ETV Bharat / snippets

రాజన్న సిరిసిల్లలో విషాదం - బస్సు కిందపడి చిన్నారి మృతి

author img

By ETV Bharat Telangana Team

Published : 4 hours ago

5 Year Child Died After Falling Down Bus
A Child Died After Falling Down Bus (ETV Bharat)

5 Year Child Died After Falling Down Bus : ఉదయాన్నే లేచి ఆ చిన్నారి ఇంట్లో అందరితో కలివిడిగా తిరిగి కాలకృత్యాలు తీర్చుకొని బడికి వెళ్లేందుకు బ్యాగ్ వేసుకొని అమ్మ భాయ్ అంటూ బస్సు ఎక్కి బయలుదేరింది. అంతలోనే ఆ చిన్నారిని బస్సు రూపంలో మృత్యువు కబలించడంతో కానరాని లోకానికి వెళ్లిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే, ముస్తాబాద్ మండలం నామాపూర్ గ్రామానికి చెందిన రాజు వెంకటలక్ష్మి దంపతులకు గత కొన్ని సంవత్సరాలుగా పిల్లలు లేకపోవడంతో మనోజ్ఞ(5) అనే చిన్నారిని పెంచుకుంటున్నారు.

తండ్రి రాజు ఉపాధి కోసం సౌదీ వెళ్లగా, తల్లి కుమార్తెను చూసుకుంటూ జీవిస్తోంది. ఈ క్రమంలోనే సోమవారం స్కూల్​కు వెళ్లిన మనోజ్ఞ బస్సు వెనుక టైర్ల కింద పడి మృతిచెందింది. కుమార్తె మరణవార్త తెలుసుకున్న కుటుంబసభ్యులు పాఠశాలకు చేరుకొని చిన్నారి మృతదేహంపై పడి బోరున విలపించారు. అలానే పెద్దఎత్తున ఆందోళనకు దిగారు.

5 Year Child Died After Falling Down Bus : ఉదయాన్నే లేచి ఆ చిన్నారి ఇంట్లో అందరితో కలివిడిగా తిరిగి కాలకృత్యాలు తీర్చుకొని బడికి వెళ్లేందుకు బ్యాగ్ వేసుకొని అమ్మ భాయ్ అంటూ బస్సు ఎక్కి బయలుదేరింది. అంతలోనే ఆ చిన్నారిని బస్సు రూపంలో మృత్యువు కబలించడంతో కానరాని లోకానికి వెళ్లిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే, ముస్తాబాద్ మండలం నామాపూర్ గ్రామానికి చెందిన రాజు వెంకటలక్ష్మి దంపతులకు గత కొన్ని సంవత్సరాలుగా పిల్లలు లేకపోవడంతో మనోజ్ఞ(5) అనే చిన్నారిని పెంచుకుంటున్నారు.

తండ్రి రాజు ఉపాధి కోసం సౌదీ వెళ్లగా, తల్లి కుమార్తెను చూసుకుంటూ జీవిస్తోంది. ఈ క్రమంలోనే సోమవారం స్కూల్​కు వెళ్లిన మనోజ్ఞ బస్సు వెనుక టైర్ల కింద పడి మృతిచెందింది. కుమార్తె మరణవార్త తెలుసుకున్న కుటుంబసభ్యులు పాఠశాలకు చేరుకొని చిన్నారి మృతదేహంపై పడి బోరున విలపించారు. అలానే పెద్దఎత్తున ఆందోళనకు దిగారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.