తోటి ఏనుగులతో పోరాడి గజరాజు మృతి! - ఛత్తీస్గఢ్లో మరో ఏనుగు మృతి
ఛత్తీస్గఢ్ సూరజ్పుర్లో మరో ఏనుగు మృత్యువాతపడింది. ఇతర ఏనుగులతో పోరాటం చేయడం వల్లనే ఇది మృతి చెందినట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. పోస్టుమార్టం తరువాత నిజానిజాలు వెల్లడవుతాయని అటవీశాఖ అధికారులు తెలిపారు.
![తోటి ఏనుగులతో పోరాడి గజరాజు మృతి! carcass of female elephant found in pratappur forest range of surajpur](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7539553-thumbnail-3x2-tusker.jpg?imwidth=3840)
ఛత్తీస్గఢ్ సూరజ్పుర్లోని ప్రతాప్పుర్ అటవీ ప్రాంతంలో ఓ ఏనుగు మృతదేహాన్ని అటవీశాఖ అధికారులు గుర్తించారు. ఇతర ఏనుగులతో పోరాటం చేయడం వల్లనే ఈ గజరాజు మరణించినట్లు భావిస్తున్నారు.
"కొద్ది రోజులుగా గణేశ్పుర్ పరిసర ప్రాంతాల్లో ఓ ఏనుగుల గుంపు సంచరిస్తోంది. ఈ మందలో కనీసం 18 ఏనుగులు ఉన్నట్లు తెలుస్తోంది. ఆ గుంపులోని మగవాటితో చేసిన పోరాటంలోనే ఈ ఏనుగు మరణించినట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నాం. చుట్టూ ఉన్న చెట్లు కూడా విరిగిపడి ఉండడం దీనికి బలం చేకూరుస్తోంది. ఏది ఏమైనా పోస్టుమార్టం తరువాత ఏనుగు మృతికి గల కచ్చితమైన కారణాలు తెలుస్తాయి."
- మనోజ్ విశ్వకర్మ, ప్రతాప్పుర్ ఎస్డీఓ
20 రోజుల క్రితం కంజ్వారీ ప్రాంతంలో ఇలానే ఓ ఏనుగు మృతదేహం లభ్యమైంది. ఘటనా స్థలంలో ఉన్న ఓ తుపాకీని అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఇదీ చూడండి: ఇరుకైన దారిలో: జాలువారే సెలయేరు.. జారితే బేజారు