ETV Bharat / bharat

ఆడపిల్లగా పుట్టడమే పాపం.. 9 నెలల చిన్నారిని చంపిన తండ్రి.. ముగ్గురు పిల్లలకు విషమిచ్చి తల్లి..

author img

By

Published : Dec 2, 2022, 12:33 PM IST

Updated : Dec 2, 2022, 12:53 PM IST

ఆడపిల్ల పుట్టిందన్న కోపంతో ఉన్న ఓ తండ్రి.. 9 నెలల చిన్నారిని అతి కిరాతకంగా చంపాడు. ఈ అమానవీయ ఘటన కర్ణాటకలోని యాదగిరి జిల్లాలో జరిగింది. మరో ఘటనలో ముగ్గరు పిల్లలకు విషమిచ్చి చంపింది ఓ తల్లి. అనంతరం ఆమె కూడా ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

father killed his 9 month old daughter
father killed his 9 month old daughter

కర్ణాటక యాదగిరి జిల్లాలో అమానవీయ ఘటన జరిగింది. ఆడపిల్ల పుట్టిందన్న కోపంతో ఉన్న ఓ తండ్రి.. 9 నెలల చిన్నారిని అతి కిరాతకంగా చంపాడు. బడ్డేపల్లి గ్రామానికి చెందిన రాము, సావిత్రి అనే దంపతులకు 9 నెలల క్రితం ఆడపిల్ల జన్మించింది. ఆడపిల్ల పుట్టడం వల్ల రాము అప్పటి నుంచి ఆగ్రహంతో ఉన్నాడు. చిన్నారి జన్మించిన నాటి నుంచి కూలీ పనులకు సైతం వెళ్లకుండా కూతురిని కాపాడుకుంటోంది సావిత్రి. చిన్నారిని తాను చూసుకుంటానని నమ్మించిన రాము.. నవంబర్​ 30న సావిత్రిని కూలీ పనులకు పంపాడు. సావిత్రి తిరిగి వచ్చేసరికి చిన్నారి గొంతు నులిని హత్య చేశాడు. సావిత్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడు రామును అరెస్ట్ చేశారు. మద్యం మత్తులోనే రాము చిన్నారి గొంతు నులిమి హత్య చేశాడని ఎస్​పీ వేదమూర్తి తెలిపారు.

ముగ్గురు పిల్లలకు విషమిచ్చి చంపి తల్లి ఆత్మహత్య
కర్ణాటక మండ్యలో దారుణం జరిగింది. ముగ్గురు పిల్లలకు విషమిచ్చి చంపింది ఓ తల్లి. అనంతరం ఆమె కూడా ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. భార్యభర్తల మధ్య వివాదమే దీనికి కారణంగా తెలుస్తోంది.

మద్దుర్​ పట్టణానికి చెందిన అఖిల్​ కార్​ మెకానిక్​గా పనిచేస్తున్నాడు. అతడి భార్య కౌజర్​ ఓ ప్రైవేట్​ నర్సింగ్​ హోమ్​లో పనిచేస్తోంది. వీరికి ఏడేళ్ల కుమారుడు హ్యరిస్​, కూతుళ్లు అల్లిసా(4), అనమ్​ ఫాతిమా(2) ఉన్నారు. గత ఏడాది కాలంగా భార్యభర్తల మధ్య గొడవలు జరగుతున్నాయి. దీంతో కలత చెందిన కౌజర్​.. గురువారం రాత్రి పిల్లలకు విషమిచ్చి చంపింది. అనంతరం ఆమె కూడా ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.

హైటెన్షన్​ విద్యుత్​ తీగలు తగిలి
పావురాలను పట్టుకునేందుకు ప్రయత్నించి ఇద్దరు బాలురు ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. కర్ణాటక విజయానంద నగర్​కు చెందిన ఇద్దరు బాలురు.. పావురాలను పట్టుకునేందుకు డాబా ఎక్కారు. ఈ క్రమంలోనే హైటెన్షన్​ విద్యుత్​ తీగలు తగిలి.. తీవ్రంగా గాయపడ్డారు. బాలురను ఆస్పత్రికి తరలించిగా ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు.

క్లాస్​మేట్​పై అత్యాచారం
మహారాష్ట్ర రాజధాని ముంబయిలో దారుణం జరిగింది. ఇద్దరు మైనర్లు కలిసి 13 ఏళ్ల క్లాస్​మేట్​పై అత్యాచారం చేశారు. డ్యాన్స్ ప్రాక్టీస్ చేద్దామంటూ తీసుకెళ్లిన నిందితులు.. ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితులను జ్యువైనల్​ కోర్టులో హాజరుపరిచారు.

