ETV Bharat / snippets

ప్రభుత్వాసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం - కుర్చీలోనే ఓ గర్భిణి ప్రసవం

author img

By ETV Bharat Telangana Team

Published : Aug 23, 2024, 12:58 PM IST

LADY DELIVERY ON CHAIR IN HOSPITAL
Woman Gives Birth to Baby on Chair (ETV Bharat)

Woman Gives Birth to Baby on Chair : నల్గొండ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యుల నిర్లక్ష్యంతో కుర్చీలోనే ఓ మహిళ డెలివరీ అయింది. శుక్రవారం తెల్లవారుజామున 3.30 నిమిషాల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పురిటి నొప్పులతో నేరేడుగొమ్మకి చెందిన అశ్విని అనే మహిళ దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లగా అక్కడ వైద్య సిబ్బంది అందుబాటులో లేరని, నల్గొండ వెళ్లాలని చెప్పారు.

అంబులెన్స్‌లో నల్గొండ ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చిన మహిళను వైద్యులు పట్టించుకోలేదు. కాన్పుకు సమయం పడుతున్నా నిర్లక్ష్యం చేశారు. ఈ క్రమంలో బయట కుర్చీలో కూర్చుని వైద్యం కోసం ఎదురుచూస్తుండగానే అశ్విని డెలివరీ అయింది. రక్తస్రావం చూసి సిబ్బంది హడావుడి చేశారు. వైద్యుల తీరుపై బాధితురాలి కుటుంబసభ్యులు మండిపడ్డారు. ఈ విషయం తెలుసుకున్న అదనపు కలెక్టర్ పూర్ణచందర్ ఆసుపత్రికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.

Woman Gives Birth to Baby on Chair : నల్గొండ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యుల నిర్లక్ష్యంతో కుర్చీలోనే ఓ మహిళ డెలివరీ అయింది. శుక్రవారం తెల్లవారుజామున 3.30 నిమిషాల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పురిటి నొప్పులతో నేరేడుగొమ్మకి చెందిన అశ్విని అనే మహిళ దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లగా అక్కడ వైద్య సిబ్బంది అందుబాటులో లేరని, నల్గొండ వెళ్లాలని చెప్పారు.

అంబులెన్స్‌లో నల్గొండ ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చిన మహిళను వైద్యులు పట్టించుకోలేదు. కాన్పుకు సమయం పడుతున్నా నిర్లక్ష్యం చేశారు. ఈ క్రమంలో బయట కుర్చీలో కూర్చుని వైద్యం కోసం ఎదురుచూస్తుండగానే అశ్విని డెలివరీ అయింది. రక్తస్రావం చూసి సిబ్బంది హడావుడి చేశారు. వైద్యుల తీరుపై బాధితురాలి కుటుంబసభ్యులు మండిపడ్డారు. ఈ విషయం తెలుసుకున్న అదనపు కలెక్టర్ పూర్ణచందర్ ఆసుపత్రికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.