ఓ గొర్రెల కాపరి.. తన మందతో సహా ఐదు రోజులుగా నది మధ్యలో ఉన్న ద్వీపంలో చిక్కుకుపోయాడు.
![A shepherd gets stuck in the island from past 5 days due to Krishna river flood](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8352291_shepherd.jpg)
ఏం జరిగింది..?
కర్ణాటక యాదగిరి జిల్లా హుణసగి తాలుకాలోని గిరిజన ప్రాంతానికి చెందిన టొప్పన్న అనే వ్యక్తి 5 రోజుల కిందట గొర్రెల మందను మేపడం కోసం కృష్ణా నదిలోని ఓ ద్వీపానికి వెళ్లాడు. అయితే తిరిగి ఇంటికెళ్దామనుకునే లోపు.. కృష్ణా నది ప్రవాహం పెరిగింది. ఇక చేసేదేమీ లేక తన గొర్రెల మందతో సహా అక్కడే ఉండిపోయాడు.
విషయం తెలసుకున్న స్థానిక తహసీల్దార్ సహాయక చర్యలు చేపట్టారు. కృష్ణానది పరివాహక ప్రాంతానికి చేరుకున్నారు. ఎన్డీఆర్ఎఫ్ బృందం సాయంతో కాపరిని, గొర్రెలను రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు.
![A shepherd gets stuck in the island from past 5 days due to Krishna river flood](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8352291_shepherdka.jpg)
ఇదీ చదవండి: ఇమ్యూనిటీ బూస్టర్ 'ఆయుష్ చిక్కీ'తో కరోనా పరార్!