Ayodhya Temple construction status: అయోధ్యలో రామ మందిరం నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. తీవ్రమైన చలితోనూ పనులు కొనసాగుతున్నాయి. రాత్రి వేళ సైతం నిర్విఘ్నంగా నిర్మాణ పనులు చేపడుతున్నారు ఇంజినీర్లు.
![construction of ram temple](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/up-ayo-02-mandir-nirman-update-visbite-up10135_14012022211145_1401f_1642174905_149.jpg)
![construction of ram temple](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/up-ayo-02-mandir-nirman-update-visbite-up10135_14012022211145_1401f_1642174905_692.jpg)
Sri Ram Janmabhoomi trust
ఇప్పటివరకు మందిర నిర్మాణం 30 శాతం పూర్తైందని ఆలయ ట్రస్ట్ అధికారులు శుక్రవారం వెల్లడించారు. మిగిలిన పని మూడున్నరేళ్లలో పూర్తవుతుందని తెలిపారు. జనవరి చివరి నాటికి రెండో దశ నిర్మాణ పనులు పూర్తవుతాయని చెప్పారు.
![construction of ram temple](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/up-ayo-02-mandir-nirman-update-visbite-up10135_14012022211145_1401f_1642174905_863.jpg)
![construction of ram temple](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/up-ayo-02-mandir-nirman-update-visbite-up10135_14012022211145_1401f_1642174905_666.jpg)
Ayodhya Temple construction update
"పునాది పనుల్లో ఓ భాగం పూర్తైంది. రెండో పునాది పనులు కొనసాగుతున్నాయి. జనవరిలోనే ఇది పూర్తవుతుంది. అయోధ్యలో తీవ్రమైన చలి ఉన్నా.. పగలూ రాత్రి అన్న తేడా లేకుండా పనులు జరుగుతున్నాయి. 40 మంది ఇంజినీర్ల పర్యవేక్షణలో 250 మంది కూలీలు పనులు చేస్తున్నారు. అవసరాన్ని బట్టి కూలీల సంఖ్యను పెంచుతాం. అయోధ్యలో జరుగుతున్న నిర్మాణ పనులపై ఇప్పటికే త్రీడీ యానిమేషన్ వీడియోను యూట్యూబ్లో విడుదల చేశాం."
-చంపత్ రాయ్, శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్
కాంక్రీటు పనులను ఎల్ అండ్ టీ చేపట్టిందని సాంకేతిక నిపుణుడు జగదీశ్ అఫ్దే తెలిపారు. డిజైన్, పీఎంసీ పనులు టాటా కన్సల్టెన్సీ ఆధ్వర్యంలో నడుస్తున్నాయని చెప్పారు. 'మందిరం పనులు మరో రెండేళ్లు జరగనున్నాయి. గోడ నిర్మాణం ఒకటిన్నరేళ్లు పడుతుంది. మిర్జాపుర్తో పాటు దక్షిణ భారతదేశం నుంచి స్తంభాలను తీసుకొస్తున్నాం' అని చెప్పారు జగదీశ్.
![construction of ram temple](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/up-ayo-02-mandir-nirman-update-visbite-up10135_14012022211145_1401f_1642174905_3.jpg)
Ayodhya temple design
2.7 ఎకరాల విస్తీర్ణంలో ప్రధాన ఆలయాన్ని నిర్మిస్తున్నారు. మందిరం పొడవు 360 అడుగులు, వెడల్పు 235 అడుగులు ఉండనుంది. మూడు అంతస్తులతో నిర్మించనున్న ఈ మందిరం ఎత్తు 161గా ఉంటుంది. రెండున్నర అడుగుల పొడవు ఉన్న 17 వేల రాళ్లను మందిరం నిర్మాణంలో ఉపయోగిస్తున్నారు.
2020 ఆగస్టు 5న అయోధ్య రామ మందిర నిర్మాణం లాంఛనంగా ప్రారంభమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. వేద మంత్రాల మధ్య ఆలయానికి పునాది రాయి వేశారు. అప్పటి నుంచి నిర్మాణ పనులు చకచకా జరిగిపోతున్నాయి.
ఇదీ చదవండి: 'అమెరికా ఆస్పత్రి నుంచే కేరళ పాలన.. బైడెన్లా చేయరట!'