ETV Bharat / bharat

వైద్య సిబ్బందిని కొట్టిన ఆ ఐదుగురికి కరోనా

author img

By

Published : Apr 24, 2020, 5:22 PM IST

కర్ణాటకలో ఇటీవల వైద్యసిబ్బందిపై దాడి చేసి అరెస్టైన వారిలో.. ఐదుగురికి కరోనా సోకినట్లు నిర్ధరణ అయ్యింది. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించినట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అశ్వత్​ నారాయణ్​ తెలిపారు. మిగిలిన వారిని బెంగళూరులోని జైలు నుంచి హజ్​ భవన్​కు తరలించే ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.

5 arrested for attack on health workers test positive for COVID-19 in Karnataka
వైద్యసిబ్బందిని కొట్టిన ఆ ఐదుగురికి కరోనా

బెంగళూరులోని పాద్రాయణపురలో వైద్య సిబ్బందిపై దాడి కేసు నిందితుల్లో ఐదుగురికి కరోనా పాజిటివ్​గా తేలడం కలకలం రేపింది. వారిని ఆసుపత్రికి తరలించి అందిస్తున్నారు.

మరో 121 మందిపై ప్రత్యేక దృష్టి

ఇటీవల కొందరిని క్వారంటైన్​ చేసేందుకు పాద్రాయణపురకు వెళ్లిన వైద్య సిబ్బందిపై దాడికి సంబంధించి 126 మందిని అరెస్టు చేశారు అధికారులు. వారందరినీ రామనగర సమీపంలోని జైలుకు తరలించారు. గురువారం రిమాండ్​లో ఉన్న ఇద్దరికి వైరస్​ సోకినట్లు తేలగా.. మరో ముగ్గురికి శుక్రవారం పాజిటివ్​గా నిర్ధరణ అయింది.

రామనగర ప్రాంతంలో ఇప్పటివరకు ఒక్క కరోనా కేసైనా నమోదు కాలేదు. అలాంటి చోట వైరస్​ సోకిన వారితో సంబంధమున్న వారిని ఉంచడంపై జేడీఎస్​ అధినేత, మాజీ ముఖ్యమంత్రి హెచ్​.డి. కుమారస్వామి అభ్యంతరం తెలిపారు. వారందరినీ మరొక చోటకు తరలించాలని డిమాండ్​ చేశారు. అవసరమైతే ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. వెంటనే అప్రమత్తమైన ప్రభుత్వం.. మిగిలిన 121 మందిని హజ్​ భవన్​లో నిర్బంధంలో ఉంచేందుకు ఏర్పాట్లు చేసింది.

బెంగళూరులోని పాద్రాయణపురలో వైద్య సిబ్బందిపై దాడి కేసు నిందితుల్లో ఐదుగురికి కరోనా పాజిటివ్​గా తేలడం కలకలం రేపింది. వారిని ఆసుపత్రికి తరలించి అందిస్తున్నారు.

మరో 121 మందిపై ప్రత్యేక దృష్టి

ఇటీవల కొందరిని క్వారంటైన్​ చేసేందుకు పాద్రాయణపురకు వెళ్లిన వైద్య సిబ్బందిపై దాడికి సంబంధించి 126 మందిని అరెస్టు చేశారు అధికారులు. వారందరినీ రామనగర సమీపంలోని జైలుకు తరలించారు. గురువారం రిమాండ్​లో ఉన్న ఇద్దరికి వైరస్​ సోకినట్లు తేలగా.. మరో ముగ్గురికి శుక్రవారం పాజిటివ్​గా నిర్ధరణ అయింది.

రామనగర ప్రాంతంలో ఇప్పటివరకు ఒక్క కరోనా కేసైనా నమోదు కాలేదు. అలాంటి చోట వైరస్​ సోకిన వారితో సంబంధమున్న వారిని ఉంచడంపై జేడీఎస్​ అధినేత, మాజీ ముఖ్యమంత్రి హెచ్​.డి. కుమారస్వామి అభ్యంతరం తెలిపారు. వారందరినీ మరొక చోటకు తరలించాలని డిమాండ్​ చేశారు. అవసరమైతే ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. వెంటనే అప్రమత్తమైన ప్రభుత్వం.. మిగిలిన 121 మందిని హజ్​ భవన్​లో నిర్బంధంలో ఉంచేందుకు ఏర్పాట్లు చేసింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.