ETV Bharat / snippets

విద్యుత్ స్థంభాన్ని ఢీకొట్టిన ట్రాక్టర్​ - ఒకరు మృతి, 12 మందికి తీవ్రగాయాలు

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 24, 2024, 3:47 PM IST

Tractor Hit by Current Pole
Tractor Hit by Current Pole (ETV Bharat)

Labourers Tractor Hit by Current Pole : చిత్తూరు జిల్లా పులిచర్ల మండలం గొట్టిగంటివారిపల్లె సమీపంలో కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి విద్యుత్ స్థంభాన్ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడిక్కడే మృతి చెందగా మరో 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఎలకమాకుల పల్లె వద్ద నీటి ట్యాంకు నిర్మాణ పనులకు వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరగిందని స్థానికులు తెలిపారు. అనంతరం క్షతగాత్రులను తిరుపతిలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాధితులు ఒంగోలుకు చెందిన ఏవీఆర్​ సంస్థలో పనిచేస్తున్న బీహార్, ఒడిశా రాష్ట్రాలకు చెందిన నిర్మాణ రంగ కూలీలుగా పోలీసులు గుర్తించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

Labourers Tractor Hit by Current Pole : చిత్తూరు జిల్లా పులిచర్ల మండలం గొట్టిగంటివారిపల్లె సమీపంలో కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి విద్యుత్ స్థంభాన్ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడిక్కడే మృతి చెందగా మరో 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఎలకమాకుల పల్లె వద్ద నీటి ట్యాంకు నిర్మాణ పనులకు వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరగిందని స్థానికులు తెలిపారు. అనంతరం క్షతగాత్రులను తిరుపతిలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాధితులు ఒంగోలుకు చెందిన ఏవీఆర్​ సంస్థలో పనిచేస్తున్న బీహార్, ఒడిశా రాష్ట్రాలకు చెందిన నిర్మాణ రంగ కూలీలుగా పోలీసులు గుర్తించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.