ETV Bharat / snippets

పింఛన్​ బకాయిల చెల్లింపునకు లంచం డిమాండ్​ - ఇద్దరు ఆలయ అధికారులకు మెమోలు

author img

By ETV Bharat Telangana Team

Published : Sep 12, 2024, 10:30 AM IST

Yadadri Temple
EO Issues Memos to two officers (ETV Bharat)

Yadadri Temple : యాదాద్రి భువనగిరి జిల్లాలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలో ఉద్యోగ విరమణ పొందిన వ్యక్తికి జీతభత్యాలు, పింఛన్​ బకాయిల చెల్లింపునకు ఇద్దరు అధికారులు లంచం డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న యాదాద్రి ఆలయ ఎండోమెంట్​ ఆఫీసర్ ​(ఈవో) భాస్కర్ రావు ఆ అధికారులకు మెమో జారీ చేశారు. దేవస్థానం పరిపాలన విభాగంలో పని చేసే ఇద్దరు అధికారులకు మెమోలు జారీ చేసినట్లు ఆలయ ఈవో భాస్కర్ రావు వెల్లడించారు.

పదవీ విరమణ పొందిన ఎట్టబోయిన రాములుకు రావాల్సిన బకాయిల విషయంలో సూపరింటెండెంట్ దాసోజు నరేశ్, సీనియర్ అసిస్టెంట్ సీతారామమూర్తి రూ.30 వేలు లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి రాగా, వివరణ ఇవ్వాలని వారికి మెమోలు జారీ చేశారు. వారి వివరణ అనంతరం శాఖాపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉందని అధికారవర్గాలు వెల్లడించాయి.

Yadadri Temple : యాదాద్రి భువనగిరి జిల్లాలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలో ఉద్యోగ విరమణ పొందిన వ్యక్తికి జీతభత్యాలు, పింఛన్​ బకాయిల చెల్లింపునకు ఇద్దరు అధికారులు లంచం డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న యాదాద్రి ఆలయ ఎండోమెంట్​ ఆఫీసర్ ​(ఈవో) భాస్కర్ రావు ఆ అధికారులకు మెమో జారీ చేశారు. దేవస్థానం పరిపాలన విభాగంలో పని చేసే ఇద్దరు అధికారులకు మెమోలు జారీ చేసినట్లు ఆలయ ఈవో భాస్కర్ రావు వెల్లడించారు.

పదవీ విరమణ పొందిన ఎట్టబోయిన రాములుకు రావాల్సిన బకాయిల విషయంలో సూపరింటెండెంట్ దాసోజు నరేశ్, సీనియర్ అసిస్టెంట్ సీతారామమూర్తి రూ.30 వేలు లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి రాగా, వివరణ ఇవ్వాలని వారికి మెమోలు జారీ చేశారు. వారి వివరణ అనంతరం శాఖాపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉందని అధికారవర్గాలు వెల్లడించాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.