ETV Bharat / bharat

'వ్యవసాయ బిల్లులు.. రైతులకు డెత్​ వారెంట్లు'

వ్యవసాయ బిల్లులను ఆమోదించటం ద్వారా ప్రభుత్వం రైతులకు డెత్​ వారెంట్లు జారీ చేసిందన్నారు కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ. ప్రభుత్వ విధానాలతో ప్రజాస్వామ్యం సిగ్గుపడుతోందని పేర్కొన్నారు రాహుల్​.

author img

By

Published : Sep 20, 2020, 8:03 PM IST

Rahul Gandhi
కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ రంగ బిల్లులపై తీవ్ర విమర్శలు చేశారు కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ. రెండు వ్యవసాయ బిల్లులను ఆమోదించటం ద్వారా రైతులపై ప్రభుత్వం డెత్​ వారెంట్లు జారీ చేసిందని అభిప్రాయపడ్డారు. మోదీ సర్కార్​ విధానాలతో ప్రజాస్వామ్యం సిగ్గుపడుతోందని ఆరోపించారు.

  • जो किसान धरती से सोना उगाता है,
    मोदी सरकार का घमंड उसे ख़ून के आँसू रुलाता है।

    राज्यसभा में आज जिस तरह कृषि विधेयक के रूप में सरकार ने किसानों के ख़िलाफ़ मौत का फ़रमान निकाला, उससे लोकतंत्र शर्मिंदा है।

    — Rahul Gandhi (@RahulGandhi) September 20, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"రైతులు భూమిలోంచి బంగారాన్ని పండిస్తున్నారు. కానీ, మోదీ ప్రభుత్వం అహంకారంతో రైతుల కన్నీటి నుంచి రక్తం వచ్చేలా చేస్తోంది. రాజ్యసభలో ఆమోదించిన రెండు వ్యవసాయ బిల్లుల రూపంలో.. ప్రభుత్వం రైతులకు డెత్​ వారెంట్లు జారీ చేసింది. ఈ విధానాలతో ప్రజాస్వామ్యం సిగ్గుపడింది."

- రాహుల్​ గాంధీ, కాంగ్రెస్​ నేత

ఈ బిల్లులను వ్యవసాయ వ్యతిరేక చట్టాలుగా పేర్కొన్నారు రాహుల్​ గాంధీ. వ్యవసాయ మార్కెట్లకు ముగింపు పలికి రైతులకు ఏవిధంగా కనీస మద్ధతు ధర(ఎంఎస్​పీ)పై హామీ ఇస్తారని ప్రశ్నించారు. రైతులను పెట్టుబడిదారులకు బానిసలుగా చేసిందని.. మోదీ ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పించారు రాహుల్​. దీనిని దేశం ఆమోదించదని పేర్కొన్నారు. 'రైతుల శత్రువు మోదీ' అనే హ్యాష్​ట్యాగ్​తో ట్వీట్​ చేశారు.

  • मोदी सरकार के कृषि-विरोधी ‘काले क़ानून’ से किसानों को:

    1. APMC/किसान मार्केट ख़त्म होने पर MSP कैसे मिलेगा?
    2. MSP की गारंटी क्यों नहीं?

    मोदी जी किसानों को पूँजीपतियों का ‘ग़ुलाम' बना रहे हैं जिसे देश कभी सफल नहीं होने देगा।#KisanVirodhiNarendraModi

    — Rahul Gandhi (@RahulGandhi) September 20, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చూడండి:గందరగోళం మధ్య వ్యవసాయ బిల్లులకు ఆమోదం

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ రంగ బిల్లులపై తీవ్ర విమర్శలు చేశారు కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ. రెండు వ్యవసాయ బిల్లులను ఆమోదించటం ద్వారా రైతులపై ప్రభుత్వం డెత్​ వారెంట్లు జారీ చేసిందని అభిప్రాయపడ్డారు. మోదీ సర్కార్​ విధానాలతో ప్రజాస్వామ్యం సిగ్గుపడుతోందని ఆరోపించారు.

  • जो किसान धरती से सोना उगाता है,
    मोदी सरकार का घमंड उसे ख़ून के आँसू रुलाता है।

    राज्यसभा में आज जिस तरह कृषि विधेयक के रूप में सरकार ने किसानों के ख़िलाफ़ मौत का फ़रमान निकाला, उससे लोकतंत्र शर्मिंदा है।

    — Rahul Gandhi (@RahulGandhi) September 20, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"రైతులు భూమిలోంచి బంగారాన్ని పండిస్తున్నారు. కానీ, మోదీ ప్రభుత్వం అహంకారంతో రైతుల కన్నీటి నుంచి రక్తం వచ్చేలా చేస్తోంది. రాజ్యసభలో ఆమోదించిన రెండు వ్యవసాయ బిల్లుల రూపంలో.. ప్రభుత్వం రైతులకు డెత్​ వారెంట్లు జారీ చేసింది. ఈ విధానాలతో ప్రజాస్వామ్యం సిగ్గుపడింది."

- రాహుల్​ గాంధీ, కాంగ్రెస్​ నేత

ఈ బిల్లులను వ్యవసాయ వ్యతిరేక చట్టాలుగా పేర్కొన్నారు రాహుల్​ గాంధీ. వ్యవసాయ మార్కెట్లకు ముగింపు పలికి రైతులకు ఏవిధంగా కనీస మద్ధతు ధర(ఎంఎస్​పీ)పై హామీ ఇస్తారని ప్రశ్నించారు. రైతులను పెట్టుబడిదారులకు బానిసలుగా చేసిందని.. మోదీ ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పించారు రాహుల్​. దీనిని దేశం ఆమోదించదని పేర్కొన్నారు. 'రైతుల శత్రువు మోదీ' అనే హ్యాష్​ట్యాగ్​తో ట్వీట్​ చేశారు.

  • मोदी सरकार के कृषि-विरोधी ‘काले क़ानून’ से किसानों को:

    1. APMC/किसान मार्केट ख़त्म होने पर MSP कैसे मिलेगा?
    2. MSP की गारंटी क्यों नहीं?

    मोदी जी किसानों को पूँजीपतियों का ‘ग़ुलाम' बना रहे हैं जिसे देश कभी सफल नहीं होने देगा।#KisanVirodhiNarendraModi

    — Rahul Gandhi (@RahulGandhi) September 20, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చూడండి:గందరగోళం మధ్య వ్యవసాయ బిల్లులకు ఆమోదం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.