ETV Bharat / bharat

ఇక సినిమా స్టార్లను ముఖానికి కట్టేసుకోండి!

రొటీన్​ మాస్కులు ధరించి బోర్​ కొడితే.. ఇక రజినీకాంత్​ను ముఖంపై పెట్టుకు తిరగొచ్చు. కమల్​హాసన్​ను మూతికి చుట్టుకోవచ్చు. ఒక్కరేమిటి... మీకు ఏ హీరో నచ్చితే ఆ హీరో మిమ్మల్ని కరోనా నుంచి రక్షిస్తారు. అవును తమిళనాడులో ఓ వస్త్ర పరిశ్రమ తయారు చేసిన ఆ సినీతారల మాస్కులు​ ఇప్పుడు ట్రెండింగ్​లో ఉన్నాయి మరి!

author img

By

Published : May 16, 2020, 11:48 AM IST

Face masks printed with actors are trending in tamilnadu trippur
ఇక సినిమా స్టార్లను ముఖాన కట్టేసుకోండి!
మాస్కుల తయారీ

కరోనా నుంచి తప్పించుకునేందుకు ఇప్పుడు అందరి జీవితాల్లో మాస్క్​ తప్పనిసరి అయిపోయింది. మరి ఎప్పుడూ సాదాసీదా మాస్కులేనా? సూపర్​ స్టార్ మాస్క్​​, మెగా స్టార్ మాస్క్ పెట్టుకుంటే బావుంటుంది కదా? ఎదుటి వారిని నవ్వించే మీమ్​ మాస్క్​ ధరిస్తే అదిరిపోతుంది కదూ? అందుకే, తమిళనాడులో ఓ వస్త్ర పరిశ్రమ తయారు చేసిన ఆ మాస్కులు యమ క్రేజ్​ సంపాదించుకున్నాయి.

లాక్​డౌన్​ 3.0లో 50 మంది ఉద్యోగులతో.. వస్త్ర​ పరిశ్రమలు నడిపేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. దీంతో తిరుప్పూర్​లోని సెంటినల్​ క్లాతింగ్​ సంస్థ మాస్కులు కుట్టడం ప్రారంభించింది. యువకులను ఆకట్టుకునేలా వాటిపై సినీ తారల చిత్రాలను ముద్రించింది. విజయ్​, కమల్​, అజిత్​, రజినీకాంత్​ చిత్రాలే కాదు.. బాగా ట్రెండింగ్​లో ఉన్న కామెడీ మీమ్స్​, ప్రముఖ రాజకీయ నాయకుల ఫొటోలతో ముసుగులు రూపొందించింది.

కొద్ది రోజులకే ఈ స్టార్​ మాస్క్​లకు దేశవ్యాప్తంగా డిమాండ్​ పెరిగింది. దీంతో ఉత్పత్తి మరింత పెంచుతున్నారు పరిశ్రమ యజమాని.

"నేను ఈ నెల ఆరంభం నుంచి మాస్కులు తయారు చేసి భారత దేశమంతా సరఫరా చేస్తున్నాను. సినీ నటీనటుల పోస్టర్లు, మఖ్య రాజకీయ నాయకుల చిత్రాలు ముద్రించి తయారు చేస్తున్నాం. ఇవి ఇప్పుడు ట్రెండ్​గా మారి బాగా అమ్ముడుపోతున్నాయి."

-వస్త్ర పరిశ్రమ యజమాని

ఇదీ చదవండి:వలస తల్లి కుమారుడికి 'సూట్​కేస్​' రథమైంది!

మాస్కుల తయారీ

కరోనా నుంచి తప్పించుకునేందుకు ఇప్పుడు అందరి జీవితాల్లో మాస్క్​ తప్పనిసరి అయిపోయింది. మరి ఎప్పుడూ సాదాసీదా మాస్కులేనా? సూపర్​ స్టార్ మాస్క్​​, మెగా స్టార్ మాస్క్ పెట్టుకుంటే బావుంటుంది కదా? ఎదుటి వారిని నవ్వించే మీమ్​ మాస్క్​ ధరిస్తే అదిరిపోతుంది కదూ? అందుకే, తమిళనాడులో ఓ వస్త్ర పరిశ్రమ తయారు చేసిన ఆ మాస్కులు యమ క్రేజ్​ సంపాదించుకున్నాయి.

లాక్​డౌన్​ 3.0లో 50 మంది ఉద్యోగులతో.. వస్త్ర​ పరిశ్రమలు నడిపేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. దీంతో తిరుప్పూర్​లోని సెంటినల్​ క్లాతింగ్​ సంస్థ మాస్కులు కుట్టడం ప్రారంభించింది. యువకులను ఆకట్టుకునేలా వాటిపై సినీ తారల చిత్రాలను ముద్రించింది. విజయ్​, కమల్​, అజిత్​, రజినీకాంత్​ చిత్రాలే కాదు.. బాగా ట్రెండింగ్​లో ఉన్న కామెడీ మీమ్స్​, ప్రముఖ రాజకీయ నాయకుల ఫొటోలతో ముసుగులు రూపొందించింది.

కొద్ది రోజులకే ఈ స్టార్​ మాస్క్​లకు దేశవ్యాప్తంగా డిమాండ్​ పెరిగింది. దీంతో ఉత్పత్తి మరింత పెంచుతున్నారు పరిశ్రమ యజమాని.

"నేను ఈ నెల ఆరంభం నుంచి మాస్కులు తయారు చేసి భారత దేశమంతా సరఫరా చేస్తున్నాను. సినీ నటీనటుల పోస్టర్లు, మఖ్య రాజకీయ నాయకుల చిత్రాలు ముద్రించి తయారు చేస్తున్నాం. ఇవి ఇప్పుడు ట్రెండ్​గా మారి బాగా అమ్ముడుపోతున్నాయి."

-వస్త్ర పరిశ్రమ యజమాని

ఇదీ చదవండి:వలస తల్లి కుమారుడికి 'సూట్​కేస్​' రథమైంది!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.