ఇవీ చదవండి: రూ.500.. 100కిలోమీటర్లు.. పంపిన నాలుగేళ్లకు చేరిన మనీ ఆర్డర్​

ఓవైపు పుట్టెడు దుఃఖం.. మరోవైపు పేదరికం.. తోపుడు బండిపైనే ఇంటికి మృతదేహం

కర్ణాటక యాదగిరి జిల్లాలో అమానవీయ ఘటన జరిగింది. ఆడపిల్ల పుట్టిందన్న కోపంతో ఉన్న ఓ తండ్రి.. 9 నెలల చిన్నారిని అతి కిరాతకంగా చంపాడు. బడ్డేపల్లి గ్రామానికి చెందిన రాము, సావిత్రి అనే దంపతులకు 9 నెలల క్రితం ఆడపిల్ల జన్మించింది. ఆడపిల్ల పుట్టడం వల్ల రాము అప్పటి నుంచి ఆగ్రహంతో ఉన్నాడు. చిన్నారి జన్మించిన నాటి నుంచి కూలీ పనులకు సైతం వెళ్లకుండా కూతురిని కాపాడుకుంటోంది సావిత్రి. చిన్నారిని తాను చూసుకుంటానని నమ్మించిన రాము.. నవంబర్​ 30న సావిత్రిని కూలీ పనులకు పంపాడు. సావిత్రి తిరిగి వచ్చేసరికి చిన్నారి గొంతు నులిని హత్య చేశాడు. సావిత్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడు రామును అరెస్ట్ చేశారు. మద్యం మత్తులోనే రాము చిన్నారి గొంతు నులిమి హత్య చేశాడని ఎస్​పీ వేదమూర్తి తెలిపారు.

ముగ్గురు పిల్లలకు విషమిచ్చి చంపి తల్లి ఆత్మహత్య
కర్ణాటక మండ్యలో దారుణం జరిగింది. ముగ్గురు పిల్లలకు విషమిచ్చి చంపింది ఓ తల్లి. అనంతరం ఆమె కూడా ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. భార్యభర్తల మధ్య వివాదమే దీనికి కారణంగా తెలుస్తోంది.

మద్దుర్​ పట్టణానికి చెందిన అఖిల్​ కార్​ మెకానిక్​గా పనిచేస్తున్నాడు. అతడి భార్య కౌజర్​ ఓ ప్రైవేట్​ నర్సింగ్​ హోమ్​లో పనిచేస్తోంది. వీరికి ఏడేళ్ల కుమారుడు హ్యరిస్​, కూతుళ్లు అల్లిసా(4), అనమ్​ ఫాతిమా(2) ఉన్నారు. గత ఏడాది కాలంగా భార్యభర్తల మధ్య గొడవలు జరగుతున్నాయి. దీంతో కలత చెందిన కౌజర్​.. గురువారం రాత్రి పిల్లలకు విషమిచ్చి చంపింది. అనంతరం ఆమె కూడా ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.

హైటెన్షన్​ విద్యుత్​ తీగలు తగిలి
పావురాలను పట్టుకునేందుకు ప్రయత్నించి ఇద్దరు బాలురు ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. కర్ణాటక విజయానంద నగర్​కు చెందిన ఇద్దరు బాలురు.. పావురాలను పట్టుకునేందుకు డాబా ఎక్కారు. ఈ క్రమంలోనే హైటెన్షన్​ విద్యుత్​ తీగలు తగిలి.. తీవ్రంగా గాయపడ్డారు. బాలురను ఆస్పత్రికి తరలించిగా ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు.

క్లాస్​మేట్​పై అత్యాచారం
మహారాష్ట్ర రాజధాని ముంబయిలో దారుణం జరిగింది. ఇద్దరు మైనర్లు కలిసి 13 ఏళ్ల క్లాస్​మేట్​పై అత్యాచారం చేశారు. డ్యాన్స్ ప్రాక్టీస్ చేద్దామంటూ తీసుకెళ్లిన నిందితులు.. ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితులను జ్యువైనల్​ కోర్టులో హాజరుపరిచారు.

ఇవీ చదవండి: రూ.500.. 100కిలోమీటర్లు.. పంపిన నాలుగేళ్లకు చేరిన మనీ ఆర్డర్​

ఓవైపు పుట్టెడు దుఃఖం.. మరోవైపు పేదరికం.. తోపుడు బండిపైనే ఇంటికి మృతదేహం

Last Updated : Dec 2, 2022, 12:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.