ETV Bharat / bharat

గాల్లో ఉండగా ఇంజిన్ బంద్.. 'టాటా' ఫ్లైట్​కు తప్పిన పెనుముప్పు

author img

By

Published : May 20, 2022, 3:19 PM IST

Flight Emergency Landing: ముంబయి​ నుంచి బెంగళూరుకు పయనమైన ఎయిర్​ ఇండియా విమానం.. బయలుదేరిన కాసేపటికే తిరిగి ముంబయి విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్​ అయింది. సాంకేతిక సమస్యలు తలెత్తడం వల్లే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు.

emergency landing
emergency landing

Flight Emergency Landing: టాటా గ్రూప్​ నడిపిస్తున్న ఎయిర్ఇండియా విమానం గురువారం పెను ప్రమాదం నుంచి బయటపడింది. ముంబయి​ నుంచి బెంగళూరు పయనమైన A320NEO విమానం.. టేకాఫ్​ అయిన 27 నిమిషాలకే తిరిగి ముంబయి విమానాశ్రయానికి చేరుకుంది. గాల్లో ఉండగానే ఓ ఇంజిన్ పనిచేయడం ఆగిపోవడం వల్లే ఇలా​ చేయాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ విచారణ జరుపుతోందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఎయిర్ ఇండియాకు చెందిన A320NEO విమానాలు సీఎఫ్​ఎమ్​ లీప్ ఇంజిన్లు కలిగి ఉంటాయి. అయితే వాటిలో తలెత్తిన సాంకేతిక సమస్య వల్లే ఈ ఘటన జరిగిందని అధికారులు చెప్పారు.

ముంబయి ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి గురువారం ఉదయం 9.43 గంటలకు A320NEO విమానం బయలుదేరింది. కానీ టేకాఫ్​ అయిన కొద్దిసేపటికే ఇంజిన్‌ పనిచేయడం ఆగిపోయిందని గుర్తించారు. అప్రమత్తమైన పైలట్​ వెంటనే 10.10 గంటలకు ముంబయి విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్‌ చేశారని సంబంధిత వర్గాలు తెలిపాయి.

ఈ ఘటనపై ఎయిర్ ఇండియా ప్రతినిధి స్పందించారు. "ఎయిర్ ఇండియా సంస్థ భద్రతకు అత్యంత ప్రాధాన్యమిస్తుంది. మా సిబ్బంది ఎటువంటి పరిస్థితులను అయినా ఎదుర్కొనే నైపుణ్యం కలిగి ఉన్నారు. మా ఇంజనీరింగ్ అధికారులు వెంటనే సమస్యను పరిశీలించడం ప్రారంభించారు. ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా వెనువెంటనే వేరే విమానంలో బెంగళూరుకు చేర్చాం" అని తెలిపారు.

Flight Emergency Landing: టాటా గ్రూప్​ నడిపిస్తున్న ఎయిర్ఇండియా విమానం గురువారం పెను ప్రమాదం నుంచి బయటపడింది. ముంబయి​ నుంచి బెంగళూరు పయనమైన A320NEO విమానం.. టేకాఫ్​ అయిన 27 నిమిషాలకే తిరిగి ముంబయి విమానాశ్రయానికి చేరుకుంది. గాల్లో ఉండగానే ఓ ఇంజిన్ పనిచేయడం ఆగిపోవడం వల్లే ఇలా​ చేయాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ విచారణ జరుపుతోందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఎయిర్ ఇండియాకు చెందిన A320NEO విమానాలు సీఎఫ్​ఎమ్​ లీప్ ఇంజిన్లు కలిగి ఉంటాయి. అయితే వాటిలో తలెత్తిన సాంకేతిక సమస్య వల్లే ఈ ఘటన జరిగిందని అధికారులు చెప్పారు.

ముంబయి ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి గురువారం ఉదయం 9.43 గంటలకు A320NEO విమానం బయలుదేరింది. కానీ టేకాఫ్​ అయిన కొద్దిసేపటికే ఇంజిన్‌ పనిచేయడం ఆగిపోయిందని గుర్తించారు. అప్రమత్తమైన పైలట్​ వెంటనే 10.10 గంటలకు ముంబయి విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్‌ చేశారని సంబంధిత వర్గాలు తెలిపాయి.

ఈ ఘటనపై ఎయిర్ ఇండియా ప్రతినిధి స్పందించారు. "ఎయిర్ ఇండియా సంస్థ భద్రతకు అత్యంత ప్రాధాన్యమిస్తుంది. మా సిబ్బంది ఎటువంటి పరిస్థితులను అయినా ఎదుర్కొనే నైపుణ్యం కలిగి ఉన్నారు. మా ఇంజనీరింగ్ అధికారులు వెంటనే సమస్యను పరిశీలించడం ప్రారంభించారు. ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా వెనువెంటనే వేరే విమానంలో బెంగళూరుకు చేర్చాం" అని తెలిపారు.

ఇవీ చదవండి: బడి చుట్టూ నీరు.. పడవలో వెళ్తేనే పాఠం.. పాపం అక్కడి పిల్లలు..

డీజిల్​ ట్యాంకర్​-ట్రక్కు ఢీ.. 9 మంది సజీవ దహనం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.