ETV Bharat / bharat

తల్లి గర్భంలోనే కరోనాను జయించిన చిన్నారి​!

author img

By

Published : Apr 13, 2020, 6:22 AM IST

కరోనా వైరస్​ సోకిన ఓ తల్లి.. పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. అమ్మ శరీరంలో ఉన్న ఆ మహమ్మారి వైరస్​ను జయించి బయటకు వచ్చాడు. శిశువు పూర్తి సురక్షితంగా ఉన్నట్లు వైద్యులు స్పష్టం చేశారు.

COVID-19 woman gives birth to 'healthy' baby boy in Tamilnadu
కరోనా సోకిన తల్లి కడుపున పుట్టినవాడు సేఫ్​!

తమిళనాడులో కొవిడ్​-19 వైరస్​తో బాధపడుతున్న ఓ మహిళ మగబిడ్డకు జన్మనిచ్చింది. అదృష్టవశాత్తు శిశువు పూర్తి ఆరోగ్యంగా ఉన్నాడని వెల్లడించారు వైద్యులు.

ఇదీ జరిగింది..

గర్భిణిగా ఉన్న ఓ కరోనా బాధితురాలిని.. చికిత్స నిమిత్తం పెరుందురై ఐఆర్​టీ ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో చేర్పించారు. ఆ సమయంలోనే ఆమె ప్రసవ ఘడియలు దగ్గరపడ్డాయి. వెంటనే అత్యంత జాగ్రత్తగా శస్త్ర చికిత్స చేసి పురుడు పోశారు వైద్యులు. తల్లికి సోకిన వైరస్​ బిడ్డకూ చుట్టుకుంటుందేమోనని అంతా భయపడ్డారు. కానీ, ఆ పసికందు కరోనాను జయించాడు. వైరస్​ను కాలదన్ని పూర్తి ఆరోగ్యంగా ఉన్నాడని వైద్యులు ధృువీకరించారు.

మూడు వారాల క్రితం మత బోధనలు చేసేందుకు అదే రాష్ట్రంలోని కొల్లంపాలయం వచ్చిన ఏడుగురు నుంచి కొందరికి వైరస్​ సోకింది. ఆ బాధితుల్లో ఒకరు కిడ్నీ సమస్యతో మృతి చెందగా.. మరో ఆరుగురికి కరోనా పాజిటివ్​ వచ్చినట్లు వైద్యులు తెలిపారు. వారిని కలిసిన 54 మందికి కరోనా సోకిందని.. వారిలో ఈ గర్భిణీ ఉందని నిర్ధారించారు.

ఇదీ చదవండి:దోస్త్​ను సూట్​కేస్​లో కుక్కి ఫ్లాట్​లోకి గప్​చుప్​గా...

తమిళనాడులో కొవిడ్​-19 వైరస్​తో బాధపడుతున్న ఓ మహిళ మగబిడ్డకు జన్మనిచ్చింది. అదృష్టవశాత్తు శిశువు పూర్తి ఆరోగ్యంగా ఉన్నాడని వెల్లడించారు వైద్యులు.

ఇదీ జరిగింది..

గర్భిణిగా ఉన్న ఓ కరోనా బాధితురాలిని.. చికిత్స నిమిత్తం పెరుందురై ఐఆర్​టీ ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో చేర్పించారు. ఆ సమయంలోనే ఆమె ప్రసవ ఘడియలు దగ్గరపడ్డాయి. వెంటనే అత్యంత జాగ్రత్తగా శస్త్ర చికిత్స చేసి పురుడు పోశారు వైద్యులు. తల్లికి సోకిన వైరస్​ బిడ్డకూ చుట్టుకుంటుందేమోనని అంతా భయపడ్డారు. కానీ, ఆ పసికందు కరోనాను జయించాడు. వైరస్​ను కాలదన్ని పూర్తి ఆరోగ్యంగా ఉన్నాడని వైద్యులు ధృువీకరించారు.

మూడు వారాల క్రితం మత బోధనలు చేసేందుకు అదే రాష్ట్రంలోని కొల్లంపాలయం వచ్చిన ఏడుగురు నుంచి కొందరికి వైరస్​ సోకింది. ఆ బాధితుల్లో ఒకరు కిడ్నీ సమస్యతో మృతి చెందగా.. మరో ఆరుగురికి కరోనా పాజిటివ్​ వచ్చినట్లు వైద్యులు తెలిపారు. వారిని కలిసిన 54 మందికి కరోనా సోకిందని.. వారిలో ఈ గర్భిణీ ఉందని నిర్ధారించారు.

ఇదీ చదవండి:దోస్త్​ను సూట్​కేస్​లో కుక్కి ఫ్లాట్​లోకి గప్​చుప్​గా...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.