Valmiki Jayanti as State Festival: వాల్మీకి జయంతిని రాష్ట్ర పండగగా ప్రకటిస్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 17న అన్ని జిల్లాల్లోనూ వాల్మీకి జయంతి అధికారికంగా నిర్వహించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. అనంతపురంలో రాష్ట్ర స్థాయి వాల్మీకి జయంతి నిర్వహించనుంది. ప్రభుత్వం తరఫున ముఖ్య అతిథిగా బీసి సంక్షేమ శాఖ మంత్రి సవిత పాల్గొననున్నారు.
యువగళం పాదయాత్రలో తాను ఇచ్చిన మరో హామీని సీఎం చంద్రబాబు నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం నెరవేర్చిందని మంత్రి నారా లోకేశ్ స్పష్టంచేశారు. వాల్మీకి జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించాలని బోయ, వాల్మీకి సోదరులు పాదయాత్రలో తనని కలిసి విన్నవించారని గుర్తుచేసుకున్నారు. తెలుగుదేశం పార్టీ బీసీల పుట్టినిల్లు అని, వారి ఆత్మ గౌరవాన్ని పెంచే దిశగా తమ ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు.