ETV Bharat / snippets

పిచ్చి కుక్కల స్వైర విహారం - గంట వ్యవధిలో 40 మందిపై దాడులు

author img

By ETV Bharat Telangana Team

Published : 3 hours ago

DOG ATTACK ON PEOPLE
DOG BITE IN BHUPALAPALLI (ETV Bharat)

40 People Injured in Stray Dogs ​Attack : జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలోని భాగిర్తిపేట గ్రామంలో పిచ్చి కుక్కలు స్వైర విహారం చేసి, ఏకంగా 40 మందిని గాయపరిచిన ఘటన చోటుచేసుకుంది. గ్రామస్థుల కథనం ప్రకారం, గ్రామంలో 3 పిచ్చి కుక్కలు గంట వ్యవధిలో గ్రామంలోని పిల్లలు, మహిళలు, వృద్ధులు మొత్తంగా 40 మందిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. క్షతగాత్రులందరికీ వెంటనే స్థానిక వైద్యుడి వద్ద ప్రాథమిక చికిత్స అందించి, మెరుగైన వైద్యం కోసం పరకాల, భూపాలపల్లి ప్రభుత్వాసుపత్రులకు రెండు 108 వాహనాల్లో తరలించారు. గ్రామంలో రోజురోజుకూ కుక్కల బెడద ఎక్కువ అవుతున్నప్పటికీ ఏ ఒక్క అధికారి పట్టించుకోవడం లేదని గ్రామస్థులు వాపోతున్నారు.

40 People Injured in Stray Dogs ​Attack : జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలోని భాగిర్తిపేట గ్రామంలో పిచ్చి కుక్కలు స్వైర విహారం చేసి, ఏకంగా 40 మందిని గాయపరిచిన ఘటన చోటుచేసుకుంది. గ్రామస్థుల కథనం ప్రకారం, గ్రామంలో 3 పిచ్చి కుక్కలు గంట వ్యవధిలో గ్రామంలోని పిల్లలు, మహిళలు, వృద్ధులు మొత్తంగా 40 మందిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. క్షతగాత్రులందరికీ వెంటనే స్థానిక వైద్యుడి వద్ద ప్రాథమిక చికిత్స అందించి, మెరుగైన వైద్యం కోసం పరకాల, భూపాలపల్లి ప్రభుత్వాసుపత్రులకు రెండు 108 వాహనాల్లో తరలించారు. గ్రామంలో రోజురోజుకూ కుక్కల బెడద ఎక్కువ అవుతున్నప్పటికీ ఏ ఒక్క అధికారి పట్టించుకోవడం లేదని గ్రామస్థులు వాపోతున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.