ETV Bharat / bharat

చప్పట్లతో మార్మోగిన దేశం.. జనతా కర్ఫ్యూకు విశేష స్పందన

జనతా కర్ఫ్యూలో భాగంగా దేశవ్యాప్తంగా ఇళ్లకే పరిమితమైన ప్రజలు.. తమకోసం పాటుపడే వారికి చప్పట్లతో సంఘీభావం తెలిపారు. ప్రజల కరతాళధ్వనులతో దేశం మార్మోగింది.

author img

By

Published : Mar 22, 2020, 5:12 PM IST

Updated : Mar 22, 2020, 5:59 PM IST

CORONA
చప్పట్లతో మారుమోగిన దేశం
చప్పట్లతో మార్మోగిన దేశం

దేశవ్యాప్తంగా నేడు నిర్వహించిన జనతా కర్ఫ్యూకు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. కరోనా వైరస్​ను లెక్కచేయక ప్రజల కోసం పని చేసే వారి కోసం దేశమంతా ఒక్కటై చప్పట్లతో సంఘీభావం తెలిపింది. స్వచ్ఛంద కర్ఫ్యూలో భాగంగా సాయంత్రం 5 గంటల తర్వాత వారి వారి ఇళ్ల బాల్కనీలు, మిద్దెలపై నుంచి, మరికొందరు బయటికొచ్చి చప్పట్లు కొట్టారు.

కరోనా ప్రభావం పెరుగుతున్న తరుణంలో తమకు వైరస్​ సోకే అవకాశాలు ఉన్నప్పటికీ వైద్యులు, ఆస్పత్రి సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, మీడియా రంగ ప్రతినిధులు, పోలీసులు, డ్రైవర్లు, రైల్వే, బస్సు, ఆటో రిక్షా కార్మికులు, డెలివరీ బాయ్స్​ వీరందరూ దేశ ప్రజలకోసం శ్రమిస్తున్నారు. వారి కృషికి కృతజ్ఞతగా చప్పట్లతో సంఘీభావం తెలిపింది యావత్​ ప్రజానీకం.

ప్రధాని పిలుపుతో..

కరోనా వైరస్​ వ్యాప్తిని అడ్డుకునే చర్యల్లో భాగంగా ఆదివారం(మార్చి 22) ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు జనతా కర్ఫ్యూకు పిలుపునిచ్చారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఆయన పిలుపు మేరకు నేడు దేశమంతా ఒక్కతాటిపైకి వచ్చి స్వచ్ఛందంగా ఇళ్లకే పరిమితమయ్యారు. కరోనాను అరికట్టేందుకు తామంతా ఒక్కటేనని నిరూపించారు.

ఇదీ చూడండి: గుమ్మాలు, బాల్కనీల్లో నిల్చొని చప్పట్లు కొట్టండి-ప్రధాని

చప్పట్లతో మార్మోగిన దేశం

దేశవ్యాప్తంగా నేడు నిర్వహించిన జనతా కర్ఫ్యూకు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. కరోనా వైరస్​ను లెక్కచేయక ప్రజల కోసం పని చేసే వారి కోసం దేశమంతా ఒక్కటై చప్పట్లతో సంఘీభావం తెలిపింది. స్వచ్ఛంద కర్ఫ్యూలో భాగంగా సాయంత్రం 5 గంటల తర్వాత వారి వారి ఇళ్ల బాల్కనీలు, మిద్దెలపై నుంచి, మరికొందరు బయటికొచ్చి చప్పట్లు కొట్టారు.

కరోనా ప్రభావం పెరుగుతున్న తరుణంలో తమకు వైరస్​ సోకే అవకాశాలు ఉన్నప్పటికీ వైద్యులు, ఆస్పత్రి సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, మీడియా రంగ ప్రతినిధులు, పోలీసులు, డ్రైవర్లు, రైల్వే, బస్సు, ఆటో రిక్షా కార్మికులు, డెలివరీ బాయ్స్​ వీరందరూ దేశ ప్రజలకోసం శ్రమిస్తున్నారు. వారి కృషికి కృతజ్ఞతగా చప్పట్లతో సంఘీభావం తెలిపింది యావత్​ ప్రజానీకం.

ప్రధాని పిలుపుతో..

కరోనా వైరస్​ వ్యాప్తిని అడ్డుకునే చర్యల్లో భాగంగా ఆదివారం(మార్చి 22) ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు జనతా కర్ఫ్యూకు పిలుపునిచ్చారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఆయన పిలుపు మేరకు నేడు దేశమంతా ఒక్కతాటిపైకి వచ్చి స్వచ్ఛందంగా ఇళ్లకే పరిమితమయ్యారు. కరోనాను అరికట్టేందుకు తామంతా ఒక్కటేనని నిరూపించారు.

ఇదీ చూడండి: గుమ్మాలు, బాల్కనీల్లో నిల్చొని చప్పట్లు కొట్టండి-ప్రధాని

Last Updated : Mar 22, 2020, 5:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.