ETV Bharat / state

హైదరాబాద్​లో చెత్త శుద్ధి కేంద్రాలపై జీహెచ్ఎంసీ కసరత్తు - జవహర్​నగర్​పై తగ్గనున్న ఒత్తిడి - Ghmc Planning To Dumping Yards

author img

By ETV Bharat Telangana Team

Published : 3 hours ago

Dumping Yard Problems In Hyderabad : హైదరాబాద్ మహానగరంలో ఉత్పత్తయ్యే చెత్తతో జవహర్​నగర్ డంపింగ్ యార్డ్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ప్రత్యమ్నాయ మార్గాలు లేక వేలాది టన్నుల చెత్త ఎక్కడికక్కడ పేరుకుపోతుంది. జవహర్​నగర్ డంపింగ్ యార్డుపై ఒత్తిడిని తగ్గించాలని భావిస్తున్న జీహెచ్ఎంసీ ప్రత్యామ్నాయ మార్గాలపై కసరత్తు చేస్తోంది. అందులో భాగంగా నాలుగు జిల్లాలో అనువైన స్థలాలను గుర్తించిన జీహెచ్ఎంసీ అక్కడ వినూత్న, ఆధునిక పద్దతిలో చెత్త శుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది.

Ghmc Planning To Start Dumping Yards In Hyderabad
Dumping Yard Problems In Hyderabad (ETV Bharat)

Ghmc Planning To Start Dumping Yards In Hyderabad: రాష్ట్ర రాజధానిలో చెత్త నిర్వహణపై జీహెచ్ఎంసీ ప్రత్యేక కసరత్తు చేస్తోంది. నగర నలుమూలల నుంచి చెత్తను సేకరించి జవహర్​నగర్ డంపింగ్ యార్డుకు తరలిస్తోంది. జీహెచ్ఎంసీ నుంచి వచ్చే 7 వేల 500 మెట్రిక్ టన్నుల వ్యర్థాలకు అదనంగా మరో 17 మున్సిపాలిటీల చెత్తను కూడా జవహర్​నగర్ డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. దీంతో దుర్వాసనతో ప్రజలు ఇబ్బందిపడుతున్నారు. జవహర్​నగర్ డంపింగ్ యార్డుకు రోజు సుమారు 9 వేల మెట్రిక్ టన్నుల వ్యర్థాలు పోగవుతున్నాయి. ఆ భారాన్ని తగ్గించడంతో పాటు భవిష్యత్ అవసరాల దృష్ట్యా అనువైన స్థలాలను ఎంపిక చేయాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది.

డంపింగ్ యార్డుల స్థలాల గుర్తింపు : హైదరాబాద్​కు అతి సమీపంలో ఉన్న మేడ్చల్, యాదాద్రి, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాలో అధికారుల బృందం పర్యటించి డంపింగ్ యార్డుల కోసం స్థలాలను గుర్తించింది. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం ఖానాపూర్ గ్రామంలో 42.22 ఎకరాలు, సంగారెడ్డి జిల్లా పఠాన్ చెరువు మండలం లక్డారం గ్రామంలో 100 ఎకరాలు, దుండిగల్‌లో 85 ఎకరాలు, చౌటుప్పల్ మండలం మల్కాపూర్ వద్ద 200 ఎకరాలు గుర్తించారు. చెత్త శుద్ధి కేంద్రాల ఏర్పాటుకు గుర్తించిన భూములను జీహెచ్‌ఎంసీకి కేటాయించేందుకు ప్రభుత్వ అనుమతి కోసం ప్రతిపాదనలు పంపాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి ఆయా జిల్లాల కలెక్టర్లను కోరారు.

హైదరాబాద్​లో శుద్ధి కేంద్రాలు : అలాగే సంగారెడ్డి జిల్లాలో ఇది వరకే గుర్తించిన ప్యారానగర్‌లోని 152 ఎకరాల స్థలంలో వినూత్న, ఆధునిక పద్దతైన యూరోపియన్ టెక్నాలజీ ఆధారిత శుద్ధి కేంద్రాల ఏర్పాటుకు అనుమతులు లభించాయి. ఇక్కడ 15 మెగావాట్ల సామర్థ్యంతో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్‌ను, 270 టన్నుల బయోగ్యాస్ ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. పూర్తిగా మూసి ఉండే ట్రక్కుల ద్వారా రవాణా చేసిన వ్యర్థాలను అండర్ గ్రౌండ్ బంకర్​లో వేసి తడి పొడిగా వేరు చేసిన అనంతరం పొడి వ్యర్థాల నుంచి విద్యుత్తు, తడి వ్యర్థాల నుంచి సీబీజీ గ్యాస్​ను తయారు చేస్తారు.

నగరం చుట్టూ డంపింగ్‌ యార్డులు : ఈ క్రమంలో శుద్ధి కేంద్రంలో ఎక్కడ కూడా చెత్తను నిల్వ చేయడం, బహిరంగంగా శుద్ధి చెయ్యడం జరగదు. అందువల్ల ఎలాంటి దుర్వాసన, వ్యర్థ జలాలు విడుదల కావు. పూర్తిగా మూసి ఉండే షెడ్డు లోపల ప్రక్రియ అంతా జరగడం, గాలిని కూడా బయోఫిల్టర్ల ద్వారా శుద్ధి చేసి పునర్వినియోగించడం వల్ల ఎలాంటి దుర్వాసన బయటికిరాదు. ఈ విధానంలోనే ప్రతిపాదన స్థలాల్లో కొత్త డంపింగ్ యార్డులను ఏర్పాటు చేసి జవహర్​నగర్ పై ఒత్తిడి తగ్గించాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. ఈ ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదం తెలిపి స్థలాలను కేటాయిస్తే చెత్త నిర్వహణలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మిగతా నగరాల కంటే మరింత ముందంజలో ఉండనుంది.

