ETV Bharat / snippets

కర్ణాటక రోడ్డు ప్రమాదంలో తెలంగాణ నేవీ జవాన్​ మృతి - శోకసంద్రంలో గ్రామస్థులు

author img

By ETV Bharat Telangana Team

Published : May 30, 2024, 1:37 PM IST

navy Officer Dies in Road accident
Nalgonda Navy Soldier Died in Karnataka Road Accident (ETV Bharat)

Nalgonda Navy Soldier Died in Karnataka Road Accident : కర్ణాటకలో రోడ్డు ప్రమాదంలో నల్గొండ జిల్లా నేవీ జవాన్​ మారెడ్డి సందీప్​ రెడ్డి(26) మృతి చెందారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం నల్గొండ జిల్లా నకిరేకల్ మండలం నర్సింహాపురానికి చెందిన సందీప్​ రెడ్డి నేవీ జవాన్​గా కర్ణాటకలోని నావెల్​ బేస్​లో సైలర్​గా విధులు నిర్వహిస్తున్నారు. ఈ నెల 28వ తేదీన కర్ణాటకలో రోడ్డు ప్రమాదానికి గురవ్వగా స్థానికులు ఆస్పత్రిలో చేర్పించారు. రెండు రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సందీప్ ఈరోజు మృతి చెందినట్లు అతడి కుటుంబ సభ్యులు తెలిపారు. జవాన్ మృతితో నకిరేకల్ గ్రామమంతా విషాదఛాయలు అలుముకున్నాయి. భారత నేవీ గౌరవవందనంతో అంత్యక్రియలు నిర్వహించారు.

Nalgonda Navy Soldier Died in Karnataka Road Accident : కర్ణాటకలో రోడ్డు ప్రమాదంలో నల్గొండ జిల్లా నేవీ జవాన్​ మారెడ్డి సందీప్​ రెడ్డి(26) మృతి చెందారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం నల్గొండ జిల్లా నకిరేకల్ మండలం నర్సింహాపురానికి చెందిన సందీప్​ రెడ్డి నేవీ జవాన్​గా కర్ణాటకలోని నావెల్​ బేస్​లో సైలర్​గా విధులు నిర్వహిస్తున్నారు. ఈ నెల 28వ తేదీన కర్ణాటకలో రోడ్డు ప్రమాదానికి గురవ్వగా స్థానికులు ఆస్పత్రిలో చేర్పించారు. రెండు రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సందీప్ ఈరోజు మృతి చెందినట్లు అతడి కుటుంబ సభ్యులు తెలిపారు. జవాన్ మృతితో నకిరేకల్ గ్రామమంతా విషాదఛాయలు అలుముకున్నాయి. భారత నేవీ గౌరవవందనంతో అంత్యక్రియలు నిర్వహించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.