలుకోగా.. మహమ్మారి ధాటికి 108 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • మహారాష్ట్రలో కొత్తగా 6,126 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్​తో మరో 195 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • కర్ణాటకలో ఒక్కరోజే 1,769 మందికి వైరస్ నిర్ధరణ అయింది. వైరస్ కారణంగా మరో 30 మంది చనిపోయారు.
  • ఒడిశాలో కొత్తగా 1,315 మందికి వైరస్ సోకింది. కొవిడ్​ కారణంగా మరో 66 మంది మరణించారు.
  • తమిళనాడులో కొత్తగా 1,949 మందికి కరోనా పాజిటివ్​గా​ నిర్ధరణ అయింది. పొరుగు రాష్ట్రం కేరళలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఆ రాష్ట్రం నుంచి వచ్చేవారు తప్పనిసరిగా ఆర్​టీ-పీసీఆర్​ పరీక్ష నెగటివ్ ఫలితం, వ్యాక్సినేషన్ తీసుకున్నట్లుగా ధ్రువపత్రం తీసుకురావాలని తమిళనాడు ప్రభుత్వం తెలిపింది.

ఇదీ చూడండి: తెరచుకోనున్న జగన్నాథ ఆలయం.. ఆర్టీపీసీఆర్ తప్పనిసరి

దేశంలో కరోనా కేసులు(Coronavirus India) బుధవారంతో పోలిస్తే స్వల్పంగా పెరిగాయి. కొత్తగా 42,982 మందికి వైరస్ సోకినట్లు తేలింది. మరో 533 మంది మరణించారు. తాజాగా 41,726 మంది కొవిడ్​ నుంచి కోలుకున్నారు.

మొత్తం కేసులు: 3,18,12,114

మొత్తం మరణాలు: 4,26,290

కోలుకున్నవారు: 3,09,74,748

యాక్టివ్​ కేసులు: 4,11,076

టీకాల పంపిణీ

దేశంలో టీకా పంపిణీ కార్యక్రమం నిర్విరామంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు మొత్తం 48,93,42,295 టీకా డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. బుధవారం కొత్తగా 37,55,115 డోసులు అందించినట్లు పేర్కొంది.

కొవిడ్ పరీక్షలు

బుధవారం ఒక్కరోజే 16,64,030 కొవిడ్​ టెస్ట్​లు చేసినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. ఫలితంగా మొత్తం పరీక్షల సంఖ్య 47,48,93,363కు చేరింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

రాష్ట్రాల్లో కేసులు ఇలా..

  • కేరళలో కొత్తగా 22,414 కేసులు నమోదయ్యాయి. మరో 19,478 మంది కోలుకోగా.. మహమ్మారి ధాటికి 108 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • మహారాష్ట్రలో కొత్తగా 6,126 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్​తో మరో 195 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • కర్ణాటకలో ఒక్కరోజే 1,769 మందికి వైరస్ నిర్ధరణ అయింది. వైరస్ కారణంగా మరో 30 మంది చనిపోయారు.
  • ఒడిశాలో కొత్తగా 1,315 మందికి వైరస్ సోకింది. కొవిడ్​ కారణంగా మరో 66 మంది మరణించారు.
  • తమిళనాడులో కొత్తగా 1,949 మందికి కరోనా పాజిటివ్​గా​ నిర్ధరణ అయింది. పొరుగు రాష్ట్రం కేరళలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఆ రాష్ట్రం నుంచి వచ్చేవారు తప్పనిసరిగా ఆర్​టీ-పీసీఆర్​ పరీక్ష నెగటివ్ ఫలితం, వ్యాక్సినేషన్ తీసుకున్నట్లుగా ధ్రువపత్రం తీసుకురావాలని తమిళనాడు ప్రభుత్వం తెలిపింది.

ఇదీ చూడండి: తెరచుకోనున్న జగన్నాథ ఆలయం.. ఆర్టీపీసీఆర్ తప్పనిసరి

Last Updated : Aug 5, 2021, 10:49 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.