ETV Bharat / bharat

వీధి కుక్కలపై యాసిడ్​తో దాడి, బాలుడి పైశాచికత్వం

author img

By

Published : Aug 26, 2022, 5:26 AM IST

వీధి కుక్కలపై యాసిడ్ పోస్తూ పైశాచిక ఆనందం పొందాడో బాలుడు. దాడికి సంబంధించిన దృశ్యాలన్నీ సీసీటీవీలో రికార్డయ్యాయి. చత్తీస్​గఢ్​ రాయ్​పుర్​లో జరిగిందీ ఘటన.

Acid Attack on Dogs
a minor attacked stray dogs with acid in raipur

Acid Attack on Dogs: వీధి కుక్కలపై యాసిడ్​ పోశాడో బాలుడు. గత కొద్ది రోజులుగా కుక్కలపై ఇదే విధంగా యాసిడ్ దాడికి తెగబడుతున్నాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటవ చత్తీస్​గఢ్ రాజధాని రాయ్​పుర్​లో జరిగింది.

వివరాల్లోకెళ్తే.. రాయ్​పుర్​లోని కొత్వాళి పోలీస్​ స్టేషన్​ పరిధిలో నివసించే బాలుడు, కుక్కలపై దాడులకు తెగబడుతున్నాడు. ఇప్పటివరకు ఆరు కుక్కలపై యాసిడ్​ పోశాడు. అందులో 5 కుక్కలు తీవ్రంగా గాయపడ్డాయి. గత 15వ తేదీ నుంచి 19వ తేదీ వరకు నిరంతరాయంగా వీధికుక్కలపై యాసిడ్​ పోస్తున్నాడు. ఈ దృశ్యాలన్నీ స్థానిక సదర్ బాజార్​లోని దుకాణాల్లో ఏర్పటు చేసిన సీసీటీవీల్లో రికార్డయియీయు. నాలుగు రోజుల క్రితం ఈ విషయం ​పీపుల్​ ఫర్ యానిమల్స్ అనే సంస్థ ప్రతినిధులకు తెలిసింది. దీంతో వాళ్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం పోలీసులు ఎఫ్​ఐఆర్​ నమోదు చేశారు. సీసీటీవీలో రికార్డైన దృశ్యాలు వైరల్​గా మారాయి.

ఈ ఘటనపై కొత్వాళి పోలీస్​ స్టేషన్ ఇంచార్జి ఉమేంద్ర కుమార్​ టండన్​ స్పందించారు. కుక్కలపై దాడులు చేసిన బాలుడిపై ఫిర్యాదు అందిందన్నారు. ఫిర్యాదు ప్రకారం బాలుడిపై కేసు నమోదు చేస్తామని తెలిపారు.​

Acid Attack on Dogs: వీధి కుక్కలపై యాసిడ్​ పోశాడో బాలుడు. గత కొద్ది రోజులుగా కుక్కలపై ఇదే విధంగా యాసిడ్ దాడికి తెగబడుతున్నాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటవ చత్తీస్​గఢ్ రాజధాని రాయ్​పుర్​లో జరిగింది.

వివరాల్లోకెళ్తే.. రాయ్​పుర్​లోని కొత్వాళి పోలీస్​ స్టేషన్​ పరిధిలో నివసించే బాలుడు, కుక్కలపై దాడులకు తెగబడుతున్నాడు. ఇప్పటివరకు ఆరు కుక్కలపై యాసిడ్​ పోశాడు. అందులో 5 కుక్కలు తీవ్రంగా గాయపడ్డాయి. గత 15వ తేదీ నుంచి 19వ తేదీ వరకు నిరంతరాయంగా వీధికుక్కలపై యాసిడ్​ పోస్తున్నాడు. ఈ దృశ్యాలన్నీ స్థానిక సదర్ బాజార్​లోని దుకాణాల్లో ఏర్పటు చేసిన సీసీటీవీల్లో రికార్డయియీయు. నాలుగు రోజుల క్రితం ఈ విషయం ​పీపుల్​ ఫర్ యానిమల్స్ అనే సంస్థ ప్రతినిధులకు తెలిసింది. దీంతో వాళ్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం పోలీసులు ఎఫ్​ఐఆర్​ నమోదు చేశారు. సీసీటీవీలో రికార్డైన దృశ్యాలు వైరల్​గా మారాయి.

ఈ ఘటనపై కొత్వాళి పోలీస్​ స్టేషన్ ఇంచార్జి ఉమేంద్ర కుమార్​ టండన్​ స్పందించారు. కుక్కలపై దాడులు చేసిన బాలుడిపై ఫిర్యాదు అందిందన్నారు. ఫిర్యాదు ప్రకారం బాలుడిపై కేసు నమోదు చేస్తామని తెలిపారు.​

ఇవీ చూడండి: ఇప్పటివరకు ఆమె ఓ కానిస్టేబుల్, ఇకపై డీఎస్​పీ

ఆహారం కోసం రైలు దిగిన మహిళపై గ్యాంగ్ రేప్, పోలీస్ స్టేషన్ పక్కనే ఉన్నా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.