ETV Bharat / bharat

దేశంలో 900 దాటిన కరోనా కేసుల సంఖ్య

author img

By

Published : Mar 28, 2020, 8:45 PM IST

దేశంలో గత 24 గంటల్లో 194 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ సోకిన వారి సంఖ్య మొత్తంగా 900 దాటిందని.. ఇప్పటివరకు 19 మంది ప్రాణాలు కోల్పోయారాని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో వైరస్​ను అరికట్టేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నట్లు స్పష్టం చేసింది.

corona
దేశంలో పెరుగుతున్న కరోనా- 900 దాటిన బాధితుల సంఖ్య

దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో నమోదైన 194 కేసులతో కలిపి వైరస్ బాధితుల సంఖ్య 918కి పెరిగిందని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. 19 మంది మరణించినట్లుగా వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో 819 యాక్టివ్​ కేసులు ఉన్నాయని, 79 మందికి వైరస్ నయమైందని స్పష్టం చేసింది.

corona
900 వందలు దాటిన కరోనా కేసులు

రాష్ట్రాల్లో..

మహారాష్ట్రలో కొవిడ్-19 బాధితుల సంఖ్య 177కి పెరిగింది. మరణించిన వారి సంఖ్య 5గా ఉంది. గుజరాత్​లో మరో వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. దీంతో రాష్ట్రంలో కరోనా మృతులు నాలుగుకు చేరారు. కేరళలో తొలి వైరస్ మరణం నమోదైంది.

తమిళనాడులో కరోనా పాజిటివ్​గా తేలిన వారి సంఖ్య 42కు పెరిగింది. కర్ణాటకలో మరో 10 మందికి మహమ్మారి సోకినట్లుగా తేలింది. మొత్తంగా రాష్ట్రంలో బాధితుల సంఖ్య 74కు పెరిగింది. వైరస్​ను అడ్డుకునేందుకు ముందుజాగ్రత్త చర్యగా ప్రభుత్వం సమర్థవంతంగా కృషిచేస్తోందని వెల్లడించింది.

ఇదీ చూడండి: ఇంట్లో గది లేక చెట్టుపై క్వారెంటైన్​ కేంద్రం!

దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో నమోదైన 194 కేసులతో కలిపి వైరస్ బాధితుల సంఖ్య 918కి పెరిగిందని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. 19 మంది మరణించినట్లుగా వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో 819 యాక్టివ్​ కేసులు ఉన్నాయని, 79 మందికి వైరస్ నయమైందని స్పష్టం చేసింది.

corona
900 వందలు దాటిన కరోనా కేసులు

రాష్ట్రాల్లో..

మహారాష్ట్రలో కొవిడ్-19 బాధితుల సంఖ్య 177కి పెరిగింది. మరణించిన వారి సంఖ్య 5గా ఉంది. గుజరాత్​లో మరో వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. దీంతో రాష్ట్రంలో కరోనా మృతులు నాలుగుకు చేరారు. కేరళలో తొలి వైరస్ మరణం నమోదైంది.

తమిళనాడులో కరోనా పాజిటివ్​గా తేలిన వారి సంఖ్య 42కు పెరిగింది. కర్ణాటకలో మరో 10 మందికి మహమ్మారి సోకినట్లుగా తేలింది. మొత్తంగా రాష్ట్రంలో బాధితుల సంఖ్య 74కు పెరిగింది. వైరస్​ను అడ్డుకునేందుకు ముందుజాగ్రత్త చర్యగా ప్రభుత్వం సమర్థవంతంగా కృషిచేస్తోందని వెల్లడించింది.

ఇదీ చూడండి: ఇంట్లో గది లేక చెట్టుపై క్వారెంటైన్​ కేంద్రం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.