BRS MLAS Fires On Congress Govt : నియోజకవర్గాల్లో ప్రొటోకాల్ ఉల్లంఘనలు జరుగుతున్నాయని, ప్రభుత్వ పెద్దల ప్రోత్సాహంతో ఇన్ఛార్జ్ల పేరిట కాంగ్రెస్ నేతలు పెత్తనం చలాయిస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆరోపించారు. కాంగ్రెస్ నాయకులు ఎక్కడా ప్రొటోకాల్ పాటించడం లేదని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి తెలిపారు.
నియోజకవర్గాల్లో ప్రొటోకాల్ ఉల్లంఘనలు జరుగుతున్నాయి : బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
![ETV Bharat Telangana Team author img](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/telangana-1716536068.jpeg?imwidth=128)
Published : Jul 5, 2024, 4:36 PM IST
![నియోజకవర్గాల్లో ప్రొటోకాల్ ఉల్లంఘనలు జరుగుతున్నాయి : బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు BRS MLAS Fires On Congress Govt](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/05-07-2024/1200-675-21876640-thumbnail-16x9-brs.jpg?imwidth=3840)
విద్యాశాఖపై తనతో సమీక్షకు వచ్చిన ఎంఈఓలకు డీఈఓ నోటీసులు ఇచ్చారని, జెడ్పీలో నిలదీస్తే తనపై కేసుపెట్టారని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మండిపడ్డారు. కల్యాణలక్ష్మి చెక్కుల విషయంలో హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి మొట్టికాయలు వేసిందని విమర్శించారు. తనపై కేసులు పెట్టినా భయపడేది లేదని కేసీఆర్ శిష్యునిగా ప్రజల కోసం జైలుకు వెళ్లేందుకూ సిద్ధమన్నారు. కేసీఆర్పై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలను ఎమ్మెల్యే సంజయ్ ఖండించారు. మంచిపనులు చేస్తే గొప్పవారు అవుతారు తప్ప కేసీఆర్ను తిడితే కాలేరని సూచించారు. అధికారం ఉందని విర్రవీగొద్దని అన్నారు.
BRS MLAS Fires On Congress Govt : నియోజకవర్గాల్లో ప్రొటోకాల్ ఉల్లంఘనలు జరుగుతున్నాయని, ప్రభుత్వ పెద్దల ప్రోత్సాహంతో ఇన్ఛార్జ్ల పేరిట కాంగ్రెస్ నేతలు పెత్తనం చలాయిస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆరోపించారు. కాంగ్రెస్ నాయకులు ఎక్కడా ప్రొటోకాల్ పాటించడం లేదని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి తెలిపారు.
విద్యాశాఖపై తనతో సమీక్షకు వచ్చిన ఎంఈఓలకు డీఈఓ నోటీసులు ఇచ్చారని, జెడ్పీలో నిలదీస్తే తనపై కేసుపెట్టారని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మండిపడ్డారు. కల్యాణలక్ష్మి చెక్కుల విషయంలో హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి మొట్టికాయలు వేసిందని విమర్శించారు. తనపై కేసులు పెట్టినా భయపడేది లేదని కేసీఆర్ శిష్యునిగా ప్రజల కోసం జైలుకు వెళ్లేందుకూ సిద్ధమన్నారు. కేసీఆర్పై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలను ఎమ్మెల్యే సంజయ్ ఖండించారు. మంచిపనులు చేస్తే గొప్పవారు అవుతారు తప్ప కేసీఆర్ను తిడితే కాలేరని సూచించారు. అధికారం ఉందని విర్రవీగొద్దని అన్నారు.