పడకేసిన పారిశుద్ధ్యం - ముఖ్య కూడళ్లు, వీధుల్లో చెత్తతో కంపు కొడుతోన్న గద్వాల - Gadwal Municipality Dust issues

ఎవరూ చూడట్లేదని రోడ్లపై చెత్త పడేస్తున్నారా? - ఐతే అంతే సంగతులు - GARBAGE THROWING ON ROADS IN HYD

Ghmc Planning To Start Dumping Yards In Hyderabad: రాష్ట్ర రాజధానిలో చెత్త నిర్వహణపై జీహెచ్ఎంసీ ప్రత్యేక కసరత్తు చేస్తోంది. నగర నలుమూలల నుంచి చెత్తను సేకరించి జవహర్​నగర్ డంపింగ్ యార్డుకు తరలిస్తోంది. జీహెచ్ఎంసీ నుంచి వచ్చే 7 వేల 500 మెట్రిక్ టన్నుల వ్యర్థాలకు అదనంగా మరో 17 మున్సిపాలిటీల చెత్తను కూడా జవహర్​నగర్ డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. దీంతో దుర్వాసనతో ప్రజలు ఇబ్బందిపడుతున్నారు. జవహర్​నగర్ డంపింగ్ యార్డుకు రోజు సుమారు 9 వేల మెట్రిక్ టన్నుల వ్యర్థాలు పోగవుతున్నాయి. ఆ భారాన్ని తగ్గించడంతో పాటు భవిష్యత్ అవసరాల దృష్ట్యా అనువైన స్థలాలను ఎంపిక చేయాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది.

డంపింగ్ యార్డుల స్థలాల గుర్తింపు : హైదరాబాద్​కు అతి సమీపంలో ఉన్న మేడ్చల్, యాదాద్రి, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాలో అధికారుల బృందం పర్యటించి డంపింగ్ యార్డుల కోసం స్థలాలను గుర్తించింది. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం ఖానాపూర్ గ్రామంలో 42.22 ఎకరాలు, సంగారెడ్డి జిల్లా పఠాన్ చెరువు మండలం లక్డారం గ్రామంలో 100 ఎకరాలు, దుండిగల్‌లో 85 ఎకరాలు, చౌటుప్పల్ మండలం మల్కాపూర్ వద్ద 200 ఎకరాలు గుర్తించారు. చెత్త శుద్ధి కేంద్రాల ఏర్పాటుకు గుర్తించిన భూములను జీహెచ్‌ఎంసీకి కేటాయించేందుకు ప్రభుత్వ అనుమతి కోసం ప్రతిపాదనలు పంపాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి ఆయా జిల్లాల కలెక్టర్లను కోరారు.

హైదరాబాద్​లో శుద్ధి కేంద్రాలు : అలాగే సంగారెడ్డి జిల్లాలో ఇది వరకే గుర్తించిన ప్యారానగర్‌లోని 152 ఎకరాల స్థలంలో వినూత్న, ఆధునిక పద్దతైన యూరోపియన్ టెక్నాలజీ ఆధారిత శుద్ధి కేంద్రాల ఏర్పాటుకు అనుమతులు లభించాయి. ఇక్కడ 15 మెగావాట్ల సామర్థ్యంతో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్‌ను, 270 టన్నుల బయోగ్యాస్ ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. పూర్తిగా మూసి ఉండే ట్రక్కుల ద్వారా రవాణా చేసిన వ్యర్థాలను అండర్ గ్రౌండ్ బంకర్​లో వేసి తడి పొడిగా వేరు చేసిన అనంతరం పొడి వ్యర్థాల నుంచి విద్యుత్తు, తడి వ్యర్థాల నుంచి సీబీజీ గ్యాస్​ను తయారు చేస్తారు.

నగరం చుట్టూ డంపింగ్‌ యార్డులు : ఈ క్రమంలో శుద్ధి కేంద్రంలో ఎక్కడ కూడా చెత్తను నిల్వ చేయడం, బహిరంగంగా శుద్ధి చెయ్యడం జరగదు. అందువల్ల ఎలాంటి దుర్వాసన, వ్యర్థ జలాలు విడుదల కావు. పూర్తిగా మూసి ఉండే షెడ్డు లోపల ప్రక్రియ అంతా జరగడం, గాలిని కూడా బయోఫిల్టర్ల ద్వారా శుద్ధి చేసి పునర్వినియోగించడం వల్ల ఎలాంటి దుర్వాసన బయటికిరాదు. ఈ విధానంలోనే ప్రతిపాదన స్థలాల్లో కొత్త డంపింగ్ యార్డులను ఏర్పాటు చేసి జవహర్​నగర్ పై ఒత్తిడి తగ్గించాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. ఈ ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదం తెలిపి స్థలాలను కేటాయిస్తే చెత్త నిర్వహణలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మిగతా నగరాల కంటే మరింత ముందంజలో ఉండనుంది.

పడకేసిన పారిశుద్ధ్యం - ముఖ్య కూడళ్లు, వీధుల్లో చెత్తతో కంపు కొడుతోన్న గద్వాల - Gadwal Municipality Dust issues

ఎవరూ చూడట్లేదని రోడ్లపై చెత్త పడేస్తున్నారా? - ఐతే అంతే సంగతులు - GARBAGE THROWING ON ROADS IN HYD

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.