ETV Bharat / snippets

వందే భారత్​ ప్రయాణికులకు గుడ్ న్యూస్ - సికింద్రాబాద్ టు విశాఖ రూట్​లో మరో స్టాప్

author img

By ETV Bharat Telangana Team

Published : Aug 23, 2024, 10:25 AM IST

Vande Bharat​ Train New Stop in Eluru
Vande Bharat​ Train New Stop in Eluru (ETV Bharat)

Vande Bharat​ Train New Stop in Eluru : వందే భారత్ రైలులో ప్రయాణం చేసే ప్రయాణికులకు గుడ్​న్యూస్​. సికింద్రాబాద్‌ నుంచి విశాఖపట్నంకు వెళ్లే వందే భారత్​కు కొత్త స్టాప్‌ యాడ్‌ అయింది. గతంలో దీనికి ఆ సౌకర్యం లేక ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లు పడేవారు. అయితే ఈ నెల 25 నుంచి ఈ వందే భారత్‌ రైలు ఏలూరులో కూడా ఆగుతుందని దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్‌వో ఎ.శ్రీధర్‌ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇప్పటి వరకు వందే భారత్‌ రైలుకు విజయవాడ- రాజమహేంద్రవరం మధ్యలో ఒక్క స్టాప్‌ కూడా లేదు. దీంతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యేవారు. అయితే ఏలూరులో అదనపు స్టాప్‌ ఏర్పాటు చేయడం పట్ల ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Vande Bharat​ Train New Stop in Eluru : వందే భారత్ రైలులో ప్రయాణం చేసే ప్రయాణికులకు గుడ్​న్యూస్​. సికింద్రాబాద్‌ నుంచి విశాఖపట్నంకు వెళ్లే వందే భారత్​కు కొత్త స్టాప్‌ యాడ్‌ అయింది. గతంలో దీనికి ఆ సౌకర్యం లేక ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లు పడేవారు. అయితే ఈ నెల 25 నుంచి ఈ వందే భారత్‌ రైలు ఏలూరులో కూడా ఆగుతుందని దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్‌వో ఎ.శ్రీధర్‌ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇప్పటి వరకు వందే భారత్‌ రైలుకు విజయవాడ- రాజమహేంద్రవరం మధ్యలో ఒక్క స్టాప్‌ కూడా లేదు. దీంతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యేవారు. అయితే ఏలూరులో అదనపు స్టాప్‌ ఏర్పాటు చేయడం పట్ల ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.