ETV Bharat / snippets

కశ్మీర్ నుంచి అండమాన్​ ​ వరకు జవాన్ల సైకిల్​ యాత్ర

author img

By ETV Bharat Telangana Team

Published : Sep 6, 2024, 5:36 PM IST

75 years of territorial army
Army cycle yatra (ETV Bharat)

ARMY CYCLE YATRA 5500km: టెరిటోరియల్ ఆర్మీ 75 వసంతాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో సైనిక సిబ్బంది దేశవ్యాప్త సైకిల్ ర్యాలీ చేపట్టారు. కశ్మీర్​లోని సియాచిన్ బేస్ నుంచి మొదలైన సైకిల్ యాత్ర 5500 కి.మీ. ప్రయాణించి అండమాన్ నికోబార్​లోని ఇందిరా పాయింట్​కు చేరుకోనుంది. హైదరాబాద్ చేరుకున్న ఈ బృందం యాత్రను ఆంధ్ర - తెలంగాణ సబ్ ఏరియా జీఓసీ రాకేష్ జెండా ఊపి ప్రారంభించారు.

ఆర్మీలోని వివిధ విభాగాలకు సంబంధించి 26 మంది సైనిక బృందం త్వరలో ఇందిరా పాయింట్ చేరుకుంటుందని తెలిపారు. దేశ భద్రత, రక్షణే ధ్యేయంగా ప్రజల్లో అవగాహన తీసుకువచ్చేందుకు ఈ సైకిల్ యాత్ర చేస్తున్నట్లు వెల్లడించారు. సైకిల్ యాత్ర ముగింపు ప్రాంతమైన ఇందిరా పాయింట్ వద్ద ఆర్మీ విశ్రాంత ఉద్యోగులతో పాటు విశ్రాంత వితంతువులను కూడా కలుస్తామని తెలిపారు. అండమాన్ నికోబార్​లో స్కోబా డ్రైవింగ్ చేస్తూ నీటి అడుగున జాతీయ పతాకాన్ని రెపరెపలాడిస్తామన్నారు.

ARMY CYCLE YATRA 5500km: టెరిటోరియల్ ఆర్మీ 75 వసంతాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో సైనిక సిబ్బంది దేశవ్యాప్త సైకిల్ ర్యాలీ చేపట్టారు. కశ్మీర్​లోని సియాచిన్ బేస్ నుంచి మొదలైన సైకిల్ యాత్ర 5500 కి.మీ. ప్రయాణించి అండమాన్ నికోబార్​లోని ఇందిరా పాయింట్​కు చేరుకోనుంది. హైదరాబాద్ చేరుకున్న ఈ బృందం యాత్రను ఆంధ్ర - తెలంగాణ సబ్ ఏరియా జీఓసీ రాకేష్ జెండా ఊపి ప్రారంభించారు.

ఆర్మీలోని వివిధ విభాగాలకు సంబంధించి 26 మంది సైనిక బృందం త్వరలో ఇందిరా పాయింట్ చేరుకుంటుందని తెలిపారు. దేశ భద్రత, రక్షణే ధ్యేయంగా ప్రజల్లో అవగాహన తీసుకువచ్చేందుకు ఈ సైకిల్ యాత్ర చేస్తున్నట్లు వెల్లడించారు. సైకిల్ యాత్ర ముగింపు ప్రాంతమైన ఇందిరా పాయింట్ వద్ద ఆర్మీ విశ్రాంత ఉద్యోగులతో పాటు విశ్రాంత వితంతువులను కూడా కలుస్తామని తెలిపారు. అండమాన్ నికోబార్​లో స్కోబా డ్రైవింగ్ చేస్తూ నీటి అడుగున జాతీయ పతాకాన్ని రెపరెపలాడిస్తామన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.